Connect with us

Featured

చేంబోలు నుంచి.. సిరివెన్నెలా ఇలా మారాడు.. ఆయన ప్రస్థానం ఇదే..

ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్‌ హస్పిటల్‌లో ఈ నెల 26న జాయిన్

Published

on

Advertisement

ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్‌ హస్పిటల్‌లో ఈ నెల 26న జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి అతడు చికిత్స పొందుతుండగా.. తాజాగా అతడు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. అతడి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు.

అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. ఇంటర్ తర్వాత అతడు బీఎస్సీ చదవాలని అనుకున్నా.. తర్వాత అతడు ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడట. తెలుగు భాషపై మంచి పట్టు ఉండటంతో అతడిని ఎంఏ చేయాలని సూచించడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక అతడికి మొదటి అవకాశం ఎంఏ చదువుతుండగానే వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. ఈ సినిమాతో గీతరచయితగా సీతారామ శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది.

అందుకే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. అది అతడికి ఉన్న అంకితభావం. ‘‘వాన బొట్టు ఆల్చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది..అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా’’ సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన.. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

Advertisement

ఇక అతడు శుభలగ్నం సినిమాలో రాసిన ‘మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయాజారాకా’ అన్న పదం ఆయన తప్ప ఇంకెవరు రాయగలరు.. అందుకే ఆయన తెలుగు సినిమా సాహిత్యాన్ని శాసించగలిగారు. భారీ పద ప్రయోగాలు బరువైన మాటలే కాదు ఆయన చిన్న చిన్న పదాలతో ఈ తరానికి అర్ధమయ్యేలా అలరించేలా కూడా పాటలు రాశారు. ఖడ్గం సినిమాలో కూడా అతడు ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు తెరకు అందించాడు.

Advertisement

Featured

YS Jagan Mohan Reddy: జగన్ తిరుమలకు వస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం… ఫైర్ అయిన మాజీ టీటీడీ చైర్మన్!

Published

on

YS Jagan Mohan Reddy: తిరుమల లడ్డు విషయంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న తరుణంలో నిజానిజాలు బయట పెట్టాలి అంటూ వైకాపా నాయకులు మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నారు. ఇలా ఎంతోమందికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీవారి ప్రసాద విషయంలో తప్పుడు ఆరోపణలు చేసి అపచారం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోబోతున్నారు.

Advertisement

ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్నారు ఈ క్రమంలోనే తిరుపతి మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కొంతమంది వైకాపా నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే పలు ప్రాంతాలలో వైకాపా కార్యకర్తలను నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. స్వామి వారిని దర్శించడం కోసం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చని అడ్డుకునే హక్కు వారికి లేదని తెలిపారు.చంద్రబాబు పాశవిక విధానాలను తాము ఎన్నటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వెయ్యి నాలుకల ధోరణిని సీఎం చంద్రబాబు మానుకోవాలని తెలిపారు.

ఇక పవన్ హైందవ ధ్వజ స్తంభం మాదిరిగా ఫీల్ అవుతున్నాడని దుయ్యబట్టారు. మరో పార్టీ బీజేపీ హిందువులంటే తామే అన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు భ్రమలో ఉన్నారని ఆరోపించారు. ఇక జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండపైకి వెళ్లాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కూడా భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

డిక్లరేషన్ అడిగే హక్కు లేదు..
జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఆయనను డిక్లరేషన్ అడిగితే ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ఖాయమని అన్నారు. జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోతే.. దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి కూడా లేదని తెలిపారు. డిక్లరేషన్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందని.. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని భూమన అన్నారు.

Advertisement
Continue Reading

Featured

Savitri: మహానటి సావిత్రి మెడలో పూలమాల వేలం వేస్తే అంత ధర పలికిందా… మాములు క్రేజ్ కాదుగా?

Published

on

Savitri: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహానటి సావిత్రి గారు ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన గుర్తింపు పొందిన ఈమె చివరి క్షణంలో మాత్రం ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని మరణించారు. ఇక సావిత్రి బ్రతికిన నినాదం ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని చెప్పాలి.

Advertisement

ఇక ఈమె సినిమాల పరంగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా సంపాదించినది మొత్తం దాన ధర్మాలకే ఖర్చు చేశారు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని తన వద్దకు వస్తే చాలు తనకు తోచిన సహాయం చేసేవారు. ఇలా దాన గుణంలో సావిత్రికి మించిన వారు ఎవరు లేరని చెప్పాలి. ఇక అప్పట్లో ఈమెను అభిమానించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.

ఇకపోతే సావిత్రి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని సీనియర్ నటి జమున ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపత్తు నిథికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నారట. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గారు ఉన్నారు. అయితే ఆయన సావిత్రి గారి కోసం ఒక పూలమాలను తీసుకువచ్చినట్టు జమున తెలిపారు.

30 వేలు…
ఇలా సావిత్రి మెడలో వేసిన ఆ పూల దండను వేలం వేయగా అప్పట్లో ఆ పూలదండ 30000 ల ధర పలికిందని తెలుస్తుంది. అప్పట్లో 30 వేల రూపాయలు అంటే ఇప్పుడు 30 లక్షలతో సమానమని చెప్పొచ్చు. ఒక పూలదండ 30000 వేలంలో పోవడం అంటే సావిత్రి గారికి ఎలాంటి క్రేజ్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Madhavi Latha: అప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు రాజా.. ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన మాధవీ లత!

Published

on

Madhavi Latha: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తిరుపతి లడ్డు వ్యవహారం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కల్తీ చేస్తుందని జంతువుల కొవ్వు నుంచి తయారుచేసిన నూనె ఉపయోగించారంటే ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తరచు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేస్తున్న పోస్టుల హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై సినీ నటి మాధవి లత స్పందించారు.వేరే మతం వారిని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగుళూర్ లో ఆంజనేయస్వామి కీర్తనాలు వింటున్న వాళ్ళను వేరే మతం వాళ్ళు వచ్చి కొడితే అలాంటి వారి పట్ల ఏం మాట్లాడరు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటూ ఈమె ప్రశ్నించారు.

హిందూ మనోభావాలను గౌరవించి..
ఇక లడ్డు విషయంలో హీరో కార్తీ తన ప్రమేయం లేకున్నా.. హిందువుల మనోభావాలను గౌరవించి వారు క్షమాపణలు చెప్పారు. ఇందులో ఆనందం ఏముంది? తప్పు చెప్పడం వల్ల ఎవరకి ఆనందం రాదు. ఇలా క్షమాపణ చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విషయాలపై కామెంట్స్ చేయరాదనే సదుద్దేశ్యంతో వారు క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి పోస్టులను తప్పుపడుతూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!