Connect with us

Featured

Director Nandam Harischandra : దాసరి గారి అవమానాలు… మొహాం అద్దంలో చూసుకున్నావా అన్నారు… మందు తాగకపోతే ఎలా డైరెక్టర్ అవుతావు..?: దర్శకుడు నందం హరిశ్చంద్ర

Published

on

Director Nandam Harischandra : దాసరి గారి శిష్యుడు గా తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా వచ్చిన వారిలో నందం హరిశ్చంద్ర రావు ఒకరు. 1973లో ఇండస్ట్రీ లోకి చాలా యాద్రచ్చికంగా వచ్చారు. తండ్రి స్నేహితుడైన ఏంకే మౌళి అనే ఆయన అప్పటికే నిర్మాతగా తెలుగులో స్వర్గం నరకం సినిమా తీశారు. ఆయన దాసరి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. బావ గారు చెల్లి అంటూ దాసరి గారిని ఆయన భార్యను పిలిచేవారట మౌళి గారు. అలా ఆయన ద్వారా దాసరి వద్దకు చేరానని హరిశ్చంద్ర గారు వివరించారు. అప్పటికి దాసరి గారు తాత మనవడు సినిమా మంచి హిట్ తో ఉండగా ఆయన నెక్స్ట్ సినిమా సంసార సాగరం సినిమాకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన హరిశ్చంద్ర గారు ఇక అప్పటి నుండి దాసరి గారి వెన్నంటే ఉన్న శిష్యులలో ఒకరు. అలా ఆయన జీవితం గురించి పుస్తకం రాసారు హరిశ్చంద్ర రావు గారు. అలా దాసరి గారి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఆయన అవమానాలను భరించి గొప్ప డైరెక్టర్ అయ్యారు….

దాసరి గారు తెలుగులో మొదటగా డైరెక్టర్ల రాజ్యాన్ని తెచ్చారు. డైరెక్టర్ కు అంతవరకు విలువ ఇవ్వని ఇండస్ట్రీ లో ఆయన డైరెక్టర్ బట్టి సినిమా హిట్ అవుతుందని నిరూపించిన వారిలో ఒకరిగా నిలిచారు అంటూ అయన తొలినాళ్ళలో ఎదుర్కోన్న ఇబ్బందులను వివరించారు. నాటకాలను డైరెక్ట్ చేస్తూ నటిస్తూ ఉన్న దాసరిగారికి ఒకానొక సినిమా ప్రొడ్యూసర్ పిలిచి అవకాశం ఇస్తానని చెప్పడం వాళ్ళే చెన్నై పిలుచుకుని వెళ్లి ఒక వేషం ఇచ్చారట. అయితే మేకప్ వేయడానికి వచ్చిన అతను మేకప్ వేస్తూ ఎలా వస్తారో నటించడానికి అద్దంలో మొహం చూసుకున్నావా అంటూ అవమానించారట. రాయల్ గా వెళ్ళాను అయినా ఇక్కడ ఈ ఛీత్కారాలు ఏమిటి అని బాధపడిన ఆయన అయినా సినిమాలో నటించలై ఒప్పుకున్నాను అని దిగమింగి వెళ్లారట. అక్కడ చెప్పిన వేషం కాకుండా వేరే వేషం ఇచ్చారట. అదేమని అడిగితే నిర్మాత నీకు నా తరువాతి సినిమాలో మంచి వేషం ఇస్తాను డిస్ట్రిబ్యూటర్లు మార్చేశారు. వారిని కాదని నేను చెప్పే శక్తి లేదని చెప్పారట. అయితే అక్కడ తన స్థానములో ఆ పాత్రలో నటించిన కమెడియన్ సరిగా డైలాగ్ చెప్పకపోవడంతో దాసరిగారు చెప్పగా అందరూ చప్పట్లు కొట్టారట.

Advertisement

ఇక నిర్మాత ఆఫీస్ లోనే టైఫిస్ట్ గా పనిచేస్తున్న ఉన్న దాసరిగారు రచయిత కూడా కావడంతో సదరు నిర్మాత ఒక రచయిత కు పరిచయం చేయగా ఆయనకు పుస్తకాలను చూపించారట దాసరిగారు. అయితే ఆ రైటర్ మందు తాగుతూ నా వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తావా అని అడిగితే చేస్తానని చెప్పారట. అయితే ఆ రైటర్ మందు తాగమంటే నాకు అలవాటు లేదని దాసరి నేను ఒట్టు పెట్టుకున్నాను తాగను అని చెప్పారట. అయితే ఆ రైటర్ కోపంతో మాకు మాత్రం పుట్టుకతో అలవాటు వచ్చిందా మందు తాగకుండా నువ్వు డైరెక్టర్ ఎలా అవుతావు కాలేవు అంటూ అరిచారట. సదరు విషయాలను నందం హరిశ్చంద్ర రావు గారు నేటి తరానికి ఇటువంటివి తెలియాలి అంటూ చెప్పారు.

Continue Reading
Advertisement

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!