Connect with us

Featured

AP Election Results : తొలి ఫలితం నగరి నుంచే.. మొదట తేలేది రోజా జాతకమే..!

Published

on

మరో మూడు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం వెలువడనున్నాయి. పైగా వైసీపీ వర్సెస్ కూటమి హోరాహోరా పోరు జరిగింది. ఎప్పుడైనా హోరాహోరీ పోరు జరిగితేనే కదా.. నరాలు తెగే ఉత్కంఠ ఉండేది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అలాగే ఉంది. ఇరు పార్టీలు విజయంపై ధీమాతోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. లోలోపల ఎలా ఉన్నారనేది వారికే ఎరుక. జూన్ నాలుగో తేదీన ఉదయం 11 గంటల వరకూ ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై పక్కాగా ఓ క్లారిటీ వస్తుంది. ఇక ఏపీలోని అన్ని ప్రాంతాల కంటే ముందుగా వెలువడేది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జాతకమే. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఫలితం మొదట రానుందని తెలుస్తోంది. తొలి ఫలితం వైసీపీకి సక్సెస్‌ను అందిస్తుందా? లేదంటే ముంచేస్తుందా?

12 గంటల్లోపే తేలనున్న రోజా జాతకం..

చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో చిన్న నియోజకవర్గం నగరి. ఇక్కడి నుంచే ఏపీలో తొలి ఫలితం వెలువడనుందని టాక్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఓటర్లు 2,02,574 మాత్రమే. 229 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఇక కౌంటింగ్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 17 రౌండ్లలో ఫలితం తేలనుంది. తొలి ఫలితం మధ్యాహ్నం 12 గంటలలోపే వచ్చే అవకాశం ఉంది. అంటే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రోజా జాతకం తేలిపోతుందన్న మాట. వాస్తవానికి నగరి నియోజకవర్గం గతంలో అయితే వైసీపీకి చాలా బాగుండేది. అలాంటిది ఈ ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలిచిన వారంతా టీడీపీలోకి జంప్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు లెండి. అంతా రోజమ్మే చేశారు. అధికారం కట్టబెట్టినప్పుడు ఎలా ఉండాలి? కానీ ఆమె ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. అధికారం తనది.. పెత్తనం అన్నలది. వారు ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేశారని సొంత పార్టీ నేతలే మండిపడ్డారు.

Advertisement

రోజా టాక్స్.. అన్నల దందా..

వైసీపీని వీడిన నేతలు సైతం రోజా బాగోతాన్ని బయటపెట్టే వీడారు. రోజా టాక్స్ మొదలుకుని అవినీతి.. దందాలు అన్నీ బయట పెట్టారు. ఇక పార్టీ టికెట్లను కేటాయిస్తున్న సమయంలోనే రోజాకు మాత్రం టికెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలంతా అధిష్టానానికి మొరబెట్టుకున్నారు. ఒకవేళ ఇచ్చినా కూడా సహకరించబోమని వెల్లడించారు. వాస్తవానికి నగరిలో రోజాకు విపక్షాల కంటే సొంత పార్టీ నేతలే ఎక్కువగా ఎదురు తిరిగారు. ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలే కృషి చేశారు. రోజా టాక్స్.. అన్నల దందాలతో ఎక్కడలేని నెగిటివ్ రోజాపై వచ్చింది. మొత్తానికి రోజాను ఈసారి అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయనివ్వకూడదని వైసీపీ నేతలు గట్టిగానే కష్టపడ్డారు. అలాగే నగరిలో టీడీపీ నుంచి గాలి భాను ప్రకాష్ పోటీ చేశారు. ఆయన ఈసారి గట్టిగానే కష్టపడ్డారు. కాబట్టి ఆయన ఈసారి పక్కాగా గెలుస్తారని అంటున్నారు. రోజా సవాళ్లైతే మరోలా ఉన్నాయి. గాలిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని సవాల్ చేశారు. మరి ఇంత ధీమాతో ఉన్న రోజా గెలుస్తారో.. గాలి భానుప్రకాష్ గెలుస్తారో చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!