Samantha: 500 వందల కోసం ఆ పని చేశా.. ఒక్క పూట భోజనంతో రెండు నెలలు గడిపాను… కన్నీటి కష్టాలను బయటపెట్టిన సమంత!

Samantha: ‘ఏ మాయ చేశావే’ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీని మాయ చేసింది. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా మారింది. వరసగా ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్ తో పాటే కాకుండా కోలీవుడ్ లో కూడా తలపతి విజయ్, సూర్య, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

Samantha: ఒక్క పూట భోజనంతో రెండు నెలలు గడిపాను… కన్నీటి కష్టాలను బయటపెట్టిన సమంత!

విడాకులు తీసుకున్న తరువాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.విడాకుల అనంతరం నుంచి సమంత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది. సమంత చేసిని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా పాట రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప సినిమా విడుదల కాకముందే పాట పెద్ద సక్సెస్ అయింది.

Samantha: ఒక్క పూట భోజనంతో రెండు నెలలు గడిపాను… కన్నీటి కష్టాలను బయటపెట్టిన సమంత!

సమంత గ్లామర్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ కలిసి దేశ వ్యాప్తంగా ఈ ఐటెం సాంగ్ మారుమోగింది. ప్రస్తుతం ఈ సినిమా తరువాత వరసపెట్టి సినిమాలకు కమిట్ అవుతోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా ‘ శాకుంతం’ చేస్తోంది. దీంతో పాటు తెలుగు- తమిళ భాషల్లో ‘యశోద’ సినిమాను కూడా చేస్తోంది. ఇధిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వచ్చా…

ఇదిలా ఉంటే సమంత తన జీవితంలో ఉన్న చీకటి కోణం గురించి వెళ్లడించింది. కేవలం రూ. 500 కూడా పని చేశానని చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు తను ఎదురుకున్న కష్టాలను గురించి ఓ కార్యక్రమంలో వెల్లడించింది. పెద్దపెద్ద వారి ఫంక్షన్లకు గెస్ట్ లను ఆహ్వానించే అమ్మాయిగా పని చేశానంది. కేవలం ఒక పూట భోజనంలో రెండు నెలలు గడపానని గుర్తు చేసుకుంది. డబ్బులు లేక చదువు మానేశానని వెల్లడించింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేద్దాం అనుకుంటే… నీకిది అవసరమా అంటూ.. కుటుంబ సభ్యులు వెనక్కి లాగే ప్రయత్నాలు చేశారని తెలిపింది