పృథ్వి రాజ్ ఆమెను గోకాడు.. ఏంటి ఈ దరిద్రం అంటూ ఫైర్ అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ!

సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని 30 ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన కామెడీతోఎంతోమందిని ఆకట్టుకున్న పృథ్విరాజ్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.

పృధ్విరాజ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవిలో ఉన్న పృద్విరాజ్ కొన్ని ఆరోపణల కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై పృథ్వి రాజా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రోలింగ్ అంటే పృథ్వీరాజ్ అని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా చాలామంది తన గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుంటారని అయితే వాటన్నింటి గురించి తను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.అయితే సన్నిహితులు బంధువులు వాటిని చూసినప్పుడు నాకు చెబుతున్నారని, అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనని పృథ్విరాజ్ తెలియజేశారు. కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించలేనివారు, ఎలాంటి పని పాట లేనివారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తుంటారని వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

అయితే గతకొద్ది రోజుల కిందట పృధ్విరాజ్ ఎవరినో గోకారంటూ పెద్ద ఎత్తున నా పై కామెంట్ చేస్తున్నారు. అలా తప్పుడు వ్యాఖ్యలు చేయటం వల్ల నాకు ఏ విధమైనటువంటి నష్టం జరగదని, ఈ సందర్భంగా పృధ్విరాజ్ తెలియజేశాడు. ఏ విధమైనటువంటి పని పాట లేనివారు ఎలాంటి కారణం లేకుండా నాపై పడి ఏడవడం ఎందుకు రా వెధవల్లారా అంటూ పృథ్వి రాజ్ తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.