Yedu Kondalu : జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిన చాలా రోజులకు కిర్రాక్ ఆర్పి మల్లెమాల సంస్థ గురించి, జబర్దస్త్ గురించి తీవ్ర విమర్శలు చేసాడు. ప్రధానంగా తిండి గురించి, అక్కడ గౌరవం ఇవ్వరు అంటూ ఆరోపణలు చేసాడు. ఇక ఈ కామెంట్స్ కు జబర్దస్త్ నుండి వచ్చిన రామ్ ప్రసాద్, హైపర్ ఆది వివరణ ఇచ్చారు. అయినా కూడా వివాదం సద్దుమనగలేదు, షేకింగ్ శేషు కిర్రాక్ ఆర్పి ని వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడం వల్ల వివాదం ముదిరింది. ఇక కిర్రాక్ ఆర్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తన తండ్రి జయంతి, వర్ధంతి కూడా జరపరు అంటూ కామెంట్స్ చేయడం షేకింగ్ శేషుని దూషించడంతో ఇక ఈ ఇష్యూ మరింత వైరల్ గా మారింది. కాగా తాజాగా జబర్దస్త్ ముందు మేనేజర్ ఏడు కొండలు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇచ్చి వివాదాన్ని ఇంట్రస్టింగ్ గా మార్చారు.
Advertisement
సుధీర్ అపుడు అలా… ఇప్పుడు ఇలా…
జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ మరే ఇతర కమెడియన్ కి లేదు. అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సుధీర్ జబర్దస్త్ లోనే కాకుండా ఢీ, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా అన్నింట్లో హోస్టింగ్ అలాగే ఈవెంట్లు అంటూ ఈటీవీలో కనిపించాడు. సుధీర్ కి సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే ఇపుడు సుధీర్ ఈటీవీలో ఏ షోలోనూ లేడు. చివరకు జబర్దస్త్ కూడా వదిలేసి ఇప్పుడు మా టీవీ లో ప్రసారమయ్యే కొన్ని షో లకు హోస్ట్ గా చేస్తున్నాడు. అయితే సుధీర్ జబర్దస్త్ గురించి గాని మల్లెమాల గురించి కానీ ఎటువంటి విమర్శలు చేయలేదు. అయితే జబర్దస్త్ కి మేనేజర్ గా మల్లెమాల సంస్థలో ఎప్పటి నుండో పని చేసి బయటకు వెళ్లిపోయిన ఏడు కొండలు తాజాగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. జబర్దస్త్ కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, వీళ్ళు వచ్చి మా వల్ల జబర్దస్త్ కి పేరోచ్చింది అంటున్నారు. ఏ ఒక్కడి వల్లో జబర్దస్త్ ఎంత పెద్ద హిట్ అవ్వలేదు, అందరి కష్టం ఉంది. ప్రొడక్షన్ లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో వాళ్లకు తెలుసా తిండి బాగోలేదు అంటున్నారు, సంస్థలో ఎప్పుడూ భోజనం బాగానే పెట్టాము. ఒక్కోసారి వీళ్ళు పది మందిని తీసుకుని వచ్చిన అన్నం పెట్టాము. నీకు బ్రతుకునిచ్చిన సంస్థ గురించి మాట్లాడకూడదు అంటూ అన్నారు.
సుధీర్ ఫోన్ చేసినా లిప్ట్ చేయడు ఇప్పుడు. ఒకప్పుడు నేనే తనను పిలిచి జబర్దస్త్ అవకాశం ఇప్పించాను కానీ ఇప్పుడు తాను నా ఫోన్ కూడా ఎత్తడు. సినిమాల్లో బిజీ అంటారు ఎన్ని సినిమాలు సుధీర్ వి హిట్ అయ్యాయో తెలియవా అంటూ ప్రశ్నించారు. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం సుధీర్ కి ఫోన్ చేస్తే తన మేనేజర్ తో మాట్లాడమని చెప్పాడు అంటూ ఇంటర్వ్యూ మధ్యలోనే సుధీర్ కి ఫోన్ చేసి నా కాల్ లిప్ట్ చేయడు అంటూ చేసి చూపించారు. కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి కొంచెం డబ్బులు సంపాదించుకుంటేనే పెద్ద సెలబ్రిటీలు అంటూ ఫీల్ అయిపోతారు అంటూ విమర్శించారు ఏడుకొండలు.
Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి గురించి మరో నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యల సంచలనగా మారాయి. జె.డి చక్రవర్తి గులాబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
Advertisement
ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జే డీ చక్రవర్తి చిరంజీవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చిరంజీవిని పట్టుకుని దుర్మార్గుడు రాక్షసుడు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ విధంగా చిరంజీవి గురించి చక్రవర్తి మాట్లాడటానికి కారణం లేకపోలేదు ఓసారి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఘరానా మొగుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలోనే జె.డి చక్రవర్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అంతం సినిమా కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ జరిగే సమయంలో చిరంజీవి గారిని చక్రవర్తి గమనిస్తూనే ఉన్నారట. అందరూ కూడా షిఫ్ట్ మారుతున్న ఈయన మాత్రం అక్కడ అలాగే కూర్చుని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
పని రాక్షసుడు..
Advertisement
ఇక ఓ రోజు తన కారులోనే నిద్రపోతున్నారు ఇదేంటి ఇలా నిద్రపోతున్నారని ఆయనని అడిగాను. ఇక్కడ కాకపోతే రూమ్ కి వెళ్లి నిద్రపోవచ్చు కదా అంటూ చిరంజీవి గారిని అడగగా ఆయన ఒకటే మాట చెప్పారు. నేను రూమ్ కి వెళ్తే ఎవరు నన్ను లేపరు. ఇక్కడైతే నన్ను లేపుతారు తద్వారా షూటింగ్ డిస్టర్బ్ కాదు అంటూ చెప్పారు. ఆ మాట వినగానే ఈయన ఏంటి మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారు, మరి ఇంత పని రాక్షసుడా అంటూ నేను నా మనసులోనే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయానని చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Kalyan Ram: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఇక నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసినదే. త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Advertisement
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు కళ్యాణ్ రామ్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.
మీరు మీ నిర్మాణ సంస్థలో ఇలాంటి సినిమాలను నిర్మించడమే కాకుండా మీరే నటించవచ్చు కదా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ.. దయచేసి మీరు ఎప్పుడూ కూడా మా బాబాయ్ బాలకృష్ణతో నన్ను పోల్చొద్దని ఈయన తెలిపారు. ఆయన ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఎంతో ఎనర్జీటిక్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయనని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది అలాంటి ఒక గొప్ప నటుడితో నన్ను పోల్చవద్దని తెలిపారు.
వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది.. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ..RRR సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో కంటతడి పెట్టించారు. అలాంటి సినిమాలను నేను చేయలేను. వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది. ఎలాంటి పాత్రలైనా వాళ్లు చేయగలరు. ఇక నందమూరి హీరోల మధ్య ఉన్నది పోటీ కాదు..కేవలం స్ఫూర్తి. ఒకరిని చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొందుతామని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Jani Master: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డుకు ఎంపిక అయ్యారు.అతి త్వరలోనే ఈయన ఈ అవార్డును అందుకోబోతున్నారు.
Advertisement
ఇలా ఈయన సౌత్ చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈయన ఓ మహిళ కొరియోగ్రాఫర్ పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు రావడమే కాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
గత కొద్దిరోజులుగా జానీ మాస్టర్ అవుట్ డోర్ షూటింగ్ వెళ్లిన సమయంలో తన పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని తనపై అత్యాచారం కూడా చేశారని సదరు మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. ఇలా షూటింగ్ వెళ్లిన సమయంలో మాత్రమే కాకుండా నార్సింగ్ లో తన నివాసంలో కూడా ఇలా తనపట్ల లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె పేర్కొన్నారు.
లైంగిక వేధింపులు.. ఇక ఈమె తోలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమె నివాసం నార్సింగ్ లో ఉన్న నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు చేశారు. మరి ఈయన ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు. ఇక జానీ మాస్టర్ పై ఇలాంటి కేసు నమోదు కావడంతో సోషల్ మీడియాలో రాజకీయాల పరంగా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.