Connect with us

Featured

టిక్ టాక్ లో దుమ్మురేపుతున్న వంటలక్క వీడియో !!

Published

on

ప్రేక్షకులను ఆకట్టుకునే నటనతో పాటూ.. తనని కలుసుకోవడానికి వచ్చిన అభిమానులకు కాస్త సమయాన్ని కేటాయించడంలోనూ, సోషల్ మీడియాలో తన ఫొటోస్ షేర్ చెయ్యడంలోనూ మన వంటలక్క స్టైలే వేరు. లొకేషన్‌లో ఖాళీ సమయం దొరికితే చాలు టిక్ టాక్ వీడియోస్ కూడా చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. చిన్నా.. పెద్దా.. ఆడ.. మగా అందరూ.. సోమవారం నుంచి శనివారం వరకూ.. రాత్రి 7:30 అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోయేలా చేసింది కార్తీకదీపం. వంటలక్క విశ్వరూపానికి మిగతా సీరియల్స్ ఏవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో బుల్లితెర బాహుబలిగా మారిపోయింది ఈ సీరియల్. దాంతో దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న నటి ప్రేమి విశ్వనాథ్… అంటే ఇప్పుడు తెలియని తెలుగువాళ్లు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. 1991లో జన్మించిన ప్రేమి విశ్వనాథ్.. మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం దీప లేదా వంటలక్కగానే పరిచయం. కేరళకు చెందిన ఈమె మొదట ‘కారుముత్తు’ అనే మలయాళం సీరియల్‌లో నటించింది. కళ్లతోనే హావభావాలను పలికించగల మన దీపక్క.. ఏ పాత్రలోనైనా వదిగిపోయే అందాల అభినేత్రి అంటే ఒప్పుకుని తీరాలి.

మునుమణి, కాయకులమ్ కొచున్నియుడే మకన్ వంటి మరిన్ని మలయాళం సీరియల్‌లో అక్కడ ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే తెలుగులో టాప్ రెటింగ్‌తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్.. నటనకు ఫిదా కానివారు ఉండరంటే నమ్మాలి. కష్టాన్ని గుండెల్లో దాచుకుని నవ్వాలన్నా, సంతోషాన్ని మనసారా వ్యక్తం చేయాలన్నా, కోపాన్ని కనురెప్పల్లోనే వ్యక్తపరచాలన్నా మన దీపక్క తర్వాతే ఎవరైనా అంటారు తెలుగు ప్రేక్షకులు. ఆమె కార్తీకదీపంలో చాలా నల్లగా ఉన్నప్పటికీ ఆమె నవ్వితే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుల్ని ఆ నవ్వే పడేసింది. వ్యక్తిత్వాన్ని చంపుకోలేని ఆత్మాభిమానం, ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం. ఇవే.. ఈ నల్లటి పిల్లకి ఉన్న ప్రత్యేకమైన ఆభరణాలు. తన రంగు నలుపే కానీ తను నవ్వినా.. కనుబొమ్మలు ఎక్కుపెట్టి చూసినా.. భలే గమ్మత్తుగా, అందంగా ఉంటుంది. ‘స్వచ్ఛమైన మనసు, మాటపడని వ్యక్తిత్వం, అంతులేని దు:ఖం, దిక్కుతోచని అయోమయం, అప్పుడప్పుడూ ఆనందం. ఆ ఆనందంలోంచి వచ్చే ఓ వెర్రి నవ్వు’ ఇవే దీపని తెలుగు బుల్లి తెరకు దగ్గర చేశాయి. ప్రేక్షకుల ఆదరణకు కారణమయ్యాయి. ఆమె ఇప్పుడు బుల్లితెర మహానటిగా మారిపోయింది. అందం అంటే పైకి కనిపించే రంగు, రూపం కాదు.. కనిపించని ఆత్మసౌందర్యం అన్నట్లుగా తన ఔదార్యాన్ని చూపించే దీప.. తెలుగు తెర ప్రేక్షకులు చాలా సుపరిచితం. అయితే.. ఇంట్లో కూర్చుని టీవీలు చూసే వారి కంటే.. ఆన్‌లైన్, సోషల్ మీడియాలనీ ఫాలో అయ్యే ప్రేక్షకులకి ఈ వంటలక్క(దీప) గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..

దీప క్యారెక్టర్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్‌ది సీరియల్‌లో కనిపిస్తున్నట్లుగా నల్లటి రూపం కాదని.. చూడగానే ఆకట్టుకునే ముద్దమందారం లాంటి మోము అని చాలా మందికి తెలియదు. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. కరోనా లాక్‌డౌన్ నేపధ్యంలో వెండితెర, బుల్లితెర షూటింగ్‌లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సినిమాలు, సీరియళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. సినీ స్టార్లంతా ఇళ్లకే పరిమితమై.. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ’స్ తోనే గడుపుతున్నారు. క్వారంటైన్‌లో సినిమాలు చూస్తూ.. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఇదేవిధంగా కార్తీక దీపం షూటింగ్ కూడా నిలిచిపోవడంతో.. ప్రేమి విశ్వనాథ్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. క్వారంటైన్‌లో తాను కూడా ఇంటి పనులు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఐతే టిక్ టాక్‌లో ఈమధ్యనే ప్రేమి విశ్వనాథ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటి ముందు కారును శుభ్రంచేస్తూ క్లీనర్‌గా మారిపోయింది వంటలక్క. డస్టర్‌ను నీటిలో ముంచి కారు బ్యానెట్‌ను తుడుస్తూ వీడియోలో కనిపించింది.

@premivishwanath9

##car ##wash ##challeng ##karthikadeepam ##kerala ##crazy ##girl##love ##tiktok ##tiktok_india ♬ Manohari – Vijay Yesudas & Sayanora

ఆ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగానే స్పందిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ లో జరిగినట్టుగానే నిజ జీవితంలోనూ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయక్కా.. అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మాయదారి కరోనా వల్లే నీకీ పరిస్థితి వచ్చిందంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. వంటక్కా.. మజాకా..!😀😀

Advertisement

Continue Reading
Advertisement

Featured

Janasena: గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేనకు బిగ్ రిలీఫ్..13 చోట్లఫ్రీజ్!

Published

on

Janasena: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగింది. ఈ గుర్తు జనసేన పార్టీ గుర్తు అయినప్పటికీ దీనిని ఫ్రీ సింబల్స్ లో పెట్టడంతో అయోమయం నెలకొంది. జనసేన అభ్యర్థుల పోటీ చేసే చోట గాజు గ్లాస్ గుర్తును కేటాయించినప్పటికీ ఈ అభ్యర్థులు పోటీ లేని చోట ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు.

ఇలా కేటాయించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని జనసేన నాయకులు ఈసీ దృష్టికి తీసుకు వెళ్లారు. రిటర్నింగ్ అధికారుల నిర్ణయంపై జనసేన కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కోర్టుకు నివేదిక సమర్పించింది. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో, అలాగే జనసేన పోటీలో ఉన్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తున్నామని తెలిపారు.

ఇక ఎక్కడైతే స్వతంత్ర అభ్యర్థుల పోటీ చేస్తున్నారో వారికి గ్లాస్ గుర్తు ఇవ్వడంలేదని తెలిపారు. ఈసీ ఈ నివేదికలతో కోర్టులో ఈ పిటిషన్ కూడా కొట్టివేశారు. ఇకపోతే ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, 13 చోట్ల ఈ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీజ్ చేశారు.నేపథ్యంలో ఈ 13 లోక్ సభ స్థానాల పరిధిలో జనసేనకు అలాగే కూటమి పార్టీలకు రిలీఫ్ లభించనుంది.

Advertisement

13 ఎంపీ స్థానాలు..
ఇక ఈ ఎన్నికలలో భాగంగా జనసేన రెండు లోక్ సభ స్థానాలలో అలాగే 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.21 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, అమలాపురం, నరసాపురం ఈ13 ఎంపీ స్థానాలలో ఈసీ గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించకుండా ఫ్రీజ్ చేసింది.

Advertisement
Continue Reading

Featured

AP Politics: కూటమి గెలిస్తే రెండో సంతకం దానిపైనే.. లేని చట్టంపై సంతకం ఎలా చేస్తావు బాబు?

Published

on

AP Politics: మరొక రెండు వారాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షనేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో దూకుడు కనబరుస్తున్నారు.

ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొదటి సంతకం డీఎస్సీ పై పెడతానని చెప్పిన బాబు రెండో సంతకం కూడా దీనిపై పెట్టబోతున్నారనే విషయాన్ని తెలిపారు.

కూటమి గెలిస్తే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు పైనే సంతకం చేస్తానని తెలిపారు. అసలు ఏపీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోనే లేదు కానీ తమ ప్రచార కార్యక్రమాల కోసం లేనది ఉన్నట్టు క్రియేట్ చేస్తూ బాబు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మండిపడ్డారు.

Advertisement

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్..
ఇలాంటి టైటిలింగ్ చట్టం ద్వారా మన భూముల ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వంలో తీసుకొని కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే మనకిస్తోందని ఈ విషయంపై న్యాయ పోరాటంలో పోరాటం చేసే అవకాశాలు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. ఇలా లేని చట్టాన్ని ఉందని చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అంతే కాకుండా వారిని నమ్మించడం కోసం తన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు పై అంటూ చంద్రబాబు బహిరంగంగా అసత్యాలు చెప్పడం అందరిని విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

YS Jagan Mohan Reddy: ఈ జగన్ కి ఇవ్వడమే తెలుసు.. చంద్రబాబుపై ఫైర్ అయిన జగన్!

Published

on

YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పలు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల జగన్ బొబ్బలి పాకాయిరావుపేట ఏలూరులో పర్యటించారు. అయితే ఈ సభలలో భాగంగా చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని అందుకే లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మన ఏపీలో అమలులో లేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అమలులో ఉందని పేదల భూములను జగన్ లాక్కుంటున్నారని ప్రచారాలు చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డికి పేదలకు పంచడమే తప్ప చంద్రబాబు లాగా లాక్కోవడం తెలియదని ఈయన విమర్శలు చేశారు. వంద సంవత్సరాల తర్వాత తిరిగి భూములకు రీ సర్వే జరుగుతుంది. భూములను అప్డేట్ చేసే రైతన్నలకు అందిస్తూ ఉంటే చంద్రబాబునాయుడు ఓర్చుకోలేకపోయారని జగన్ మండిపడ్డారు.

Advertisement

బాబును ఓడించడం అంటే పేదలను గెలిపించడమే..

రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ఈ సర్వేలన్నింటినీ చేయించామని వారు ఇకపై కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని తప్పించామని జగన్ తెలిపారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పేదలు, పేదలు అంటూ ఉంటే పెత్తందారి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి నచ్చడం లేదని విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడును ఓడించడం అంటే పేదలను గెలిపించినట్టే అంటూ ఈ సందర్భంగా జగన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!