Connect with us

Featured

YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?

Published

on

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష. ఒకప్పుడు జగన్ తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో అయినా ఆయనకు కొందరు రాజకీయ ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎంతమంది నిలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 అసెంబ్లీ.. 4 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంతటి దారుణ పరాజయం వైసీపీ పెట్టిన తర్వాత ఇదే తొలిసారి. కాబట్టి ఇప్పుడు జగన్‌కు ఇది అత్యంత కష్టకాలం. ఆయన లైఫ్‌లో వరస్ట్ డేస్ తిరిగి రాబోతున్నాయనడంలో సందేహమే లేదు. జగన్ ఎందుకు ఓటమి పాలయ్యారనే విషయాలను పక్కనబెడితే ఆయనతో నిలిచేదెవరనేదే ఆసక్తికరం. వైసీపీ తరుఫున గెలిచిన వారంతా జగన్‌తో ఉంటారా? అనేది ప్రశ్నార్థకమే. వీరిలో ఎందరు ఉంటారో.. ఎందరు పక్క చూపు చూస్తారో తెలియదు. మొత్తంగా జగన్ జీరో అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

ఇదే అసలు సిసలైన పరీక్ష..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అధికారం కావాలి. అధికారాన్ని అనుభవించేందుకు అలవాటు పడిన వ్యక్తి అది లేకుండా ఒక్క క్షణం కూడా నిలవలేడు. ఇది లోక రీతి. ఈ లెక్కన చూస్తే జగన్ జీరో అయినా ఆశ్చర్యం లేదు. అలాగే కేసులు కూడా జగన్ మెడ చుట్టూ చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ కూడా లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన సైతం గెలిచిన నేతలకు ఉండొచ్చు. కాబట్టి వారంతా వైసీపీలోనే కొనసాగుతారని భావించడం తప్పే అవుతుంది. ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ.. ఎంపీలు కానీ తాడేపల్లి వైపు కూడా తిరిగి చూడలేదని టాక్. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్‌ పార్టీకి దక్కలేదు. జగన్‌కు ఇంతకు మించిన దారుణ పరిస్థితి ఉండదేమో. ఇదే అసలు సిసలైన పరీక్ష. దీనిని జగన్ ఎలా దాటుతారు? ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలుస్తారా? జీరోతో తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడతారా? లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా లండన్ వెళ్లి పోయి వ్యాపారాలు చూసుకుంటారా? ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంది.

Advertisement

సహకరించే వారేరి?

నిన్న మొన్నటి వరకూ జగన్‌కు అండగా ప్రధాని మోదీ ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబును కాదని మోదీ సైతం జగన్‌కు సాయం చేయలేరు. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎలాంటి సాయాన్ని వైసీపీ పొందలేదనడంలో సందేహమే లేదు. ఇప్పుడు జగన్ సమస్యల వలయంలో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. అంతెత్తు ఎగిసి నేలకు చేరిన కెరటం. తిరిగి అదే స్పీడుతో కాకున్నా ఆలస్యంగానైనా లేస్తారా? లేదంటే పత్తా లేకుండా పోతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పట్టుదల ఉండొచ్చు కానీ సహకరించే వారేరి? నడిసంద్రంలో ఉన్నారు. ఒడ్డుకు చేర్చే నావ కోసం ఎదురు చూస్తున్నారు. గెలిచిన నేతలే తాడేపల్లి వైపు చూడటం లేదంటే.. ఓడిన నేతలు చూస్తారన్న నమ్మకం కూడా లేదు. కొంతమంది అయితే జగన్‌తో ఉండొచ్చు. వారికి కూడా వేరే దిక్కు లేదు కాబట్టి. అసలు జగన్‌ను ముంచిందే వారు కదా.. వారితో కలిసి పార్టీని పైకి లేపడమంటే సాధ్యమయ్యే పనేనా? ఏమో.. ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై పవన్ కామెంట్స్.. ఇక్కడ కూడా బీజేపీతో పొత్తు అంటూ?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయనకు భక్తి భావం ఎక్కువ అనే సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకొని తన పనులను ప్రారంభిస్తూ ఉంటారు..

ఈ క్రమంలోనే ఈయన రాజకీయాలలో సంచలన విజయం అందుకోవడమే కాకుండా ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఉపముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ వస్తున్నారనే విషయం తెలియడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రత చర్యలను చేపట్టారు.

ఇక స్వామివారి దర్శనం పూజా కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ మాట్లాడుతూ..తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని పవన్ పేర్కొన్నారు. జై జనసేన జై బీజేపీ జై తెలంగాణ అంటూ పవన్ కల్యాణ్ నినాదాలు చేయడం గమనార్హం.

Advertisement

బీజేపీతో పొత్తు..
కొండగట్టు పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత తెలంగాణ జనసేన పార్టీ నేతలతో పవన్ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుంది. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ కూడా బిజెపి జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Sneha Reddy: ప్రభాస్ బుజ్జికి ఫిదా అయిన బన్నీ వైఫ్.. ఏం చేసిందంటే?

Published

on

Sneha Reddy: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మహా భారతంతో పాటు కలియుగ అంతం రెండింటినీ కనెక్ట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెలబ్రిటీల నటన ఓక ఎత్తు అయితే బుజ్జి పాత్ర కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. ఈ బుజ్జి కారు సినిమాలో వింత విన్యాసాలు చేస్తూ సినిమా హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా అయింది.

ఈ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన ఈ బుజ్జి కారు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో తిరుగుతూ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా బుజ్జి కారును చూడటానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి బుజ్జి కారులో ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Advertisement

ఏడు కోట్ల రూపాయలు..
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సైతం బుజ్జి కారులో ఎక్కి తన సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఇలా ఇటీవల బుజ్జి కారు ఎక్కిన ఈమె అక్కడ దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక ఇందులో స్నేహ రెడ్డి స్నేహితులతో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఉన్నారు. ఇక ఈ కారు టెక్ మహేంద్ర వారి సహాయంతో సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా తయారు చేయించిన సంగతి తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Amani: ఆరుసార్లు అబార్షన్.. నరకం చూసాను.. ఆమని సంచలన వ్యాఖ్యలు!

Published

on

Amani: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి ఆమని. ఈమె సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రాజేంద్రప్రసాద్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి ఆమని అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఆమని ఇటీవల మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈమె వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తాను సినిమాలు చేసే సమయంలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ముఖ్యంగా చాలా డైట్ ఫాలో కావటం వల్ల నాకు తెలియకుండానే నేను చాలా వీక్ అయిపోయానని తెలిపారు. ఇలా నా బాడీలో ప్రోటీన్‌ ఎస్‌ అనేది తక్కువగా ఉండటంతో పిల్లలు కలగలేదు ఏకంగా ఆరుసార్లు తాను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అయిందని తెలిపారు.

Advertisement

మానసికంగా నలిగిపోయాను..
ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక డాక్టర్లు కూడా తలలు పట్టుకున్నారు అయితే తనకు ఇన్నిసార్లు అబార్షన్ కావడంతో నరకం అనుభవించానని, మానసికంగా ఎంతో కృంగిపోయానని తెలిపారు అయితే చివరికి ఒక డాక్టర్ నా సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ చేశారు అప్పుడు తనకు పిల్లలు కలిగారు అంటూ ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!