Connect with us

Political News

గ్రామాలను యూనిట్గా తీసుకుని వ్యాక్సిన్ వేయాలి_ సీఎం జగన్

Published

on

ఏపీలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని జగన్‌ అధికారులను సూచించారు. ఉపాధ్యాయులు సహా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ త్వరగా చేయాలన్నారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకొని వ్యాక్సిన్​ వేయాలని ఆదేశించారు.

కాగా ఆధార్‌కార్డు నంబర్‌తో ఆరోగ్యశ్రీ కార్డులను లింక్‌చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. గ్రామాల నుంచి ఆసుపత్రుల వరకు సిబ్బంది నియామకం జరగాలని సూచించారు.

Advertisement

Featured

YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?

Published

on

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై 4వ తేదీ నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నారు. నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించడానికి వెళ్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు మూలాఖత్ అయ్యారు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో విజయం తమదేనని చాలా ధీమా వ్యక్తం చేశారు కానీ ఫలితాలు ఊహించిన విధంగా రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం నుంచి ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తిరిగి పరామర్శించడానికి అలాగే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కేడర్ కి సూచించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా తెలిపారు.

Advertisement

పిన్నెల్లితో మూలాఖత్…

ఇక త్వరలోనే తాను ప్రజలలోకి రాబోతున్నానని జగన్ వెల్లడించారు. ఈ తరుణంలోనే ముందుగా అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించబోతున్నారు. ఇన్ని రోజులపాటు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తాడేపల్లి నుంచి నేరుగా నెల్లూరుకు హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన జైలుకు వెళ్లబోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ambani Family: సామూహిక వివాహాలు చేసిన అంబానీ కుటుంబం.. కానుకల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Published

on

Ambani Family: భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే.తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహం మరికొద్ది రోజులలో జరగబోతుంది వీరి వివాహం జులై 12వ తేదీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇలా తన కొడుకు పెళ్లి కావడంతో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ఎంతోమంది పేదవారికి సామూహిక వివాహాలు జరిపించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సామూహిక వివాహాలు జరిపించిన అనంతరం వధూవరులకు ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ఇచ్చిన కానుకులకు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెళ్లి చేసుకున్న వధూవరులకు మంగళసూత్రంతో పాటు ఉంగరాలను అలాగే కొన్ని వెండి వస్తువులను కానుకగా అందజేశారు.

వీటితోపాటు ప్రతి వధువుకు ‘స్త్రీధన్’గా రూ. 1.01 లక్షల చెక్కును అందించారు. జంటలకు సంవత్సరానికి సరిపడా కిరాణా సామాగ్రి, గృహోపకరణాలను కూడా పొందారు. ఇందులో వివిధ రకాలైన 36 అవసరమైన వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్ వంటి వస్తువులను కానుకగా అందజేయడమే కాకుండా పెళ్లి తర్వాత వివిధ రకాల వంటలతో విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

లక్షల విలువ చేసే కానుకలు..
ఇలా సామూహిక వివాహాలు జరపడంతో పాటు వధూవరులకు ఈ స్థాయిలో కానుకలు అందజేశారు అంటే అంబానీ రేంజ్ ఏమిటో అక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తన కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో భాగంగా పలువురు సెలబ్రిటీలందరూ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

AP: సచివాలయ సిబ్బందికి మరో బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే.. బాబు వాడకం మామూలుగా లేదు?

Published

on

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకురావడమే కాకుండా కొత్తగా 1,20,000 కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగస్తులను నియమింప చేశారు. ఈ క్రమంలోనే ఆ గ్రామ పరిధిలో ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న సచివాలయంలోనే ఆ సమస్యకు పరిష్కారమయ్యే విధంగా ఒకసారి కొత్త వ్యవస్థను గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారు.

ఇకపోతే వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. వాలంటీర్లను ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించి ఆ 50 ఏళ్ల అవసరాలను వాలంటీర్ల ద్వారా సచివాలయంలో పరిష్కారం తెలియజేసేవారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేసారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాలంటీర్ సేవలను కూడా సచివాలయం సిబ్బందితోనే నిర్వహిస్తూ ఉన్నారు.

ఇటీవల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లు లేకపోయినా సచివాలయ ఉద్యోగస్తులు ద్వారానే పింఛన్లను పంపిణీ చేశారు. ఇకపోతే సచివాలయ ఉద్యోగస్తులకు చంద్రబాబు నాయుడు మరో కీలక బాధ్యత అప్పగించబోతున్నారని తెలుస్తుంది. గ్రామాల్లో చదువుకున్న యువత ఎంత మంది ఉన్నారు. వారు ఏఏ రంగాల్లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాలతోపాటు పలు విషయాలపై ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగస్తులకు అప్పగించబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

స్కిల్ సెన్సెస్…
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన సంతకాలలో స్కిల్ సెన్సెస్ ఫైలు కూడా ఒకటి దీని ద్వారా వివిధ కోర్సులలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందజేసి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ బాధ్యతలను కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించడం గమనార్హం.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!