Connect with us

Featured

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

Anchor Anasuya: ఈటీవీ మల్లెమాల వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, క్యాష్,

Published

on

Anchor Anasuya: ఈటీవీ మల్లెమాల వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, క్యాష్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పలు రకాల షోలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పండుగ సమయాలలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మల్లే మాల వారు నిర్వహించే కార్యక్రమాలు అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా ఒక ఈవెంట్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?
Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

ఏప్రిల్ 10వ తేదీన శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా మల్లెమాల వారు మరొక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే ఒక ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు యాంకర్ ప్రదీప్, అనసూయలతో పాటుగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ అందరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఇటీవలే ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు.

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?
Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

అయితే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ ప్రోమోలో అనసూయ ఒక చిన్నారిని ఎత్తుకుని ఎమోషనల్ గా ముద్దాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. అయితే అనసూయకు ఇద్దరు కొడుకులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఆమెకు ఒక బిడ్డ లేదు అనే బాధ ఎప్పుడూ ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ. అంతేకాకుండా తన బిడ్డ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పుకొచ్చింది. తాజాగా వదిలిన ప్రోమోలో అనసూయ ఒక చిన్నారిని ఎత్తుకోవడంతో పాటు ముద్దులు పెడుతూ ఎమోషనల్ గా ఆప్యాయంగా మనసుకు హత్తుకుంది.

అనసూయ కల నెరవేరిందా…

దీంతో అనసూయ ఎత్తుకున్న ఆ పాప ఎవరు అన్న చర్చ మొదలయింది. దీంతో చాలామంది ఆ పాపను అనసూయ దత్తత తీసుకుందా? అందుకే స్టేజ్ పై అంత ఎమోషనల్ అయ్యిందా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి అనసూయ చేతిలో ఉన్న ఆ పాప ఎవరు?సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నిజంగానే అనసూయ దత్తత తీసుకుందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరొకవైపు అనసూయ చెప్పిన మాట ప్రకారం అనసూయ మరొక బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారా అనే చర్చలు మొదలయ్యాయి. అంటే త్వరలోనే అనసూయ గుడ్ న్యూస్ చెప్పబోతోందనే రీతిలో కూడా ఆలోచిస్తున్నారు. అనసూయ తనకు బిడ్డ కావాలి అని కోరుకుంటున్నానని అనడంతో అక్కడే ఉన్న యాంకర్ ప్రదీప్ తథాస్తు అని దీవించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాకుండా అనసూయ మాట్లాడిన మాటలకు, ఆమె ఎత్తుకున్న చిన్నారి ఎవరు ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!