Connect with us

Featured

Thamas Jane : పడమటి సంధ్యారాగం’ హీరో ఇప్పుడు హాలివుడ్ లో పెద్ద స్టార్ అని మీకు తెలుసా?

Published

on

Thamas Jane : హాలీవుడ్ నటీనటులు మన భారత దేశ చలన చిత్రాల్లో చాలా తక్కువగా నటిస్తారు. చాలా అంటే చాలా తక్కువగా తెలుగు వెండితెరపై హాలీవుడ్ నటీనటులు కనపడతారు. అయితే 33 ఏళ్ల క్రితమే హాలీవుడ్ కి చెందిన వ్యక్తిని తెలుగు వెండి తెరకు పరిచయం చేశాడు టాలీవుడ్ దర్శకుడు జంధ్యాల. అవును, 1987 సంవత్సరంలో నిర్మించిన పడమటి సంధ్యారాగం సినిమాలో విజయశాంతికి ప్రేమికుడిగా, ఆపై భర్త గా నటించి మెప్పించాడు ఆ హాలీవుడ్ నటుడు. ఇక ఆయన పేరేంటి, అతడు ఏ ఏ సినిమాలో నటించాడు అన్న విషయం చూస్తే…

ఆ హాలీవుడ్ వ్యక్తి పేరు థామస్ జేన్… ఈయన ఫిబ్రవరి 22, 1969 న జన్మించాడు. జేన్ జంధ్యాల దర్శకత్వం వహించిన పడమటి సంధ్యా రాగం (1987) తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత ది హస్ట్లర్ ఇన్ ఐల్ లవ్ యు ఫరెవర్, టునైట్ (1992), జెఫ్ ఇన్ బఫీ ది వాంపైర్ స్లేయర్ (1992), బిల్లీ ఇన్ నెమెసిస్ (1992), సిటీ ఆఫ్ ఏంజిల్స్ (1996), బూగీ నైట్స్ (1997), ది థిన్ రెడ్ లైన్ (1998), థర్స్ డే (1998), మాగ్నోలియా (1999) తో సహా పలు చిత్రాలలో ఆయన సహాయక పాత్రలు పోషించారు.

అయితే ఆ తర్వాత బేస్ బాల్ ఆటగాడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన తరువాత 61 సినిమాలో మిక్కీ మాంటిల్, దక్షిణాఫ్రికా చిత్రం స్టాండర్ (2003) లో ఆండ్రీ స్టాండర్ తో ప్రారంభమైన ప్రధాన పాత్రల ఆఫర్లను అందుకున్నాడు. వీటితో అతని నటన తో విమర్శకుల నుండి ప్రశంసలను పొందాడు. టెలివిజన్ పాత్రలలో చిత్రం 61 * (2001) లో మిక్కీ మాంటిల్, HBO లో వచ్చిన సిరీస్ హంగ్ (2009–2011) మరియు సిఫై అమెజాన్ వీడియో సిరీస్‌లలో నటించారు. అంతేకాదు అతను రా స్టూడియోస్ అనే వినోద సంస్థ స్థాపకుడు, అతను రాసిన కామిక్ పుస్తకాలను విడుదల చేయడానికి దానిని ఉపయోగిస్తాడు. వాటిలో మొదటిది బాడ్ ప్లానెట్. క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కంట్రీ (2009) చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు, అంతేకాదు అందులో అతను కూడా నటించాడు.

ఇక ఈయనకు అవకాశాలు లేని రోజుల్లో జంధ్యాల ఒక అమెరికన్ వ్యక్తిని హీరోగా పెట్టాలి అన్న ఆశతో ఆయనను హీరోగా తీసుకున్నారు. అప్పటివరకు ఆయనకు ఎలాంటి అవకాశాలు లేవు. చివర అతనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. కార్ షెడ్ లో నిద్రపోయేవాడు. ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే… జేన్ 1989 లో రట్జర్ హౌర్ కుమార్తె నటి ఐషా హౌర్‌ను వివాహం చేసుకున్నాడు . 1995 లో విడాకులు తీసుకునే ముందు ఈ జంట కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఇక ఆ తర్వాత జేన్, ఆర్క్వెట్టి ని జూన్ 25, 2006 న వివాహం చేసుకున్నాడు. ఈమెతో కూడా 2011 లో విడిపోయాడు. ఈయనకు ఒక పాపా కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు హార్లో ఒలివియా.

ఇక ఈయన పడమటి సంధ్యారాగం సినిమాలో నటించినందుకు 25వేల పారితోషకాన్ని పొందాడు. అప్పట్లో అంత మొత్తం అంటే నిజంగా చాలా పెద్ద మొత్తమే. ఒక యాడ్ ఏజెన్సీలో జంధ్యాల ఆయన ఫోటోను చూసి ఆయనను సంప్రదించారు. ఆ తర్వాత ఆయన హీరోగా సెలెక్ట్ చేసి సినిమా తీశారు. ఇప్పటికీ జంధ్యాల గారిని ఆయన ఒక దేవుడిలా కొలుస్తారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మీరు భారతదేశంలో సినిమా ద్వారా పరిచయం అయ్యారు కదా మరి ఆ సినిమాను ఎన్నిసార్లు చూశారని అడగ్గా ఆ సినిమాను చూడటానికి ఎక్కువ సమయం దొరకలేదని ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఆ సినిమాని ఓ సారి చూసాను అని తెలిపాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!