Connect with us

Featured

Renu Desai: అకీరా మోడీని కలవడంపై ఎమోషనల్ అయిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్!

Published

on

Renu Desai: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈయన గెలిచినప్పటి నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన కుమారుడు అకీరా తన తండ్రి వెంటే ఉంటున్నారు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ సైతం ఆయన ఎక్కడికి వెళ్లిన తన కొడుకుని కూడా వెంట తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు తన భార్య అన్నాతో పాటు అకీరాని కూడా వెంట తీసుకు వెళ్లి చంద్రబాబు నాయుడుకి పరిచయం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసిన సంగతి తెలిసిందే

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. అయితే వ్యక్తిగతంగా రేణు దేశాయ్ బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు గతంలో కూడా ఈమె ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేశారు.

మాటలు రావడం లేదు..
ఈ క్రమంలోనే తన కుమారుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై ఈమె సంతోషం వ్యక్తం చేస్తూ..ఇవాళ నా కొడుకు అకీరాని పీఎం నరేంద్రమోదీ గారి పక్కన చూడటం ఎంతో ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది కానీ మాటలు రావట్లేదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిసాక అకిరా నాకు కాల్ చేశాడు. మోదీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, అయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Thaman: పవన్ ఓజీ సినిమాపై అలాంటి ట్వీట్ చేసిన తమన్.. బిగ్గెస్ట్ సినిమా అవుతుందంటూ!

Published

on

Thaman: టాలీవుడ్ పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయపరంగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే ఇటీవల తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేస్తానంటూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆగిపోయిన సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టారు పవర్ స్టార్. అందులో భాగంగానే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఓజీ సినిమా షూటింగ్ మొదలు పెట్టను న్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ముఖ్యంగా ఓజీ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్, టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చేంజర్ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరుసగా ఇస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఓజీ అప్డేట్స్ కూడా అడుగుతున్నారు. దీంతో తమన్ ఓజీ సినిమా గురించి ఆసక్తికర ట్వీట్ చేసాడు. ఈ మేరకు థమన్ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. అందరూ ఓజీ అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. త్వరలోనే ఇస్తాము. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. కచ్చితంగా చెప్పగలను మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుంది. సుజీత్ అదరగొట్టేసాడు. కెమెరామెన్ రవిచంద్రన్ అదిరిపోయే విజువల్స్ ఇచ్చాడు.

బిగ్గెస్ట్ సినిమా అవుతుంది..

ఇప్పుడు నేను ఓజీ కు బెస్ట్ ఇవ్వాలి. ఇది DVVy మూవీస్ బ్యానర్ కు బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ తో త్వరలో కలుద్దాం అని తెలిపాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓజీ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో, ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Advertisement

https://x.com/MusicThaman/status/1842245316252209456?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1842245316252209456%7Ctwgr%5Eec43db975f2f01c7ca380c5d038c52d806ed4490%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fmusic-director-thaman-interesting-tweet-on-pawan-kalyan-og-movie-872119.html

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!