Featured
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
Published
4 weeks agoon
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష. ఒకప్పుడు జగన్ తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో అయినా ఆయనకు కొందరు రాజకీయ ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎంతమంది నిలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 అసెంబ్లీ.. 4 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంతటి దారుణ పరాజయం వైసీపీ పెట్టిన తర్వాత ఇదే తొలిసారి. కాబట్టి ఇప్పుడు జగన్కు ఇది అత్యంత కష్టకాలం. ఆయన లైఫ్లో వరస్ట్ డేస్ తిరిగి రాబోతున్నాయనడంలో సందేహమే లేదు. జగన్ ఎందుకు ఓటమి పాలయ్యారనే విషయాలను పక్కనబెడితే ఆయనతో నిలిచేదెవరనేదే ఆసక్తికరం. వైసీపీ తరుఫున గెలిచిన వారంతా జగన్తో ఉంటారా? అనేది ప్రశ్నార్థకమే. వీరిలో ఎందరు ఉంటారో.. ఎందరు పక్క చూపు చూస్తారో తెలియదు. మొత్తంగా జగన్ జీరో అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.
ఇదే అసలు సిసలైన పరీక్ష..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అధికారం కావాలి. అధికారాన్ని అనుభవించేందుకు అలవాటు పడిన వ్యక్తి అది లేకుండా ఒక్క క్షణం కూడా నిలవలేడు. ఇది లోక రీతి. ఈ లెక్కన చూస్తే జగన్ జీరో అయినా ఆశ్చర్యం లేదు. అలాగే కేసులు కూడా జగన్ మెడ చుట్టూ చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ కూడా లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన సైతం గెలిచిన నేతలకు ఉండొచ్చు. కాబట్టి వారంతా వైసీపీలోనే కొనసాగుతారని భావించడం తప్పే అవుతుంది. ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ.. ఎంపీలు కానీ తాడేపల్లి వైపు కూడా తిరిగి చూడలేదని టాక్. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ పార్టీకి దక్కలేదు. జగన్కు ఇంతకు మించిన దారుణ పరిస్థితి ఉండదేమో. ఇదే అసలు సిసలైన పరీక్ష. దీనిని జగన్ ఎలా దాటుతారు? ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలుస్తారా? జీరోతో తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడతారా? లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా లండన్ వెళ్లి పోయి వ్యాపారాలు చూసుకుంటారా? ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంది.
సహకరించే వారేరి?
నిన్న మొన్నటి వరకూ జగన్కు అండగా ప్రధాని మోదీ ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబును కాదని మోదీ సైతం జగన్కు సాయం చేయలేరు. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎలాంటి సాయాన్ని వైసీపీ పొందలేదనడంలో సందేహమే లేదు. ఇప్పుడు జగన్ సమస్యల వలయంలో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. అంతెత్తు ఎగిసి నేలకు చేరిన కెరటం. తిరిగి అదే స్పీడుతో కాకున్నా ఆలస్యంగానైనా లేస్తారా? లేదంటే పత్తా లేకుండా పోతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పట్టుదల ఉండొచ్చు కానీ సహకరించే వారేరి? నడిసంద్రంలో ఉన్నారు. ఒడ్డుకు చేర్చే నావ కోసం ఎదురు చూస్తున్నారు. గెలిచిన నేతలే తాడేపల్లి వైపు చూడటం లేదంటే.. ఓడిన నేతలు చూస్తారన్న నమ్మకం కూడా లేదు. కొంతమంది అయితే జగన్తో ఉండొచ్చు. వారికి కూడా వేరే దిక్కు లేదు కాబట్టి. అసలు జగన్ను ముంచిందే వారు కదా.. వారితో కలిసి పార్టీని పైకి లేపడమంటే సాధ్యమయ్యే పనేనా? ఏమో.. ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.
You may like
Featured
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
Published
7 hours agoon
2 July 2024By
lakshanaShirish: మెగా మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ మొదటి మాజీ భర్త ఆయన ఈయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మరణించారు. 2007వ సంవత్సరంలో శ్రీజ శిరీష్ ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప జన్మించిన తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన శిరీష్ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు రెండో భర్తకు కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇటీవల తన మొదటి మాజీ భర్త చనిపోవడంతో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా శిరీష్ తల్లి మాట్లాడుతూ.. నా కొడుకు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అవన్నీ తప్పుడు వార్తలని తెలిపారు. తన పుట్టినరోజు మే 13వ తేదీ ఫారెన్ వెళ్లి సెలబ్రేషన్ జరుపుకున్నారు. తిరిగి వచ్చినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా అపోలో హాస్పిటల్లో చేర్పించామని, అయితే కార్డియాక్ అరెస్టు కారణంగా తన కుమారుడి చనిపోయినట్లు తెలిపారు.
ఇక శిరీష్ మరణ వార్తను మెగా కుటుంబానికి చెప్పాము కానీ వాళ్ళు ఎవరు రాలేదని ఈమె తెలియజేశారు. ఇక తన మనవరాలు నివృత్తి అచ్చం తన తండ్రి పోలికలతోనే ఉంటుందని తనని చూస్తే నాకు నా కొడుకే గుర్తుకు వస్తారని ఈమె తెలిపారు.. ఎవరికైనా వారి మనవరాలని కలుసుకోవాలని ఉంటుంది నాకు కూడా నివృత్తిని చూడాలని ఉందని ఈమె తెలిపారు.
కార్డియాక్ అరెస్ట్..
ఇక వారిద్దరు ఎందుకు విడిపోయారనే విషయం నాకు తెలియదు కానీ మెగా ఫ్యామిలీ మాకు 33 కోట్లు ఇచ్చిందంటూ కూడా వార్తలు వచ్చాయి . అది పూర్తిగా అవాస్తవమని కొందరు మాకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పినా, మాకు వద్దు పాప కోసమే ఉపయోగించమని చెప్పామని ఈ సందర్భంగా శిరీష్ భరద్వాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Featured
Pokiri Movie: పోకిరి సినిమా ఎలా హిట్ అయిందో ఇప్పటికీ అర్థం కాలేదు.. పూరి సంచలన వ్యాఖ్యలు!
Published
8 hours agoon
2 July 2024By
lakshanaPokiri Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈయన సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇక గతంలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరికీ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించిన పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో తన సినిమాలు సక్సెస్ అందుకోలేకపోతున్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పూరి జగన్నాథ్ పోకిరి సినిమా గురించి సంచలనం వ్యాఖ్యలు చేశారు పూరీ డైరెక్షన్లో మహేష్ బాబు ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే .ఇందులో పూరి జగన్నాథ్ టేకింగ్ మహేష్ బాబు మాస్ యాక్టింగ్ ఇలియానా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి.
ఈ సినిమా ఇలాంటి విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఊహించని విధంగా సక్సెస్ కావడంతో ఇటు పూరి జగన్నాథ్ మహేష్ బాబు కూడా షాక్ లో ఉన్నట్టు వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత తాను చేసిన సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఈ క్రమంలోనే చాలామంది పోకిరి లాంటి హిట్ పడలేదని చెప్పేవారు.
క్లైమాక్స్ హైలెట్..
ఇలా ప్రతి ఒక్కరు చెబుతుంటే అసలు ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి ఇందులో ఏముంది అని నేను ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా వేసుకొని మరీ చూసాను అప్పటికి కూడా నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు ఈ సినిమా హిట్ అయింది అని నేను సందేహంలోనే ఉన్నానని పూరి జగన్నాథ్ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం సినిమా క్లైమాక్స్ అనే చెప్పాలి. ఈ క్లైమాక్స్ సీన్ చూడటం కోసం రిపీటెడ్ గా జనాలు థియేటర్లకు వెళ్తున్నారని అందుకే ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని తెలుస్తోంది.
Featured
Mokshagna: మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న యంగ్ డైరెక్టర్… అదిరిపోయిన మోక్షజ్ఞ న్యూ లుక్!
Published
8 hours agoon
2 July 2024By
lakshanaMokshagna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులందరికీ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడిగా ఈయన ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగు పెడతారా అంటూ బాలకృష్ణ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ సంవత్సరాలు గడుస్తున్న ఇంకా క్లారిటీ రాలేదు.
ఇకపోతే ఈసారి మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా ఉంటుందని ఇప్పటికే ఈయన ఎంట్రీ కోసం అన్ని సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఇకపోతే మోక్షజ్ఞని ఏ డైరెక్టర్ చేతుల మీదుగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారన్న ప్రశ్న అభిమానులలో కలుగుతుంది. మోక్షజ్ఞను బోయపాటి లాంచ్ చేయబోతున్నారని, కాదు అనిల్ రావిపూడి అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇప్పటికీ క్లారిటీ లేదు.
ఇకపోతే మోక్షజ్ఞను లాంచ్ చేయబోయే డైరెక్టర్ల జాబితాలో మరో యంగ్ డైరెక్టర్ పేరు వినపడుతోంది ఈ ఏడాది హనుమన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మరో వార్త వైరల్ అవుతుంది.
ప్రశాంత్ వర్మ…
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఫోటోలలో మోక్షజ్ఞ పూర్తిగా తన లుక్ మార్చేసి ఉండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
Pokiri Movie: పోకిరి సినిమా ఎలా హిట్ అయిందో ఇప్పటికీ అర్థం కాలేదు.. పూరి సంచలన వ్యాఖ్యలు!
Mokshagna: మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న యంగ్ డైరెక్టర్… అదిరిపోయిన మోక్షజ్ఞ న్యూ లుక్!
Sukumar: సమంతకు పెళ్లి అయిపోయింది..ఆమె వద్దన్నారు.. చిరంజీవి రియాక్షన్ ఇదే: సుకుమార్
Chandra Babu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు… ఆలేఖలో ఏముందంటే?
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
Trending
- Featured3 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured3 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured3 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
- Featured5 days ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Hema: సినీనటి హేమకు భారీ షాక్.. జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు!
- Featured3 weeks ago
YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..
- Featured3 weeks ago
Ramoji Rao: రామోజీరావు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?