Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ నలుగురు సీనియర్ హీరోయిన్స్ తో నటించిన చిత్రాలు.. “వేట” 1986లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, జయప్రద, సుమలత ముఖ్య పాత్రలు పోషించారు. చిరంజీవి కథానాయకుడిగా విజయవంతమైన ఖైదీ అనే సినిమాను నిర్మించిన సంయుక్త మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఈ సినిమాకు 1844 లో అలెగ్జాండ్రి డ్యూమాస్ రచించిన ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో (The count of Monte Cristo) అనే నవల ఆధారం. ఈ చిత్రానికి రచన పరుచూరి బ్రదర్స్. సంగీతం కె. చక్రవర్తి. వి. ఎస్. ఆర్ స్వామి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించగా వెల్లై స్వామి ఎడిటింగ్ చూసుకున్నాడు.
“నకిలి మనిషి” 1980లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. సంగీత, సునీత మరియు సత్యనారాయణ నటించారు. ఈ చిత్రం 1 ఆగస్టు 1980న విడుదలైంది. చిరంజీవి, సంగీత ఈ ఒక్క చిత్రంలో కలిసి జోడి కట్టారు. సినిమా కథను గమనిస్తే…
మధ్యతరగతి వ్యక్తి అయిన ప్రసాద్ ( చిరంజీవి ) నిజాయితీ కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. ఉద్యోగం చేయలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, డబ్బు కోసం చనిపోవడానికి అంగీకరించాడు. అతనికి చావడానికి పనికి వచ్చే రమ (సునీత) దానికి డబ్బు చెల్లిస్తుంది. కానీ చివరి నిమిషంలో, ప్రసాద్ జీవించాలనుకుంటున్నాడు మరియు గంగరాజు ( సత్యనారాయణ), అతను సురక్షితమైన స్థలంలో దాక్కున్నాడు. ప్రసాద్లా కనిపించే శ్యామ్ (చిరంజీవి) ఆస్తి కోసం రాముడి సహాయంతో గంగాధర్ రావును హత్య చేసి డబ్బు దాచేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా సినిమా కథాంశం.
హిందీ లో విజయవంతమైన ‘ముకద్దర్ కా సికందర్’ కి తెలుగు పునర్నిర్మాణమే “ప్రేమ తరంగాలు” చిత్రం. అమితాబ్ బచ్చన్ పాత్రని కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రని చిరంజీవి, రాఖీ పాత్రని సుజాత పోషించారు. సంక్షిప్తంగా కథ గమనిస్తే.. చిన్న వయసులో వేధింపులకు గురైన చిన్న పిల్లవాడు, విజయ్ రంగారావు ( కాంతారావు ) అనే సంపన్నుడి ఇంట్లో పనిచేస్తూ పగలు మరియు రాత్రి బానిసలుగా జీవించడానికి కష్టపడతాడు. రంగారావుకి అతనంటే ఇష్టం లేదు. గతంలో మరో అనాథ అతని దయను ఉపయోగించుకున్నాడని, అందుకే అతని శత్రుత్వం బయటపడిందని తరువాత తెలుస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా సినిమా కథాంశం.
“పార్వతి పరమేశ్వరులు” చిరంజీవి, చంద్రమోహన్, ప్రభ, స్వప్న నటించిన 1981 నాటి తెలుగు చిత్రం. పల్లవీ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్. కోటారెడ్డి దర్శకత్వంలో ఎస్. వెంకటరత్నం నిర్మించాడు. చిరంజీవి ప్రభ కలిసి ఈ ఒక్క చిత్రంలో మాత్రమే నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. జయప్రద, సుజాత, సంగీత, ప్రభ వంటి సీనియర్ హీరోయిన్స్ తో చిరంజీవి నటించిన ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని పొందాయి.
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.
ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.
Advertisement
ఏడు విభాగాలలో అవార్డులు.. వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.
ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.
ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
5000 కోట్లు.. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.
Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.
రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.
Advertisement
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు.. ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.