Connect with us

Featured

Karthika Deepam : నువ్వే జైల్లో ఉన్నావ్ దీప.. కార్తీక్ మాటలు.. ప్రేక్షకులు కన్నీళ్లు.. కార్తీకదీపం ఒక క్రైమ్ సీరియల్!

Published

on

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇక ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన హైలెట్ సీన్స్ ఏంటో చూద్దాం.. సౌందర్య దీపను ప్రశ్నించడంతో వెంటనే మోనిత వీడియో చూపిస్తుంది. ఇక ఆ వీడియో చూసి కార్తీకే చంపేసి ఉంటాడని అనడంతో అందరు షాక్ అవుతారు. దీప మాత్రం నేను నమ్మను అంటూ ఏడుస్తుంది.

వెంటనే ఆదిత్య మాట్లాడుతూ.. గతంలో కార్తీక్ ఆవేశంలో వచ్చిన విషయాన్ని తెలుపుతాడు. అంతేకాకుండా కార్తీక్ చంపాడు అన్నట్లు మాట్లాడేసరికి దీప చాలా బాధపడుతుంది.

ఇక భాగ్యం కూడా తాను ఆరోజు విన్నది నిజమే అంటూ మాట్లాడేసరికి దీప ఏడుస్తూ కుమిలిపోతుంది. ఎవరు నమ్మటం లేదు అంటూ డాక్టర్ బాబు చెప్పిన మాటలు వల్ల నాకు నమ్మకం ఉంది అంటూ చెప్పి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి బయల్దేరుతుంది.

దారిలో రోషిణికీ ప్రియమణి కనిపించడంతో.. వెంటనే ప్రియమణి మోనిత గురించి, హత్య గురించి మాట్లాడుతుంది. ఆ మాటలు ఏమి వినకుండా రోషిణిని తనను కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంది.

మరోవైపు దీప భోజనం తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లగా కానిస్టేబుల్ అడ్డుపడుతాడు. ఎంత బతిమాలినా కానిస్టేబుల్ లోనికి పంపించడు. అంతలోనే కొత్తమ్మాయిగా కనిపించిన రత్న సీత వచ్చి దీపని తీసుకెళ్తుంది. దీప మాత్రం ఆమె ఎవరు అన్నట్లు చూస్తుంది.

మరోవైపు సౌందర్య హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటుండగా పిల్లలు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మన గురించేనా అంటూ.. నాన్న అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని ప్రశ్నలు వేస్తారు. ఇక పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతారు. పిల్లలు ఏడుస్తుంటే తన దగ్గరికి తీసుకుని ఓదార్చుకుంటుంది.

ఇక కార్తీక్ దగ్గరికి వెళ్లిన దీప..ఇలా చూస్తాను అని ఏనాడు అనుకోలేదు డాక్టర్ బాబు అంటూ బాధపడుతుంది. కార్తీక్.. నా వల్ల నీకు మళ్లీ శిక్ష పడినట్లు అనిపిస్తుంది అంటే ఎమోషనల్ అవుతాడు.

అలా వారి మధ్య మాటలు కాసేపు ఎమోషనల్ గా సాగుతుంది. నాపై ఎందుకు అంత నమ్మకం దీపని ప్రశ్నిస్తాడు కార్తీక్. తప్పు చేయలేనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. పట్టుకోవడానికి ఏ ఆధారం లేనిది ఎలా బయటకు చెప్పను అన్నట్లు మాట్లాడతాడు.

గతంలో తమ దూరమున్న విషయాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంది దీప. మిమ్మల్ని బయటికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తాను అంటూ.. బాధ్యతగా కర్తవ్యం అంటూ మాట్లాడుతుంది.

నువ్వు పిల్లలు అమ్మా నాన్న దగ్గర క్షేమంగా ఉంటారని.. ఎటువంటి లోటు ఉండదు అని కార్తిక్ అనేసరికి.. వెంటనే ఏం లోటూ అని సమాధానాలు చెబుతు ఏడుస్తూ కుంగిపోతుంది.

నన్ను పెళ్లి చేసుకున్న అప్పటి నుంచి నీకు కష్టాలే ఉన్నాయి అని కార్తీక్ అంటాడు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కార్తీక్, దీప మధ్య ఎమోషనల్ గా సాగుతుంది.

అతర్వాత రోషిణి.. ‘దీపను’ మీ ఆయన మోనిత శవాన్ని ఎక్కడ దాచి పెట్టాడు అని అడగమంటుంది.

Featured

Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.

ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.

అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!