ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు…. తెలుగు సినీ పరిశ్రమలో అని తెలియని నటుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రితం జనరేషన్లో ఈయన కూడా గొప్ప నటుడు కాబట్టి. కృష్ణం రాజు గారు జనవరి 20, 1940 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. వీరు క్షత్రియ రాజుల వంశస్తులు… విజయనగర సామ్రాజ్యం వారసులు. అయితే ఈయన కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుండి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత మరోసారి నర్సాపురం లోక్ సభ నుండి ఎన్నిక కావడంతో అటల్ బిహారీ వాజ్ పై ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2009 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఎన్నికల్లో నిలబడగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి కాస్త రాజకీయాలకు దూరంగానే ఉన్నారు అని చెప్పవచ్చు.
ఆయన చిన్నప్పటి విషయాలు ఒక కార్యక్రమంలో తెలుపుతూ… నా చిన్నతనంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న గారిని కలవడానికి ఒక పెద్దమనిషి ఇంటికి వచ్చాడని ఆ సమయంలో నేను వారు వచ్చిన కానీ నేను సోఫాలో కాళ్లు జాపుకొని ఉన్నాను. ఇలా ఆ పెద్దమనిషి మా ఇంట్లో ఉన్నంతసేపు నేను అలాగే ఉన్నాను. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఉన్న ఒక కొరడా నాచేతుల తోనే తెప్పించి ఆయన చేతిలోకి తీసుకున్నాడు. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు అసలు ఏమి జరగబోతుందో. కానీ ఆ తర్వాత ఆ కొరడా తీసుకొని మా నాన్న నన్ను బాగా దెబ్బలు వేశారు. ఎవరైనా పెద్దవారు ఇంటికి వచ్చినప్పుడు అలా చేయకుండా వారికి మర్యాదలు చేయాలని ఆ తర్వాత నింపాదిగా చెప్పాడు. దీనితో ఆ రోజు నుంచి ఎవరైనా తన ఇంటికి వస్తే ముందుగా వారికి ఆదిత్యం ఇచ్చిన తర్వాత వారిని పలకరిస్తూ వారికీ ఎలాంటి సహాయం చేయగలనో చేస్తాని అని తెలియజేశారు రెబల్ స్టార్ కృష్ణంరాజు.
కృష్ణంరాజు 1966వ సంవత్సరంలో చిలకా గోరింక అనే సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1970 – 1980 దశకాల్లో ఈయన తిరుగులేని నటుడిగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన మొత్తంగా తెలుగులో 183 సినిమాలను నటించాడు. ఈయన పలు చిత్రాలకు నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. నిజానికి కృష్ణంరాజు గారి నటనా శైలి మిగతా హీరోలతో పోలిస్తే చాలా విభిన్నం. ఆయనను ఎవరన్నా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వారితో ఎంతో మర్యాదపూర్వకంగా వారిని పలకరించి వారికి ఏమి కావాలో కనుక్కొని సహాయం చేసే మంచి మనిషి ఈయన. అయితే తన నటనా జీవితంలో ఉన్నప్పుడు ఒకసారి కొందరు మిమిక్రీ ఆర్టిస్టులు జరిగిన సమావేశంలో మిమ్మల్ని మేము ఎలా అలంకరించాలో మాకు అర్థం కావట్లేదు, మీరు ప్రతి సినిమాలో… ఒక క్యారెక్టర్ ఒక్కొక్కలాగా చేస్తున్నారు అని చెప్పగా నటుడు కృష్ణం రాజు దానికి నవ్వి ఊరుకున్నారు.
అయితే ఇటు సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా ఎనలేని కీర్తిని అందుకున్న కృష్ణంరాజుగారు ఆయన ఒక విషయంలో మాత్రం చాలా బాధకు గురి అయ్యారు. అదేమిటంటే తన భార్య ఆలపాటి శ్యామల దేవిని కార్ యాక్సిడెంట్ లో పోగొట్టుకోవడం. ఆమె మరణించిన తర్వాత ఆయన సినిమాలలో నటించడం చాలా తక్కువ అయింది. ఇకపోతే ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారి పేరు ప్రసిద్ధి, ప్రదీప్తి, ప్రకీర్తి… ఇక ఈయన అన్నకొడుకు ప్రస్తుత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన చదువుకున్న పది రోజులలో రాజమండ్రి లోని YN కాలేజీ లో తన విద్యను అభ్యసించారు. ఇక తన భార్య జ్ఞాపకార్థం ఆ కాలేజీలో ఒక బ్లాకు కట్టించి తన స్మృతిగా ఆ కాలేజీలో సేవలందించడానికి కృష్ణం రాజు గారు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణం రాజు గారికి 80 సంవత్సరాలు. అయినా సరే ఆయన చాలా చురుకుగా ఉంటూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇప్పటికి.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.