అవన్నీ చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదనీ.. చేతులు జోడించి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఛార్మి!

టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలను చేపడుతూ బిజీగా ఉన్నారు. అదికూడా పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే చూసుకుంటున్నారు. అయితే తాజాగా చార్మి ఈ విషయంపై స్పందించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ చార్మి ముంబైలోనే ఉంటున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా మరోసారి కరోనా అడ్డుపడుతోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై వంటి ప్రాంతాలలో రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి విలయ ప్రతాపాన్ని చూసి ఛార్మి చలించిపోయారు. ఇటువంటి పరిస్థితులను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు.. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని ఛార్మి తెలిపారు.

ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని, ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు మీరు ప్రేమించే వ్యక్తుల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండండి అంటూ ఛార్మి చేతులు జోడించి వేడుకున్నారు.