Featured
Actress Khushbu: అప్పుడే 32 ఏళ్లు గడచిపోయింది..ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఖుష్బూ!
Published
1 year agoon
By
lakshanaActress Khushbu: అలనాటి అందాల నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఖుష్బూ ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఖుష్బూ తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 200 పైగా సినిమాలలో నటించింది.
ఇప్పటికీ సినిమాలలో కీలకపాత్రలలో నటించడమే కాకుండా రాజకీయాలలోకి కూడా ప్రవేశించి అటు పాలిటిక్స్ ని ఇటు సినిమాలోని సమానంగా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా తెలుగులో బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా కుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కుష్బూ నటించిన చిన్నతంబి సినిమా గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
Actress Khushbu: నా గుండె కొట్టుకుంటూనే ఉంది..
1991లో విడుదలైన చిన్నతంబి సినిమాలో కుష్బూ, ప్రభు జంటగా నటించారు. నేటికి ఈ సినిమా విడుదలై 32 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో..” చిన్న తంబి సినిమా విడుదలై 32 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. వాసు ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. నాపై ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా గారికి, బాలసుబ్రమణ్యం గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నందిని పాత్ర ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు అంటూ” కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
Just can’t believe it’s been 32 yrs since #ChinnaThambi took tamil cinema by storm. Will always be indebted for the love showered upon me. My heart will always beat for #PVasu Sir & #Prabhu Sir. Forever grateful to #Illaiyaraja Sir for his soul stirring music n Late #KBalu for… pic.twitter.com/EDxxKwnDaN
— KhushbuSundar (@khushsundar) April 12, 2023
You may like
: ఆయనే మళ్లీ పుట్టాడంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరో నిఖిల్?
Chiranjeevi: కనిపించే దేవత అమ్మ అంటూ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు.. ఫోటోలు వైరల్!
Anchor Jhansi: 2023 నాకు కన్నీళ్లను మిగిల్చింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ ఝాన్సీ!
Khushbu: ఇప్పటికీ ఎన్టీఆర్ విషయంలో ఆ కోరిక తీరలేదు…. సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి కుష్బూ!
Anasuya: మనిద్దరం పర్ఫెక్ట్ కాదని నాకు తెలుసు… భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన అనసూయ!
Chiranjeevi: మదర్స్ డే రోజున అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్..?
Featured
YS Jagan Mohan Reddy: జగన్ తిరుమలకు వస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం… ఫైర్ అయిన మాజీ టీటీడీ చైర్మన్!
Published
3 days agoon
27 September 2024By
lakshanaYS Jagan Mohan Reddy: తిరుమల లడ్డు విషయంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న తరుణంలో నిజానిజాలు బయట పెట్టాలి అంటూ వైకాపా నాయకులు మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నారు. ఇలా ఎంతోమందికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీవారి ప్రసాద విషయంలో తప్పుడు ఆరోపణలు చేసి అపచారం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోబోతున్నారు.
ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్నారు ఈ క్రమంలోనే తిరుపతి మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కొంతమంది వైకాపా నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే పలు ప్రాంతాలలో వైకాపా కార్యకర్తలను నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. స్వామి వారిని దర్శించడం కోసం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చని అడ్డుకునే హక్కు వారికి లేదని తెలిపారు.చంద్రబాబు పాశవిక విధానాలను తాము ఎన్నటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వెయ్యి నాలుకల ధోరణిని సీఎం చంద్రబాబు మానుకోవాలని తెలిపారు.
ఇక పవన్ హైందవ ధ్వజ స్తంభం మాదిరిగా ఫీల్ అవుతున్నాడని దుయ్యబట్టారు. మరో పార్టీ బీజేపీ హిందువులంటే తామే అన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు భ్రమలో ఉన్నారని ఆరోపించారు. ఇక జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండపైకి వెళ్లాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కూడా భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
డిక్లరేషన్ అడిగే హక్కు లేదు..
జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఆయనను డిక్లరేషన్ అడిగితే ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ఖాయమని అన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే.. దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి కూడా లేదని తెలిపారు. డిక్లరేషన్ వెనుక రాజకీయ కుట్ర ఉందని.. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని భూమన అన్నారు.
Featured
Savitri: మహానటి సావిత్రి మెడలో పూలమాల వేలం వేస్తే అంత ధర పలికిందా… మాములు క్రేజ్ కాదుగా?
Published
3 days agoon
27 September 2024By
lakshanaSavitri: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహానటి సావిత్రి గారు ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన గుర్తింపు పొందిన ఈమె చివరి క్షణంలో మాత్రం ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని మరణించారు. ఇక సావిత్రి బ్రతికిన నినాదం ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని చెప్పాలి.
ఇక ఈమె సినిమాల పరంగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా సంపాదించినది మొత్తం దాన ధర్మాలకే ఖర్చు చేశారు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని తన వద్దకు వస్తే చాలు తనకు తోచిన సహాయం చేసేవారు. ఇలా దాన గుణంలో సావిత్రికి మించిన వారు ఎవరు లేరని చెప్పాలి. ఇక అప్పట్లో ఈమెను అభిమానించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.
ఇకపోతే సావిత్రి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని సీనియర్ నటి జమున ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపత్తు నిథికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నారట. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గారు ఉన్నారు. అయితే ఆయన సావిత్రి గారి కోసం ఒక పూలమాలను తీసుకువచ్చినట్టు జమున తెలిపారు.
30 వేలు…
ఇలా సావిత్రి మెడలో వేసిన ఆ పూల దండను వేలం వేయగా అప్పట్లో ఆ పూలదండ 30000 ల ధర పలికిందని తెలుస్తుంది. అప్పట్లో 30 వేల రూపాయలు అంటే ఇప్పుడు 30 లక్షలతో సమానమని చెప్పొచ్చు. ఒక పూలదండ 30000 వేలంలో పోవడం అంటే సావిత్రి గారికి ఎలాంటి క్రేజ్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది.
Featured
Madhavi Latha: అప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు రాజా.. ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన మాధవీ లత!
Published
3 days agoon
27 September 2024By
lakshanaMadhavi Latha: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తిరుపతి లడ్డు వ్యవహారం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కల్తీ చేస్తుందని జంతువుల కొవ్వు నుంచి తయారుచేసిన నూనె ఉపయోగించారంటే ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తరచు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేస్తున్న పోస్టుల హాట్ టాపిక్ గా మారాయి.
ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై సినీ నటి మాధవి లత స్పందించారు.వేరే మతం వారిని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగుళూర్ లో ఆంజనేయస్వామి కీర్తనాలు వింటున్న వాళ్ళను వేరే మతం వాళ్ళు వచ్చి కొడితే అలాంటి వారి పట్ల ఏం మాట్లాడరు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటూ ఈమె ప్రశ్నించారు.
హిందూ మనోభావాలను గౌరవించి..
ఇక లడ్డు విషయంలో హీరో కార్తీ తన ప్రమేయం లేకున్నా.. హిందువుల మనోభావాలను గౌరవించి వారు క్షమాపణలు చెప్పారు. ఇందులో ఆనందం ఏముంది? తప్పు చెప్పడం వల్ల ఎవరకి ఆనందం రాదు. ఇలా క్షమాపణ చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విషయాలపై కామెంట్స్ చేయరాదనే సదుద్దేశ్యంతో వారు క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి పోస్టులను తప్పుపడుతూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
YS Jagan Mohan Reddy: జగన్ తిరుమలకు వస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం… ఫైర్ అయిన మాజీ టీటీడీ చైర్మన్!
Savitri: మహానటి సావిత్రి మెడలో పూలమాల వేలం వేస్తే అంత ధర పలికిందా… మాములు క్రేజ్ కాదుగా?
Madhavi Latha: అప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు రాజా.. ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన మాధవీ లత!
Pawan Kalyan: జగన్ తిరుపతి పర్యటన… కూటమి శ్రేణులకు పవన్ కీలక సూచనలు!
Sekhar Basha: అమ్మాయిలకు చట్టాలు చుట్టాలు వంటివి…జానీ మాస్టర్ కేసులో శేఖర్ భాషా కామెంట్స్!
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
Nagababu: రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం పై నాగబాబు ప్రశంసలు… ఆంధ్రా సమస్యలు పట్టవా అంటూ?
Trending
- Featured4 weeks ago
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
- Featured4 weeks ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured3 weeks ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured4 weeks ago
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
- Featured4 weeks ago
Nagababu: రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం పై నాగబాబు ప్రశంసలు… ఆంధ్రా సమస్యలు పట్టవా అంటూ?
- Featured3 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
- Featured4 weeks ago
Sonia Akula: బిగ్ బాస్ కంటెస్టెంట్.. కరాటే ఫైటర్ సోనియా ఆకుల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
- Featured3 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?