Connect with us

Featured

కృష్ణం రాజు ని అయన తండ్రి కొరడాతో ఎందుకు కొట్టారో తెలుసా?

Published

on

ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు…. తెలుగు సినీ పరిశ్రమలో అని తెలియని నటుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రితం జనరేషన్లో ఈయన కూడా గొప్ప నటుడు కాబట్టి. కృష్ణం రాజు గారు జనవరి 20, 1940 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. వీరు క్షత్రియ రాజుల వంశస్తులు… విజయనగర సామ్రాజ్యం వారసులు. అయితే ఈయన కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుండి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత మరోసారి నర్సాపురం లోక్ సభ నుండి ఎన్నిక కావడంతో అటల్ బిహారీ వాజ్ పై ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2009 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఎన్నికల్లో నిలబడగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి కాస్త రాజకీయాలకు దూరంగానే ఉన్నారు అని చెప్పవచ్చు.

ఆయన చిన్నప్పటి విషయాలు ఒక కార్యక్రమంలో తెలుపుతూ… నా చిన్నతనంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న గారిని కలవడానికి ఒక పెద్దమనిషి ఇంటికి వచ్చాడని ఆ సమయంలో నేను వారు వచ్చిన కానీ నేను సోఫాలో కాళ్లు జాపుకొని ఉన్నాను. ఇలా ఆ పెద్దమనిషి మా ఇంట్లో ఉన్నంతసేపు నేను అలాగే ఉన్నాను. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఉన్న ఒక కొరడా నాచేతుల తోనే తెప్పించి ఆయన చేతిలోకి తీసుకున్నాడు. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు అసలు ఏమి జరగబోతుందో. కానీ ఆ తర్వాత ఆ కొరడా తీసుకొని మా నాన్న నన్ను బాగా దెబ్బలు వేశారు. ఎవరైనా పెద్దవారు ఇంటికి వచ్చినప్పుడు అలా చేయకుండా వారికి మర్యాదలు చేయాలని ఆ తర్వాత నింపాదిగా చెప్పాడు. దీనితో ఆ రోజు నుంచి ఎవరైనా తన ఇంటికి వస్తే ముందుగా వారికి ఆదిత్యం ఇచ్చిన తర్వాత వారిని పలకరిస్తూ వారికీ ఎలాంటి సహాయం చేయగలనో చేస్తాని అని తెలియజేశారు రెబల్ స్టార్ కృష్ణంరాజు.

కృష్ణంరాజు 1966వ సంవత్సరంలో చిలకా గోరింక అనే సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1970 – 1980 దశకాల్లో ఈయన తిరుగులేని నటుడిగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన మొత్తంగా తెలుగులో 183 సినిమాలను నటించాడు. ఈయన పలు చిత్రాలకు నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. నిజానికి కృష్ణంరాజు గారి నటనా శైలి మిగతా హీరోలతో పోలిస్తే చాలా విభిన్నం. ఆయనను ఎవరన్నా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వారితో ఎంతో మర్యాదపూర్వకంగా వారిని పలకరించి వారికి ఏమి కావాలో కనుక్కొని సహాయం చేసే మంచి మనిషి ఈయన. అయితే తన నటనా జీవితంలో ఉన్నప్పుడు ఒకసారి కొందరు మిమిక్రీ ఆర్టిస్టులు జరిగిన సమావేశంలో మిమ్మల్ని మేము ఎలా అలంకరించాలో మాకు అర్థం కావట్లేదు, మీరు ప్రతి సినిమాలో… ఒక క్యారెక్టర్ ఒక్కొక్కలాగా చేస్తున్నారు అని చెప్పగా నటుడు కృష్ణం రాజు దానికి నవ్వి ఊరుకున్నారు.

అయితే ఇటు సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా ఎనలేని కీర్తిని అందుకున్న కృష్ణంరాజుగారు ఆయన ఒక విషయంలో మాత్రం చాలా బాధకు గురి అయ్యారు. అదేమిటంటే తన భార్య ఆలపాటి శ్యామల దేవిని కార్ యాక్సిడెంట్ లో పోగొట్టుకోవడం. ఆమె మరణించిన తర్వాత ఆయన సినిమాలలో నటించడం చాలా తక్కువ అయింది. ఇకపోతే ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారి పేరు ప్రసిద్ధి, ప్రదీప్తి, ప్రకీర్తి… ఇక ఈయన అన్నకొడుకు ప్రస్తుత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన చదువుకున్న పది రోజులలో రాజమండ్రి లోని YN కాలేజీ లో తన విద్యను అభ్యసించారు. ఇక తన భార్య జ్ఞాపకార్థం ఆ కాలేజీలో ఒక బ్లాకు కట్టించి తన స్మృతిగా ఆ కాలేజీలో సేవలందించడానికి కృష్ణం రాజు గారు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణం రాజు గారికి 80 సంవత్సరాలు. అయినా సరే ఆయన చాలా చురుకుగా ఉంటూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇప్పటికి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించి కాదా.. సినిమా గురించా.. డిస్సప్పాయింట్ చేసిన డార్లింగ్?

Published

on

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించలేదని ముఖ్యంగా పెళ్లి గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదని అభిమానులు తెగ ఫీల్ అయ్యారు.

ఇకపోతే ఇటీవల ప్రభాస్ త్వరలోనే తన జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ఒక పోస్ట్ చేశారు. ప్రభాస్ ఇలా పోస్ట్ చేశారు అంటే తప్పనిసరిగా ఆయన తన పెళ్లి గురించి పోస్ట్ చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే తాజాగా ప్రభాస్ ఆ పోస్ట్ చేసింది పెళ్లి గురించి కాదని తన సినిమా అప్డేట్ ఇవ్వడం కోసం చేశారని తెలిసి అందరూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ నటించిన కల్కి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలోని ప్రభాస్ కూడా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement

బుజ్జి..
ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో పాటు ఓ మెషిన్ ఉంటుంద‌ట‌. దాని పేరు బుజ్జి అంట‌. స‌ద‌రు బుజ్జిని నేడు (మే18 శ‌నివారం) సాయంత్రం 5 గంట‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. మ‌రీ ప్రభాస్ బుజ్జి ఎవరు అనేది తెలియాలి అంటే మనం కూడా ఎదురు చూడాల్సిందే. అయితే ఈ విషయంలో మాత్రం అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారనే చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Tollywood: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా.. తేల్చేసిన ప్రముఖ సర్వే?

Published

on

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు నువ్వా నేనా అను పోటీపడేలా సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇలా పలువురు హీరోయిన్స్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి ఎప్పుడు సందేహాలు ఉంటాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోయిన్లలో అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి ప్రముఖ మీడియా సంస్థ ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా అత్యంత ఆదరణ పొందినటువంటి టాప్ 10 సెలెబ్రిటీలను ప్రకటించారు. మరి ఈ సర్వేలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారనే విషయానికి వస్తే..

గత కొద్ది రోజులుగా ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోయినా ఈ సర్వేలో మాత్రం సమంత మొదటి స్థానంలో నిలిచారు. ఈమె అత్యంత ఆదరణ పొందిన నటిగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇక రెండో స్థానంలో సీనియర్ నటి కాజల్ అగర్వాల్ ఉన్నారు. మూడో స్థానంలో అనుష్క నాలుగో స్థానంలో శ్రీలీల, అయిదవ స్థానంలో సాయి పల్లవి ఉన్నారు.

Advertisement

సినిమాలు లేకపోయిన మొదటి స్థానం..
ఇక 6 నుంచి 10 స్థానాల వరకు వరుసగా రష్మిక తమన్నా కీర్తి సురేష్, పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్ ఇలా ఈ ఐదుగురు చివరి ఐదు స్థానాలలో నిలిచారు. ఇక ఈ సర్వేలో సమంత మొదటి స్థానంలో ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో సమంత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మొదటి స్థానంలో ఉండటం విశేషం.

Advertisement
Continue Reading

Featured

Tarun: తరుణ్ రీ ఎంట్రీ పై గుడ్ న్యూస్ చెప్పిన తల్లి రోజా రమణి.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Published

on

Tarun: సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు తరుణ్ ఒకరు. ఈయన నువ్వే కావాలి, నువ్వు లేక నేనులేను, ప్రియమైన నీకు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి తరుణ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈయన నటించిన చివరి చిత్రం 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో,పోయిందో కూడా ఎవరికి జనాలకు తెలియదు. దాదాపు పది సంవత్సరాలుగా తరుణ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన రీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే తరుణ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలలో ఈయన కీలక పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తరుణ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయితే తాజాగా తల్లి రోజా రమణి ఈయన రీ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

రియల్ ఎస్టేట్ బిజినెస్..
ఈ సందర్భంగా రోజా రమణి మాట్లాడుతూ.. త్వరలోనే తరుణ్ మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని మరొక సినిమా ద్వారా తరుణ్ మీ ముందుకు రాబోతున్నారని వెల్లడించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్లానింగ్స్ అన్ని చర్చలలో ఉన్నాయని ఈమె వెల్లడించారు. అయితే ఎలాంటి కథతో వస్తున్నారనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమైతే తరుణ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు తమ ఫ్యామిలీ బిజినెస్ నన్ను చూసుకుంటున్నారని ఈమె వెల్లడించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!