తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత రాష్ట్రపండుగగా మారిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా ఆడవారు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
రాష్ట్రం రాకముందు బతుకమ్మ పండగను కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా చేసేవారు. కాని రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులు కేటాయించి, బతుకమ్మను ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
Advertisement
తెలంగాణలో మాత్రమే సాగే ఈ పూల ఉత్సవంకు పలు కథలు, కారణాలను పెద్దలు చెబుతూ ఉన్నారు. కథల విషయం ఎలా ఉన్నా కూడా ఈ పూల పండుగ వలన వాతావరణం బాగుపడుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. చెరువులు, కుంటల్లో ఈ పూలను వేయడం వల్ల ఆ నీరు శుద్ది అవుతుందని చెబుతున్నారు. బతుకమ్మ పండుగ బొడ్డెమ్మతో మొదలై ఎంగిలి పూల బతుకమ్మతో ముగుస్తుంది.
దసరా ముందు వచ్చే ఈ పూల జాతరకు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. పూలను ఒక క్రమ పద్దతిలో పేర్చి చిన్నా లేదా పెద్ద సైజ్లలో బతుకమ్మలను తయారు చేస్తారు. ఎవరి తాహతకు తగ్గట్లుగా వారు బతుకమ్మను తయారు చేసుకుంటారు. అలా తయారు చేసిన బతుకమ్మను సాయంత్రం సమయంలో ఊర్లోని ఒక నిర్దేశిత ప్రాంతంలో లేదా చెరువు గట్టుపైన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఆడపడుచులు అంతా కూడా చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడుతారు.
గంట నుండి మూడు గంటల వరకు కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పాటలు పాడుతూ ఆడవారు ఉత్సవంలా బతుకమ్మను జరుపుకుంటారు. బతుకమ్మలను నీటిలో వదిలేసి తిరిగిరా బతుకమ్మ అంటూ ఒకరికి ఒకరు ప్రసాదాలు తినిపించుకోవడంతో పాటు, సరదాగా కొందరు రంగులు కూడా పూసుకుంటారు. బతుకమ్మను 9 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు.
Advertisement
ఈ 9 రోజులకు 9 పేర్లు ఉన్నాయి. ఆ 9 రోజుల్లో 9 రకాల ప్రసాదాలను బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఎంగిలి పూల బతుకమ్మ: నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ :సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ : నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ : ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
బతుకమ్మ పండుగ గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపించే కథ ఏంటి అంటే… ఒక బాలిక భూస్వాముల అకృత్యాల కారణంగా బలైపోతుంది. ఆమెను ఆ ఊరు ప్రజలు అంతా కూడా కలకాలం బతుకమ్మ అంటూ దీవించారట, అప్పటి నుండి కూడా ఆడపిల్లల పండుగ బతుకమ్మ అయ్యిందని అంటారు.
కొన్ని వందల సంఖ్యలో బతుకమ్మ పాటలు ఉన్నాయి. బతుకమ్మ ఉత్సవం అంటే ఖచ్చితంగా వినిపించే పాట ఉయ్యాల పాట మరియు చందమామ పాటలు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పి, తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షాలు.
Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.
Advertisement
ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత.. ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Advertisement
రోడ్డుపై పడ్డాను.. తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
హోం శాఖ మంత్రి.. ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.