Connect with us

Featured

సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను నేర్చుకున్నది ఏం లేదు.. పోసాని షాకింగ్ కామెంట్స్?

Published

on

పోసాని కృష్ణమురళి.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక నటుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. డైరెక్టర్ గా.. ఇలా సినిమా ఇండస్ట్రీలో అన్నింట్లోనూ ఆరితేరిన వ్యక్తి. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ అయినా.. తండ్రి క్యారెక్టర్ అయినా.. కమెడియన్ గా అయినా.. అది ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే.. పోసానికి వెన్నతో పెట్టిన విద్య. ఇట్టే అవలీలగా నటించేస్తారు పోసాని. అందకే.. పోసాని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయిపోయారు.

అయితే.. పోసాని కృష్ణమురళి.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పెద్దగా నేర్చుకున్నది ఏం లేదట. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలో చదువుతున్న సమయంలోనే యాక్టింగ్ చేసేవారట. అప్పుడు యాక్టింగ్ లో ఎన్నో అవార్డులు వచ్చాయట. స్కూల్ డేస్ ను నేను బెస్ట్ కమెడియన్ ను. నాగార్జున యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్ ను. మద్రాస్ యూనివర్సిటీలోనూ మంచి యాక్టర్ ను. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలోనే నాకు చాలా అవార్డులు వచ్చాయి.. అని పోసాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరా

మద్రాస్ లో ఎంఫిల్ చేస్తున్న సమయంలో.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర పార్ట్ టైమ్ రైటర్ గా జాయిన్ అయ్యారు పోసాని. ఆ పార్ట్ టైమ్ కాస్త ప్రస్తుతం లైఫ్ లోనే పార్ట్ అయిపోయింది అని పోసాని తెలిపారు. ఏదో పాకెట్ మనీ కోసం రైటర్ గా మారితే.. ఇప్పుడు అదే వృత్తి అయిపోయింది. అసలు రైటర్ అవ్వాలన్న ఆలోచనే తనకు లేదట. వాళ్ల ఫ్యామిలీలో ఎక్కువ చదువుకున్నది పోసాని మాత్రమే. అందుకే.. తాను ఏనాడూ రచయిత కావాలని ఆలోచించలేదు కానీ.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరారు పోసాని.

పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలనుకున్నా

నిజానికి పోసాని కృష్ణమురళి యాక్టర్ కావాలని కానీ.. సినిమా ఇండస్ట్రీలోకి కానీ రావాలని ఏనాడూ అనుకోలేదట. ఆయనకు చదువుకుంటున్న రోజుల్లో పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలని అనుకున్నారట. కానీ.. అనుకోకుండా.. రచయితగా మారడం.. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. దీంతో సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది పోసానికి. మనం ఏం అవ్వాలో లైఫే డిసైడ్ చేస్తుంది. మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. నా రైటింగ్ స్కిల్స్ పరుచూరి బ్రదర్స్ కు నచ్చడంతో నాకు అవకాశం ఎక్కువ ఇచ్చారు.. అని పరుచూరి చెప్పారు.

ఒక సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను పరుచూరి గోపాలకృష్ణ మూడు రోజుల్లో రాసేస్తారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా స్క్రిప్ట్ ను అత్యంత వేగంగా రాసే రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటూ పోసాని చెప్పుకొచ్చారు. ఒక సినిమా స్క్రిప్ట్ ను పూర్తిగా అన్ని డైలాగ్స్ తో కలిపి కేవలం 3 రోజుల్లో రాసేస్తారట ఆయన. ఆయన అంత ఫాస్ట్ గా ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాసేవాళ్లు లేరని పోసాని అన్నారు. కాకపోతే.. నేను కూడా రెండు రోజుల్లోనే రాసేవాడిని కానీ.. పరుచూరి అంత పర్ ఫెక్ట్ గా రాసేవాడిని కాదు.. అంటూ పోసాని కృష్ణమురళి చెప్పారు. 

Advertisement

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!