Connect with us

Featured

Sreeja Konidela: హీరోయిన్ తో సన్నిహితంగా కళ్యాన్ దేవ్.. అందుకే శ్రీజ పక్కన పెట్టేసిందా?

Sreeja Konidela: ప్రస్తుత కాలంలో సెలబ్రెటీ జంటల్లో విడాకులు తీసుకోవడం సర్వ సాధారణం అయిపోతున్నాయి. నాగచైతన్య- సమంత గతేడాది అక్టోబర్ 2న

Published

on

Sreeja Konidela: ప్రస్తుత కాలంలో సెలబ్రెటీ జంటల్లో విడాకులు తీసుకోవడం సర్వ సాధారణం అయిపోతున్నాయి. నాగచైతన్య- సమంత గతేడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం టాలీవుడ్ తో పాటు ఇతర ఫిలిం ఇండస్ట్రీల్లో కూడా చర్చనీయాంశం అయింది.

Sreeja Kalyan To Sreeja: తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె..! ఇన్‌స్టాలో పోస్టు వైరల్..!

ప్రేమించి.. ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తమ అన్యోన్య బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. భేదాభిప్రాయాలతో సమంత-నాగచైతన్య విడిపోయారు. ఈ విషయం వీరిద్దరి ఫ్యాన్స్ ను కూడా బాధపెట్టింది. అంతే కాదు సగటు తెలుగు అభిమానికి కూడా ఆశ్చర్యం కలిగించింది.

Sreeja Konidela: మెగస్టార్ చిన్న కూతురు విడాకులకు సిద్ధం..? కళ్యాణ్ దేవ్ ఆ హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటమే కారణమా..?
Sreeja Konidela: మెగస్టార్ చిన్న కూతురు విడాకులకు సిద్ధం..? కళ్యాణ్ దేవ్ ఆ హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటమే కారణమా..?

వీరిద్దరు విడాలకు తర్వాత కొన్ని రోజులకే కోలీవుడ్ లో మరో రొమాంటిక్ కపుల్ కూడా విడాకులు తీసుకున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కూడా కోలీవుడ్ పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.


విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు …

ఇక టాలీవుడ్ లో మెగస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా క‌ళ్యాణ్ దేవ్‌కి విడాకులు ఇచ్చింద‌నే వార్త‌లు పుకార్లు షికార్లుగా మారాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే.. గత కొన్ని రోజుల నుంచి కళ్యాణ్ మెగా కుటుంబంతో కలవక పోవడంతో ఈ వార్తలు వస్తున్నాయి. అంతే కాదు అతడి సినిమాలకు మెగా మద్దతు కూడా లేదు. దీంతోనే ఈ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. అంతే కాదు.. సమంత మాదిరిగానే శ్రీజ కూడా తన పేరు పక్కన భర్త పేరును తొలగించడంతో శ్రీజ కూడా సమంత మాదిరిగానే విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.
అంతే కాదు అతడు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోనే శ్రీజ అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడు ఏ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే వార్తలు మాత్రం బయటకు రాలేదు. ఇటీవల కళ్యాణ్ దేవ్ కూడా ఎంతో యాక్టీవ్ గా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పడంతో.. ఈ సందేహాలకు బలాన్ని చేకూరినట్లు అవుతోంది. ఏదేమైనా టాలీవుడ్ లో మరో జంట విడాకులకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు మాత్రం వస్తున్నాయి.

Advertisement

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!