Prathyusha Garimella : హైదరాబాద్ లో శనివారం రాత్రి ఫిల్మ్ నగర్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలోనే ప్రత్యూష గరిమెళ్ల అనే ఫ్యాషన డిజైనర్ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ప్రత్యూష చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రెస్సులు డిజైన్ చేసింది. 35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ లోని బోతిక్ లోని బాత్రూం లో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వాచ్ మెన్ వచ్చి డోర్ తట్టినా స్పందించకపోవడంతో వాచ్మెన్ పోలీసులకు ఫోన్ చేసారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ దొరికింది. మొదట అనుమానస్పద మృతిగా భావించినా ఆమె రాసిన సుసైడ్ నోట్ లభ్యం అవడంతో సుసైడ్ గా భావిస్తున్నారు.
మీకు భారం కాలేను….
తన ఒంటరి జీవితంతో విసిగిపోయానని, ఇది తాను ఆశించిన జీవితం కాదని ఆమె రాసింది. తన తల్లిదండ్రులపై భారం పడకూడదని మరియు ఇలాంటి ఒక పని చేస్తున్నందుకు చింతిస్తున్నానని సుసైడ్ నోట్ లో రాసింది. ఇక ప్రత్యూష మరణం చాలా మంది సినిమా సెలబ్రిటీలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రత్యూష బాలీవుడ్ లో మాధురి దీక్షిత్, దీపిక పడుకొనే, పర్నీత చోప్రా, విద్యాబాలన్, జక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్, జూహి చావ్లా, ఇక ఇటు టాలీవుడ్ లో శృతి హాసన్, ఛార్మి, ఉపాసన, రామ్ చరణ్, రానా వంటి కొంత మంది స్టార్స్ కి డిజైనర్ గా వ్యవహారించింది. ఇక ఉపాసన ప్రత్యూష మరణానికి చింతిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Advertisement
ఉన్నతంగా ఆలోచించే నువ్వు……
My bestie my dearest friend. Gone too soon – Upset/ Pissed / Sad She had the best of everything, career, friends & family – yet succumbed to depression. Post this incident, truly believe that karmic baggage passes through lifetimes. We pray for her peace. 🙏#rip P pic.twitter.com/1aOXixKh85— Upasana Konidela (@upasanakonidela) June 11, 2022
ప్రత్యూష నా ప్రియమైన స్నేహితురాలు.. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రతి విషయంలోనూ ఆమె ఉన్నతంగా ఆలోచించేది. కెరీర్ గురించి, కుటుంబం, స్నేహితుల గురించి గొప్ప నిర్ణయాలే తీసుకునేది. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెషన్కు గురి కావడం బాధ కలిగిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి ట్విట్టర్ వేదికగా కోరుకుంది ఉపాసన. కాగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. ఒంటరితనం, డిప్రెషన్ కి లోనై ఇలాంటి పని చేయడం అందరిని కలచివేస్తుంది. ప్రత్యూష తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారని నెల కిందట కూడా వచ్చి వెళ్లారని ఇక్కడ పని చేసే వాచ్ మెన్ చెప్పారు.
Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.
Advertisement
చిరు రిజెక్ట్ చేశారా.. ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.
NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.
ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.
Advertisement
శోభన్ బాబు ఇంటికి.. ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
Advertisement
ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..
జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.