Connect with us

Featured

మెగాస్టార్ చిరంజీవి ‌నటించిన స్టేట్ రౌడీ చిత్రంలోని ఈ విలన్.. ఓ స్టార్ హీరో తండ్రి అని మీకు తెలుసా.?!

Published

on

“చుక్కల పల్లకిలో..”తదిగణతోం తప్ప దమ్మ..” రాధా రాధా మదిలోన మన్మధ బాధ.. రాత్రి పగలు..” వన్ టూ త్రీ.. ఇలాంటి పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. చిరంజీవి – బప్పిలహరి ఈ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా స్టేట్ రౌడీ. ఈ కాంబినేషన్ లో ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు చిత్రాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యాయి. బి.గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే.

Advertisement
మెగాస్టార్ చిరంజీవి ‌నటించిన స్టేట్ రౌడీ చిత్రంలోని ఈ విలన్.. ఓ స్టార్ హీరో తండ్రి అని మీకు తెలుసా.?!

1989 మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్, బి.గోపాల్ దర్శకత్వంలో స్టేట్ రౌడీ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, రాధ, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో చిరంజీవి రౌడీ, పోలీస్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. రాయలసీమ రుస్తుంని, నైజాం దాదాని, ఆంధ్రా గుండాని.. టోటల్ గా స్టేట్ రౌడీని. అనే డైలాగు ఈ సినిమాలో చిరంజీవి చెప్తున్నంత సేపూ అభిమానులు ఈలలతో థియేటర్ మొత్తం గోలలు చేశారు. రౌడీలను ఆటపట్టిస్తూ.. డిఫరెంట్ స్టైల్లో వచ్చిన పాట “నే యముడికి మొగుడినిరా మనసు గల మనిషినిరా..” ఈ పాట అభిమానుల్లో మంచి కిక్ ఇచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ‌నటించిన స్టేట్ రౌడీ చిత్రంలోని ఈ విలన్.. ఓ స్టార్ హీరో తండ్రి అని మీకు తెలుసా.?!

ఒక నైజాం ఏరియాలో కోటి రూపాయల వసూళ్లను రాబట్టిన మొదటి తెలుగు చిత్రం స్టేట్ రౌడీ. సినిమా కథలో రావు గోపాల్ రావు తమ్మునిగా కనిపించిన త్యాగరాజన్ భయంకరమైన విలనిజాన్ని పండించాడు. ఈయన తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రముఖ నటి రాధ లీడ్ రోల్ లో వచ్చిన “అలైగల్ ఒయివతిల్లై’ అనే తమిళ సినిమాలో రాధకు పెద్దన్నయ్యగా త్యాగరాజన్ నటించారు. ఆ తర్వాత మలయాళంలో వచ్చిన ‘మలయూర్ మాంబిటియాన్’ అనే చిత్రం ఆయనకి మంచి బ్రేక్ ఇచ్చింది. 1981వచ్చిన రామదండు చిత్రంలో మొదటి సారిగా తెలుగులో త్యాగరాజన్ నటించారు.

మెగాస్టార్ చిరంజీవి ‌నటించిన స్టేట్ రౌడీ చిత్రంలోని ఈ విలన్.. ఓ స్టార్ హీరో తండ్రి అని మీకు తెలుసా.?!

ఆ తర్వాత ఏకలవ్య, అంతిమ తీర్పు, స్టేట్ రౌడీ, మగాడు చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ఈయన ఎవరో కాదు.. 1993 దుర్గా ఫిల్మ్స్, నిర్మాణం, కె.ఋష్యేంధర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలిముద్దు చిత్రంలో నటించిన హీరో ప్రశాంత్ కు స్వయాన తండ్రి. త్యాగరాజన్ ప్రశాంత్ కు తండ్రి మాత్రమే కాదు.. అపరిచితుడు, మల్లన్న, ఐ చిత్రాల ఫేమ్ విక్రమ్ కి స్వయానా మేనమామ వరస అవుతాడు. ఈ ఇద్దరు హీరోలు కూడా శంకర్ దర్శకత్వంలో నటించారు. హీరో ప్రశాంత్, శంకర్ దర్శకత్వంలో 1998లో విడుదలైన జీన్స్ చిత్రంలో నటించారు. హీరో విక్రమ్, శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు, ఐ చిత్రాల్లో నటించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishnu Priya: హౌస్ లో విష్ణుప్రియ బట్టలు మార్చుకోవడం చూసింది అతనేనా.. ఎవరంటే?

Published

on

Vishnu Priya: బిగ్ బాస్ హౌస్ అంటేనే పెద్ద ఎత్తున గొడవలు వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న విష్ణు ప్రియ సోనియా మధ్య భారీ స్థాయిలో వివాదం జరుగుతుంది. సోనియా విష్ణు ప్రియ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.

Advertisement

నీకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ ఉంది నీలాగా బట్టలు వేసుకుని తిరగలేను అంటూ ఇస్టానుసారంగా మాట్లాడటంతో సోనియా బాగా నెగిటివ్ అవుతుంది. నిజానికి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బిగ్ బాస్ హౌస్లో చేయలేదు. అంతేకాకుండా సోనియా ఫేమస్ అవడం కోసం విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఇక విష్ణు ప్రియ గురించి నిఖిల్, అభయ్ దగ్గర మాట్లాడుతూ.. విష్ణుప్రియ రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే ఆదిత్య ఆ రూంలోకి వెళ్లారు. అయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆమె జస్ట్ బ్లౌజ్ లో ఉంది మళ్లీ వచ్చి ఆదిత్య గారు ఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ సారీ అని చెప్తుంది.

ఆదిత్య ఓం..
నిజానికి ఆదిత్య ఓం అంత అన్ కంఫర్ట్బుల్ ఫీల్ అయ్యారని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం. సోనియా హౌస్ లో ఫేమస్ అవడం కోసం కేవలం విష్ణు ప్రియ ను టార్గెట్ చేస్తూ రావడంతో ఈమె పట్ల అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు తనని హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై ఈ వారం నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Janhvi Kapoor: దేవర ప్రమోషన్స్ కోసం జాన్వీ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ముంబైలో ఎంతో ఘనంగా లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటించారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ గులాబీ రంగు చీర కట్టుకొని సందడి చేశారు. అయితే ఈమె చీర అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమె కట్టిన ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ వేడుకలో జాన్వీ కపూర్ నచికేత్ బ్రావే డిజైన్ చీరను కట్టారు.

దేవర…
ఈ చీర ఖ‌రీదు అక్ష‌రాల రూ. 1,24,850. అలాగే పింక్ శారీకి పెయిర్ అప్ గా చెవుల‌కు జాన్వీ పెట్టుకున్న ఇయ‌ర్ రింగ్స్ ధ‌ర రూ. 13 ల‌క్ష‌లని తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా సెలబ్రిటీలు బ్రాండెడ్ దుస్తులను ధరించడం సర్వసాధారణం. ఇక దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Star Anchor: నాట్యం చేస్తున్న ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా… ఇప్పుడు టాప్ యాంకర్?

Published

on

Star Anchor: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఒక యాంకరమ్మ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

నాట్యం మయూరిలా ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె అభిమానులు ఈ ఫోటోను మరింత వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్. ఎస్ మీరు గెస్ చేసినది కరెక్టే ఇక్కడ ఉన్నది యాంకర్ సుమ.

సుమా కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తల్లి తండ్రుల ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. ఇక హైదరాబాదులో ఉంటూనే ఈమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మొదట దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల సీరియల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయము కాస్త ప్రేమగా మారడం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.

యాంకర్ సుమ..
ఇలా పెళ్లి తర్వాత కూడా సుమ ఇండస్ట్రీలో పలు సినిమాలు అలాగే సీరియల్స్ లో నటించారు. అనంతరం యాంకర్ గా కూడా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఏదైనా ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. ఆ సినిమా టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమ పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పాలి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!