Bollywood Actresses: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో సక్సెస్ అవ్వడం కోసం పెద్ద ఎత్తున సెలెబ్రెటీల పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా అభిమానులు ఆరాటం చూపుతూ ఉంటారు. ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల గురించి రోజుకొక వార్త వినపడుతూనే ఉంటుంది.
Advertisement
ఒక హీరోతో కలిసి రెండు మూడు సినిమాలు చేశామంటే ఆ హీరోయిన్లకు వారితో ఎఫైర్ ఉందనే అభిమానులు ఫిక్స్ అవుతూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారందరూ ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు అయితే పెళ్లికి ముందు ఒక్కో హీరోయిన్ కి ముగ్గురు నలుగురితో ఎఫైర్స్ ఉండేవని తెలుస్తోంది.
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి అనుష్క శర్మ విరాట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అంతకుముందే ఈమె జోసెఫ్ యూసుఫ్, షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, సురేష్ రైనాలతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ విరాట్ ను వివాహం చేసుకున్నారు.
అలియా భట్ ప్రస్తుతం నటుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చారు. తన ఫ్యామిలీతో ఎంతో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడుపుతున్న ఈమె పెళ్ళికి ముందు సిద్ధార్థ మల్హోత్రా, అలియా అలీ దాదార్కర్, కవిన్ మిట్టల్తో రిలేషన్లో ఉన్నారనే వార్తలు గట్టిగా వినపడ్డాయి.
Advertisement
ఇక మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చారు. అయితే పెళ్లికి ముందు ఈమె కూడా నటుడు సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడ్డారని వార్తలు వినిపించాయి.
దీపికా పదుకొనే: నటుడు రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకొని త్వరలో అమ్మ కాబోతున్న నటి దీపికా పదుకొనే పెళ్లికి ముందే ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, సిద్ధార్థ్ మాల్యాలతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. పెళ్లికి ముందే రిలేషన్లు… ప్రియాంక చోప్రా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకొని కూతురుకు జన్మనిచ్చారు. అయితే ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగే సమయంలో అక్షయ్ కుమార్, హర్మాన్ బవేజాతో ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో పుకార్లు వచ్చాయి. అయితే షారూఖ్ ఖాన్ తో ప్రియాంకకు ఉన్న సంబంధం గురించి భారీ స్థాయిలో రూమర్లు వినిపించాయి. ఇలా పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పెళ్లికి ముందే పలువురు స్టార్ హీరోలతో రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan Tej) చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మరో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.
Advertisement
ఎన్నో సందర్భాలలో దర్శక నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అభిమానులు ఈ సినిమా గురించి అప్డేట్స్ అడిగినప్పటికీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్(SS Thaman) రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా సినిమాకు సంబంధించిన వరుస ఈవెంట్స్ జరుగుతాయని అభిమానులు రెడీగా ఉండాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ సినిమాకు వరుసగా ఈవెంట్స్, సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఉంటాయి. రెడీ గా ఉండండి. వచ్చేవారమే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రాబోతుంది అంటూ ఈయన వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు(Dil Raju) క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని చెప్పిన తేదీ మాత్రం చెప్పలేదు. కానీ తమన్ మాత్రం 20వ తేదీ విడుదల కాబోతుందని చెప్పకనే చెప్పారు అయితే ఈ విడుదల తేదీ గురించి త్వరలోనే అధికారక ప్రకటన ఇవ్వనున్నారు.
సినీనటుడు సిద్దార్థ్ (siddarth) ఇటీవల మరోసారి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన నటి అదితి రావు హైదరి(Aditi Rao Hydari) తో మరోసారి ఏడడుగులు నడిచారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే సెప్టెంబర్ 16వ తేదీ వీరి వివాహం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే వీరి వివాహం జరిగింది.
Advertisement
ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలలో సిద్దార్థ్ ధరించిన వాచ్ (Watch) అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రౌన్ బెల్ట్, గెల్డెన్ వాచ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సిద్ధార్థ్ ధరించిన గోల్డ్ కేస్తో కూడిన ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ వాచ్ ధర రూ.27.62 లక్షలు అని సమాచారం. సింపుల్ గా కనిపిస్తున్న ఆ వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.
సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం కానీ సిద్దార్థ్ కట్టిన ఈ వాచ్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ధర మాత్రం భారీ స్థాయిలో ఉండడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరిద్దరికీ మొదట పరిచయం మహాసముద్రం సినిమా సమయంలో జరిగిందని అప్పుడే వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నట్టు అదితి పలు సందర్భాలలో తెలిపారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి నిజ జీవితంలో కూడా ఒకటయ్యారు. ఇక వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడంతో నేటిజన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Kumari Aunty: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి మనకు తెలిసినదే. తెలంగాణలో ఖమ్మం ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం వరదలలో మునిగిపోయింది. ఇలా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఎంతోమంది ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలను అందజేస్తూ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇప్పటికీ ఎంతోమంది విరాళాలు అందజేస్తూనే ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చెక్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టార్ కుమారి ఆంటీ సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని కలిశారు.
Advertisement
ఈ సందర్భంగా ఈమె వరద బాధితులకు తనవంతు సహాయంగా కొంత డబ్బును విరాళంగా అందించారు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో కుమారి ఆంటీ (Kumari Aunty) ఒకరు. ఈమె అతి తక్కువ ధరకే ఎన్నో రకాల ఆహార పదార్థాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబర్స్ అలాగే ఫుడ్ వ్లాగర్స్ వెళ్లి ఈమెను మరింత ఫేమస్ చేశారు. ఇలా రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని కుమారి ఆంటీ భారీగా సంపాదించడమే కాకుండా ఇదే క్రేజ్ తో పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించి సందడి చేశారు.
ఇలా వ్యాపారంలో మంచి సక్సెస్ అందుకున్న కుమారి ఆంటీ తన మంచి మనసును చాటుకున్నారు వరదల (Floods) కారణంగా అతలాకుతులమైనటువంటి తెలంగాణకు ఈమె తన వంతు సహాయంగా 50 వేల రూపాయల విరాళం అంద చేశారు. ఈ 50,000 రూపాయలు చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో ఈమె మంచి మనసు పై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశంసలు రావడమే కాకుండా ఎంతోమంది గొప్పవారు కూడా చేయని సహాయం కుమారి ఆంటీ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.