Featured
YSRCP vs TDP : టీడీపీయే టార్గెట్.. పవన్ వద్దు..
Published
2 months agoon
YSRCP vs TDP : ఎన్నికల ముందేమో టీడీపీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్లే వైసీపీకి మెయిన్ టార్గెట్. ఇప్పుడు వైసీపీ టార్గెట్లో పవన్ లేరు. కేవలం టీడీపీ అధినేత సహా నేతలంతా ఉన్నారు. వారిని వదలొద్దు.. పవన్ జోలికి వెళ్లొద్దని జగన్ తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారట. అదేంటి? ఇంత సడెన్గా జగన్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పవన్ వద్దు.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి వద్దన్నారట. ఒకప్పుడు జగన్ అయితే ముందుగా పవన్తోనే మొదలు పెట్టేవారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రస్తావించేవారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ నానా రచ్చ చేసి అడ్డంగా బుక్కైన రోజులూ ఉన్నాయి. జగనే నా నాలుగో పెళ్లామని పవన్ అనడంతో జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అందుకున్నారు. జగన్ను వదినమ్మ అంటూ నెట్టింట ఒకాట ఆడుకున్నారు. దత్త పుత్రుడని.. ప్యాకేజీ స్టార్ అనీ నానా హంగామా చేశారు. ఆ పార్టీ నేతలు సైతం జగన్ బాటలోనే నడిచేవారు. పవన్ చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతగా జగన్ డామేజ్ చేశారు.
జనం కోసం స్ట్రాంగ్గా..
టీడీపీని గెలిపించే ప్రధానాస్త్రం పవనేనని అప్పుడు వైసీపీ ఆలోచన. ఇది నిజమే. టీడీపీ కూటమి గెలిచిందంటే దానికి పవనే కారణం. అందుకే ముందుగా పవన్ను వైసీపీ దెబ్బ తీయాలనుకుంది. ఎమోషన్ల్గానూ.. రాజకీయంగానూ దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నించింది. కానీ కుదరలేదు. పవన్ అంతకంతకూ స్ట్రాంగ్ అయ్యారు. తన వాయిస్లో బేస్ను పెంచారు. ఇక రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారికైతే పట్టపగ్గాలు ఉండేవి కావు. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. వీరంతా తమ పదవీకాలంలో సగ భాగాన్ని పవన్ను తిట్టేందుకే ఉపయోగించారంటే అతిశయోక్తి కాదు. ఇక గుడివాడ అమర్నాథ్ అయితే ఏకంగా పవన్ తనతో సెల్ఫీ దిగాడంటూ నానా రచ్చ చేసి జనసైనికుల దగ్గర అడ్డంగా బుక్ అయ్యారు. ఇవన్నీ జనసేనకు బాగా ప్లస్ అయ్యాయి. సింపతీ బీభత్సంగా పెరిగిపోయింది. పవన్ కూడా జనం కోసం స్ట్రాంగ్గా నిలబడ్డారు. దీంతో జనాలు పవన్ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి రాజకీయంగా ఆయనేంటో చూశారు. గుండెల్లో పెట్టుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా దాటనీయము అని శపథాలు చేసిన వారిని ఇంట్లో కూర్చోబెట్టి పవన్ను దర్జాగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సీటులో కూర్చోబెట్టారు.
నేతలకు ఇంటర్నల్ ఆదేశాలు..
మరి ఇంత చేసిన జగన్.. ఎందుకు పవన్ను దూషించవద్దని చెబుతున్నారు అంటారా? ఇంకా ధూషిస్తే కాలగర్భంలో పూర్తిగా కలిసి పోతామని తెలిసొచ్చింది కాబట్టి. వవన్ ఇప్పటికే కక్షలూ కార్పణ్యాలు వద్దు. కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోదామని చెబుతున్నారు. అటువంటి పవన్ను టార్గెట్ చేస్తే రాజకీయంగా వచ్చేది ఏమీ లేకపోగా.. ఇంకా ఇంకా అభాసు పాలవ్వాల్సి వస్తుంది. పవన్ కారణంగానే తనకు అంత పెద్ద డ్యామేజ్ జరిగిందని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా టార్గెట్ చేస్తే కష్టమని భావించే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే నేతలతో పాటు క్యాడర్కు సైతం ఇంటర్నల్ ఆదేశాలిచ్చారు. సాధ్యమైనంత వరకూ పవన్ను టచ్ చేయకూడదన్నదే వైసీపీ లక్ష్యం. అందుకే పవన్ వైసీపీ అరాచకంపై అడపా దడపా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా కూడా వైసీపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. పోనీలే.. ఇప్పటికైనా జగన్కు కాస్త వివరం వచ్చినట్టుంది. ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే జనాగ్రహానికి గురవడం తప్ప ఒరిగేదేమీ ఉండదని తెలుసుకున్నారు.
You may like
Budda Venkanna : చంద్రబాబుగారూ.. బుద్దాకు అర్జంటుగా ఓ పదవిచ్చేయండి ప్లీజ్..
Pawan Kalyan – Renu Desai : పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలవబోతున్నారా? చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Pawan Kalyan : రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్..!
Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?
Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ
AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Featured
Bigg Boss 8: లీక్ అయిన బిగ్ బాస్ 8 విన్నర్… ఎవరో తెలుసా?
Published
2 days agoon
17 September 2024By
lakshanaBigg Boss 8: బిగ్ బాస్ 8 తెలుగు కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఇక 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే ఐదవ వారంలో మరికొంతమంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ కూడా ఎక్కువగా బుల్లితెర నటీనటులు ఉండటం విశేషం. ఇక బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన సమయం నుంచి విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటాయి.
బిగ్ బాస్ నిర్వహకులు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా ఎంత జాగ్రత్త పడినప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు మాత్రం బయటకు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా విన్నర్ ఎవరు అనే విషయం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది.
విన్నర్ విష్ణుప్రియ..
ఇక హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వారిలో విష్ణు ప్రియ ఒకరు. ఈమెకు సోషల్ మీడియాలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హౌస్ లో కూడా విష్ణుప్రియ చాలా జెన్యూన్ గా గేమ్ ఆడటమే కాకుండా అన్ని విషయాలను పాజిటివ్గా తీసుకుంటూ ఎంతో మంది అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. దీంతో విష్ణు ప్రియనే ఈ సీజన్ విన్నర్ కావచ్చనే అభిప్రాయాలు కూడా చాలామందిలో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు కూడా విష్ణు ప్రియ పేరును చెప్పడంతో ఈ సీజన్ విన్నర్ ఆమెనని స్పష్టంగా అర్థమవుతుంది.
Featured
Anushka: ఆ డైరెక్టర్ కు ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్… స్వీటీ యవ్వారం ఏదో తేడాగా ఉందే?
Published
2 days agoon
17 September 2024By
lakshanaAnushka: సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈమె అరుంధతి వంటి లేడి ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్కకు అవకాశాలు క్యూ కట్టాయి.
ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. అయితే పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించిన అనుష్క అధిక శరీర బరువు కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పలు భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనుష్కకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇటీవల సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అనుష్క మంచితనం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అనుష్క మంచితనం చూస్తే ఇలాంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉంటారా అనే ఆశ్చర్యం కలుగుతుందని ఆయన అనుష్క పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా అనుష్కకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు.
సెప్టెంబర్ నెలలో..
అనుష్క ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో తనకు ఐఫోన్ గిఫ్ట్ గా పంపిస్తుందని ఈయన తెలిపారు. నా మీద ఆమె చూపించే ఈ ప్రత్యేకమైన ప్రేమకు నేను కృతజ్ఞుడిని అంటూ ఈయన కామెంట్లు చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది కేవలం రెండు సినిమాలే కానీ ఈ రెండు సినిమాలకి వీరిద్దరి మధ్య ఇలాంటి బాండింగ్ ఏర్పడటంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Featured
Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమాకే 100 కోట్ల బడ్జెట్.. సాహసమే అని చెప్పాలి?
Published
2 days agoon
17 September 2024By
lakshanaMokshagna: నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈయన ఫస్ట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ లుక్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే.
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలను వెల్లడించడమే కాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.
ఈ సినిమా కోసం మోక్షజ్ఞ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా భాగం చేయబోతున్నారు.
20 కోట్ల రెమ్యూనరేషన్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ విధంగా ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాకముందే ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు కనుక ఈ సినిమాపై ఎంతో నమ్మకంతోనే భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss 8: లీక్ అయిన బిగ్ బాస్ 8 విన్నర్… ఎవరో తెలుసా?
Anushka: ఆ డైరెక్టర్ కు ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్… స్వీటీ యవ్వారం ఏదో తేడాగా ఉందే?
Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమాకే 100 కోట్ల బడ్జెట్.. సాహసమే అని చెప్పాలి?
Poonam Kaur:మాస్టర్ అని పిలవడానికి ఆయన అర్హుడు కాదు.. జానీ మాస్టర్ పై పూనమ్ కామెంట్స్!
Devara: ఎన్టీఆర్ దేవర పై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు… ఎన్టీఆర్ కి అన్నీ తెలుసు అంటూ?
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Trending
- Featured4 weeks ago
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
- Featured3 weeks ago
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
- Featured2 weeks ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured2 weeks ago
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
- Featured2 weeks ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured3 weeks ago
Sri Devi: 37 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ హీరోయిన్.. సక్సెస్ అయ్యేనా?
- Featured4 weeks ago
Chiranjeevi: మూడుసార్లు చిరు సినిమాలను రిజెక్ట్ చేసి అవమానించిన స్టార్ హీరోయిన్…. మరీ అంత తల పొగరా?
- Featured3 weeks ago
Keerthy Suresh: కీర్తి సురేష్ మొదటి సంపాదన ఎంత.. హీరోయిన్ కాకముందు అలాంటి పనులు చేసేదా?