Varalakshmi : అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు వంటివి వింటూనే ఉంటాము. రోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. అత్తింటి ముందు ధర్నాలు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా రోజూ చూస్తున్నవే, వీటిలో ఎంతమందికి న్యాయం జరుగుతోందో కుడా తెలియదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటి పడుతున్నారు ఈ రోజుల్లో, ఇంకా ఇలా కట్నాలు కానుకల్తో పెళ్లిళ్లు చేస్తున్న అమ్మాయిల తల్లిదండ్రులను తప్పుబట్టాలో లేకపోతే కొడుకును బేరానికి పెట్టే తల్లిదండ్రులను తప్పుబాట్టాలో తెలియదు. ఇక పోతే ఇలాంటి ఒక ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి మహిళను అదనపు కట్నం కోసం వేదిస్తూ ఉన్నారని ధర్నాకు దిగింది.
సునీత కు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసింది…
అరవింద్ అనే వ్యక్తి వరలక్ష్మి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకుని తొమ్మిది నెలలుగా వేదిస్తున్నాడు. అదనపు కట్నం కోసం టార్చర్ చేస్తున్నాడు. ఇక అత్త, మామ ఆడ పడుచు కూడా వేదిస్తూ ఇంట్లోనే బందించారు అంటూ బాధిత మహిళ మాట్లాడారు. తన భర్త మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా పనిచేస్తున్నాడు. ఎమ్ టెక్ చదివిన వరలక్ష్మి ని తల్లిదండ్రులు ఇండస్ట్రీకి సంబంధిచిన వ్యక్తి నెలకు ఆరు లక్షలు జీతం అని అరవింద్ కి ఇచ్చి పెళ్లి చేసారు. పెళ్లి సమయంలో యాభై తులాల బంగారం, యాభై లక్షల కట్నం ఇచ్చారు. అదంతా అత్త దగ్గరే పెట్టుకుని తనను అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఇక సింగిర్ సునీత ఫోన్ నెంబర్ తీసుకుని అరవింద్ గురించి చెప్పి న్యాయం చేయని అడిగితే ఇలా ఫోన్ చేయొద్దు, నా దాకా వస్తే చూస్తా ఇలాంటి విషయాల కోసం నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ కట్ చేసింది అంటూ వరలక్ష్మి ఆరోపించింది.
Advertisement
ఇక సింగర్ సునీత ఆ రికార్డింగ్ ను అరవింద్ కి పంపినట్లు అరవింద్ అందరి దగ్గర చెప్పుకుంటున్నాడని వరలక్ష్మి ఆరోపించారు. ఇండస్ట్రీ లో పలుకుబడి ఉందని తెలిసిన రౌడీల ద్వారా తన తండ్రి, సోదరులను చంపిస్తానని బెదిరించాడని వరలక్ష్మి ఆరోపించింది. తాను పల్లెటూరు అమ్మాయిని కావడం వల్ల అందరిలో పరిచయం చేయలేనని, ఇంతవరకు తనకు పుస్తెల తాడు కూడా చేయించలేదని, పెళ్లయ్యాక ఇరవై రోజులు ఆనందంగా ఉన్నానని, ఆ తరువాత ఆడపడుచు తన భర్తతో ఉండనిచ్చేది కాదని ఇంకా కట్నం తెస్తేనే భర్త దగ్గరికి పంపుతామని తిట్టేవారు. ఇక ఒక రోజంతా బాత్ రూమ్ లోనే ఉంచి టార్చర్ చేసారని వరలక్ష్మి ఆరోపించారు.
Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.
Advertisement
చిరు రిజెక్ట్ చేశారా.. ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.
NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.
ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.
Advertisement
శోభన్ బాబు ఇంటికి.. ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
Advertisement
ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..
జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.