Connect with us

Featured

Athadu Movie: ఉదయ్ కిరణ్ చేయాల్సిన అతడు సినిమా..! మహేష్ బాబు చేయడానికి కారణం ఏమిటో తెలుసా?

Athadu Movie: సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఘటనలు వింటూ ఉంటాం.. ఈ సినిమా ఓ హీరో చేయాల్సింది మరెవరో చెశారు అని. అయితే వద్దు అనుకున్న సినిమాలు ఆ

Published

on

Athadu Movie: సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఘటనలు వింటూ ఉంటాం.. ఈ సినిమా ఓ హీరో చేయాల్సింది మరెవరో చెశారు అని. అయితే వద్దు అనుకున్న సినిమాలు ఆ డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ వేరే హీరోను తీసుకొని చేస్తే.. ఆ సినిమా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.. ఫట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కోవకు సంబంధించింది ఓ విషయం గురించి ఇక్కడ మనం చర్చించుకుందాం..

Athadu Movie: ఉదయ్ కిరణ్ చేయాల్సిన అతడు సినిమా..! మహేష్ బాబు చేయడానికి కారణం ఏమిటో తెలుసా?

సూపర్ స్టార్ మహష్ బాబు ఒక హీరోగా ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న సినిమాల్లో ఎక్కువగా మనం చెప్పే సినిమాలు రెండు అందులో ఒక్కడు, అతడు. ఈ రెండు సినిమాలో అతడి కెరీర్ ను కీలక మలుపు తిప్పాయి. ఎన్నో సెంటర్లలో 100 రోజులు ఆడి.. బంపర్ మెజారిటీతో హిట్ కొట్టాయి. అంతడు సినిమాను రూ.24 కోట్లతో తెరకెక్కించగా.. థియేట్రికల్ బిజినెస్ కు రూ.16.5 కోట్లు వస్తే.. రూ.17.5 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా క్యాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచిందనే చెప్పాలి.

Athadu Movie: ఉదయ్ కిరణ్ చేయాల్సిన అతడు సినిమా..! మహేష్ బాబు చేయడానికి కారణం ఏమిటో తెలుసా?
Athadu Movie: ఉదయ్ కిరణ్ చేయాల్సిన అతడు సినిమా..! మహేష్ బాబు చేయడానికి కారణం ఏమిటో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ అతడు సినిమాను మొదట మహేష్ బాబు హీరోగా అనేకోలేదట. దానిని మొదట యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ను అనుకున్నారట. నువ్వు నేను సినిమాతో మంచి ఊపు మీదున్న ఉదయ్ కిరణ్.. అతడికి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

కథ చివరకు మహేష్ బాబు వద్దకు..

ఇక దీనిని జయభేరీ ఆర్ట్స్ లో చేయాలని అనుకొని.. త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ కూడా అడ్వాన్స్ ఎమౌంట్ కూడా తీసుకున్నారట. కానీ షూటింగ్ టైంకు డేట్స్ కుదరకపోవడంతో.. ఉదయ్ కిరణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లగా.. అతడు ఆ సమయంలో పడుకొని ఉండటంతో.. కథ వినిపించేందుకు కుదరలేదు. దీంతో అక్కడ నుంచి మహేష్ బాబు దగ్గరకు వెళ్లింది. ఈ కథ విన్న వెంటనే సిగ్నల్ ఇచ్చేరట మహేష్ బాబు. ఇలా తెరమీదకు వచ్చింది అతడు సినిమా. ముందుగా పద్మాలయ బ్యానర్ పై చేయాలని మహేష్ అనుకున్నా.. జయభేరీ ఆర్ట్స్ కు త్రివిక్రమ్ కమిట్ అవ్వడంతో.. ఈ బ్యానర్ లోనే తీశారు. ఇక ఈ సినిమాను మా టీవీ రూ.7 కోట్లకు రెన్యూవల్ చేసుకుందట.

Advertisement

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!