Connect with us

Featured

కార్తిక దీపం : అభిమానులకు అన్యాయం చేసిన వంటలక్క.. మోనిత బెదిరించడంతో విషం తాగి…

కార్తీకదీపం సీరియల్ ఈ రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను నెలకొల్పుతుంది.ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆనందరావు

Published

on

కార్తీకదీపం సీరియల్ ఈ రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను నెలకొల్పుతుంది.ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆనందరావు కు కార్తీక్ ట్రీట్మెంట్ చేయగా తనతో ట్రీట్మెంట్ చేయించుకోని కార్తీక్ మోహన్ చూడటానికి ఇష్ట పడక పోవటంతో కార్తీక్ బదులు డాక్టర్ గోవర్ధన్ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ఈ రోజు కార్తీక దీపం1100 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం…

Advertisement
karthika deepam
karthika deepam

ఆస్పత్రి బయట ఆదిత్య, కార్తీక్, దీప దిగాలుగా ఉంటారు. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఏమైంది కార్తీక్? అంకుల్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతారు. అంకుల్ కు వెంటనే యాంజియో గ్రామ్ చేయాలి.. స్టంట్ కూడా పడొచ్చు అంటాడు. అప్పుడు కార్తీక్ ఫార్మాలిటీస్ పూర్తి చేయని చెప్పడంతో ఆదిత్య డాక్టర్ వెంట వెళ్తాడు. ఇక తండ్రి అన్న మాటలను గుర్తు చేసుకుని కార్తీక్ ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు దీప ఏమైంది డాక్టర్ బాబు అలా ఉన్నారు అని అడగగా… పాముతో స్నేహం చేస్తే నేను కూడా ఆ పుట్టలో పుట్టిన వాడినా.. నేను మోనితతో చేసిన స్నేహం నన్ను ఎలాంటి పరిస్థితికి తీసుకు వచ్చింది చూడు. ఈ రోజు నా తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు. రేపు సమాజం వెళ్లి వేస్తుంది అంటూ దీప భుజంపై తలవాల్చి బాధపడతాడు.

ఎందుకు డాక్టర్ బాబు మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు? న్యాయం మీ వైపు ఉంది.. నేను మీ వైపే ఉన్నాను అంటూ దీప కార్తీక్ కు భరోసా ఇస్తుంది. అలా బయటకి వెళ్దాం పదండి డాక్టర్ బాబు అని కార్తీక్ ని బయటకు తీసుకువెళ్తుండగా దీపా అడ్డుపడి కార్తీక్ బయటకి వెళ్దాం అంటుంది. నేను నీతో రాను.. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు చేసిందంతా చేసి అంటాడు కార్తీక్. మామయ్యకు హార్ట్ ఎటాక్ వస్తే నా తప్పేముంది? అసలు నీకు ఏం సంబంధమని కార్తీక్ ప్రశ్నించగా.. అలా అంటావేంటి కార్తీక్.. నీ పిల్లలను దీప కడుపులో మోసింది. నేను మోస్తున్నాను.. మా ఇద్దరికీ ఏం తేడా ఉంది? ఒక తాళి మాత్రమే తక్కువ.. 25వ తేదీ ఆ తాళి కూడా పడిపోతే మేమిద్దరం నీకు భార్యలు.. ఇందులో తప్పేముంది అని ప్రశ్నిస్తుంది.

ఇంతలో దీప కల్పించుకొని మరీ ఏం మొహం పెట్టుకుని వచ్చావే ఇక్కడికి మామయ్య ప్రాణాలను రిస్క్ లో పెడదామన అనడంతో అదేంటి దీప అలా అంటావు తన ఇద్దరికీ మామయ్య కదా… దీప ఏదో చెప్పబోతుంటే రా కార్తీక్ అర గంటపని ఉందంటూ కార్తీక్ చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడు దీప వెళ్ళండి డాక్టర్ బాబు 25 వ తేదీ పెళ్లి కదా పెళ్లి పనులు చూసుకోవాలి కదా నేను కూడా వెళ్లి ఈ పెళ్లిని ఎలా పెటాకులు చేయాలో చూసుకుని వస్తాను. ఈ సమయంలో అంజి ఉంటే బాగుండు అని అనడంతో మోనిత షాక్ అవుతుంది. ఏంటి దీని దైర్యం అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

Advertisement

దీప ఇంట్లో భాగ్యం కార్తీక్ అందరూ కూర్చొని ఉండగా అక్కడకు మోనిత విషం కలిపిన నీళ్లను బాటిల్ లో తీసుకొని వెళుతుంది. దీప ఇంటికి వెళ్లి అందరినీ బెదిరించడంతో భాగ్యం తనను కొట్టడానికి వెళుతుంది.నాకు తెలుసు నువ్వు కొట్టడానికి వస్తావని అందుకే ఇందులో విషం కలిపిన నీరు తీసుకు వచ్చాను అని చూపిస్తుంది. నువ్వు నన్ను కొట్టడానికి వస్తే… నేను ఈ విషయం నీళ్లు తాగుతా అంటూ.. బెదిరించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో దీప తాగనీవ్వండి డాక్టర్ బాబు.. తాగితే దీని ప్రాణాలే కదా పోయేది… ఈ నీళ్లు తాగితే నువ్వెలా చస్తావు చూస్తానంటూ బాటిల్ మోనిత దగ్గరకు జరుపుతూ వెళుతుంది.మోనిత బాటిల్ ముట్టుకోకపోయేసరికి పోనీ నేను తాగన అంటూ బాటిల్ మూత తీసి దీప విషం కలిపిన నీళ్లను తాగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? కథ ఎక్కడికి దారి తీస్తుంది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!