Madhavan : రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, మాధవన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం నంబి నారాయణన్ జీవితాన్ని గూఢచారిగా మార్చిన కుంభకోణాన్ని తెలిపే కథ. అలాగే దాని వెనుక ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం. మాధవన్ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రంలో ఫిలిస్ లోగాన్, విన్సెంట్ రియోట్టా మరియు రాన్ డొనాచీ కూడా ఉన్నారు, ఇందులో షారుఖ్ ఖాన్ మరియు సూర్య ప్రత్యేక పాత్రలు పోషించారు. సిమ్రాన్ మాధవన్ భార్యగా నటిస్తోంది.
తమిళ నటుడు రంగనాథన్ మాధవన్ తన రాబోయే చిత్రం ‘ది నంబి ఎఫెక్ట్’ ప్రచారం కోసం మీడియాతో ముచ్చటిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షంలోకి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించగలిగిన కారణాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాని మార్స్ మిషన్ కోసం, అది పంచాంగం హిందూ క్యాలెండర్ను ఉపయోగించింది అంటు సంచలన వాఖ్యలు చేసి వైరల్ అవుతున్నారు.
మన రాకెట్ అంతరిక్షంలో వెళ్లాలంటే పంచాంగం…
Advertisement
పాశ్చాత్య దేశాల రాకెట్లు అంతరిక్ష కక్ష్యలోకి తమను తాము ముందుకు నడిపించడానికి సహాయపడే మూడు ఇంజిన్లు ఘన, ద్రవ మరియు క్రయోజెనిక్ ఇంజన్లు. కానీ అవి మన భారతీయ రాకెట్లలో లేవు. ఆ ఇంజన్లు లేకపోవడం వల్ల మనం ఇస్రో వారు పంచాంగాన్ని ఉంపయోగిస్తున్నారు అంటు వీడియోలో ఇంకా వివిధ గ్రహాలు, గురుత్వాకర్షణ బలం, సూర్యుడి అగ్ని వాతావరణం మొదలైన వాటి గురించి సమాచారం 1000 సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా లెక్కించబడి ఖగోళ మ్యాప్ను కలిగి ఉంది. మరియు ఈ సమాచారాన్ని ఉపయోగించి మైక్రో సెకండ్స్ లెక్కించి రాకెట్ ప్రయోగించబడింది. అది భూమి, చంద్రుడు మరియు బృహస్పతి, చంద్రుని చుట్టూ తిరుగుతుంది మరియు మార్స్ యొక్క కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది అంటు వీడియోలో మాధవన్ అన్నారు. ఇక ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.
In case you do not understand Tamil the gist is Indian rockets did not have 3 engines ( solid, liquid and cryogenic) that helps western rockets propel themselves into mars orbit. But since Indian lacked that they used all the information in the panchangam (hindu almanac)— T M Krishna (@tmkrishna) June 23, 2022
ఇక మాధవన్ ను నెటిజన్స్ బాగా ఏకిపారేస్తున్నారు. ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు అన్నీ కనుక్కున్నాడా? అంటు ఒక నెటిజెన్ ప్రశ్నించగా, ఏం నాన్సెన్స్ ఇది? సైన్స్తో పంచాంగం ? దేవుడా నా దేశాన్ని రక్షించు, అని మరొక నెటిజెన్ రాసాడు. ఒకప్పుడు తమిళ రొమాంటిక్ సినిమాల పోస్టర్ బాయ్గా ఉన్న వ్యక్తి వాట్సాప్ అంకుల్గా మారడం చాలా నిరాశకు గురిచేసింది, అని ఒక జర్నలిస్ట్ కామెంట్స్ చేసారు.
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.
ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.
Advertisement
ఏడు విభాగాలలో అవార్డులు.. వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.
ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.
ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
5000 కోట్లు.. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.
Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.
రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.
Advertisement
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు.. ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.