Trivikram -Pawan Kalyan:తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా, కెరియర్ పరంగా ఉన్న స్నేహితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మొట్టమొదటిసారిగా వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో వీరీ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి. ఈ సినిమా నుంచి ఇండస్ట్రీలో వీరీ అనుబంధం అలాగే కొనసాగుతూ వస్తోంది.Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?
మాటల మాంత్రికుడుగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగానే తన మాటలతో పవన్ కళ్యాణ్ ను తన మాయలో వేసుకున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా అంటే తప్పనిసరిగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ఉండాల్సిందే. ఇలా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస రీమేక్ చిత్రాలను చేస్తున్నారు.Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?
ఈ రీమేక్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది.అయితే ఈ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు.
ఇక ఈ సినిమా కోసం పని చేసినందుకుగాను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 20 కోట్ల రూపాయలను సంపాదించారు. సాధారణంగా ఒక డైరెక్టర్ సినిమా చేస్తే తీసుకునే పారితోషికాన్ని ఈయన స్క్రీన్ ప్లేకి మాత్రమే తీసుకున్నారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ మాయలోపడి రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు అభిమానులు రీమేక్ చిత్రాలు వద్దు అంటూ అభిమానులు మొత్తుకుంటున్నా ఈయన మాత్రం పూర్తి తెలుగు చిత్రాలను పక్కనపెట్టి వరుస రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.ఇక పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రానికి కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ 20 కోట్ల వరకు డిమాండ్ చేశారని సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. ఏదిఏమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ బంగారు గనిగా మారిపోయాడు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.