Connect with us

Featured

క్లాస్ చిత్రాల దర్శకుడికి ప్రయోగాలు చేయాలని ఎందుకనిపిస్తోంది.. గతంలో దెబ్బతిన్నా కూడా..?

Published

on

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మారిన ఒక్కొక్కరికిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ దర్శకుడుని చూడగానే ఒక తరహా చిత్రాలు కళ్ళ ముందు కదలాడతాయి. ఉదాహరణకి ఆర్.నారాయణ మూర్తి అంటే విప్లవ సినిమాలు అని ఎవరినైనా అడగనవసరం లేదు. పైగా ఆయన సినిమాలు ఎక్కువశాతం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవని అంటుంటారు. కానీ ఆయన ఒకే జోనర్ తరహా చిత్రాలను తీసి ఒకదశలో భారీ విజయాలను అందుకున్నారు. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ గారి సినిమాలు అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలు ఎన్నేళ్ళ తర్వాత చూసుకున్న చక్కటి అనుభూతి కలుగుతుంది.

ఇక రాజమౌళి సినిమాలంటే ఒక ప్రత్యేకత, కొరటాల శివ సినిమాలంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలని, అనిల్ రావిపూడి సినిమాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అని ఒక మార్క్ పడిపోయింది. ఈ ముగ్గురు వరుస సక్సెస్‌లతో క్రేజీ డైరెక్టర్స్‌గా కొనసాగుతున్నారు. అదే క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ఒక మార్క్ పడింది. యూత్ ఎంటర్‌టైన్న్మెంట్స్, మంచి క్లాస్ సినిమాలను తెరకెక్కిస్తారని అందరిలో ఓ గుర్తింపు ఉంది. ఆయన కూడా పెద్ద హీరోలకి నేను మాస్ కథలను చెప్పి ఒప్పించలేను. నేను కథ చెప్పడానికి వెళితే హీరోలకి నన్ను చూసి నీరసం వస్తుందని చెప్పిన సందర్భం ఉంది.

శేఖర్ కమ్ముల సినిమాలంటే ఇప్పటి వరకు వచ్చినవన్నీ మనసుకు హత్తుకునేలా ఆహ్లాదకరంగా ఉండేవి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటి, ఫిదా ..ఇలా అన్నీ ఆయన మార్క్ చిత్రాలే. వీటిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆశించినంతగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాను అందరూ హ్యాపీడేస్‌తో కంపేర్ చేయడం కూడా తెలిసిందే. తీసిన కథనే మళ్ళీ తిప్పి తీశాడని చెప్పుకున్నారు. ఇక ఫిదా సినిమా శేఖర్ కమ్ములకి మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌కి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవిల మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ సినిమా భారీ హిట్‌గా నిలవడానికి ప్రధాన కారణాలయ్యాయి.

ఇక తాజాగా నాగ చైతన్య – సాయి పల్లవిలతో లవ్ స్టోరి అనే ఎమోషనల్ లవ్ స్టోరి మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలిగించింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే కోలీవుడ్ హీరో ధనుష్‌తో ఓ త్రిభాషా చిత్రాన్ని ప్రకటించాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనుంది. అయితే తాజాగా ఈ సినిమా ఏ జోనర్‌లో తెరకెక్కించబోతున్నారో రివీల్ చేశారు. అలాగే రానాతో లీడర్ సినిమా సీక్వెల్ ఉంటుందని వెల్లడించాడు.

దాంతో లవ్ స్టోరి తర్వాత శేఖర్ కమ్ముల మీద కామెంట్స్ మొదలయ్యాయట. ఇన్నాళ్ళు క్లాస్ చిత్రాలు తీసిన దర్శకుడు థ్రిల్లర్ జోనర్ సినిమా ఏంటీ..అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఆయన గతంలో నయనతారతో అనామిక అనే సినిమా తీసి ఫ్లాప్ మూటకట్టుకున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన కహానీ సినిమాకి రీమేక్ ఇది. అప్పుడు అందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ధనుష్‌తో థ్రిల్లర్ సినిమా, అది కూడా పాన్ ఇండియన్ అనగానే రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇక రానాతో లీడర్ సీక్వెల్ అంటే కూడా ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

2010లో రానాను హీరోగా పరిచయం చేస్తూ లీడర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. రానా లాంచింగ్ మూవీ అనా, లేక శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి పొల్టికల్ బ్యాక్ డ్రాప్ సినిమా వస్తుందనా..లేక ఇతర కారణాలతోనా అన్నది పక్కన పెడితే లీడర్ శేఖర్ కములకి కమర్షియల్ హిట్ ఇవ్వలేకపోయింది. అందుకే తాజాగా శేఖర్ కమ్ముల ధనుష్‌తో థ్రిలర్ మూవీని, రానాతో లీడర్ సీక్వెల్ అనగానే కొంత షాకవుతున్న జనాలు ఉన్నారు. చూడాలి మరి తనకి సక్సెస్ ఇవ్వని జోనర్ సినిమాలతో శేఖర్ కమ్ముల హిట్ ఇచ్చి చూపిస్తారేమో.

Advertisement
Continue Reading
Advertisement

Featured

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆగని అవార్డులు.. ఫిలింఫేర్ అవార్డులలో సత్తా?

Published

on

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.

Advertisement

ఏడు విభాగాలలో అవార్డులు..
వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ananth Ambani: వామ్మో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.

ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

5000 కోట్లు..
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.

Advertisement
Continue Reading

Featured

Lavanya: పవన్ మూడు పెళ్లిళ్ల పై లావణ్య షాకింగ్ కామెంట్స్.. ఆయన వద్దే తేల్చుకుంటా అంటూ?

Published

on

Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.

రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.

Advertisement

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!