Thamas Jane : హాలీవుడ్ నటీనటులు మన భారత దేశ చలన చిత్రాల్లో చాలా తక్కువగా నటిస్తారు. చాలా అంటే చాలా తక్కువగా తెలుగు వెండితెరపై హాలీవుడ్ నటీనటులు కనపడతారు. అయితే 33 ఏళ్ల క్రితమే హాలీవుడ్ కి చెందిన వ్యక్తిని తెలుగు వెండి తెరకు పరిచయం చేశాడు టాలీవుడ్ దర్శకుడు జంధ్యాల. అవును, 1987 సంవత్సరంలో నిర్మించిన పడమటి సంధ్యారాగం సినిమాలో విజయశాంతికి ప్రేమికుడిగా, ఆపై భర్త గా నటించి మెప్పించాడు ఆ హాలీవుడ్ నటుడు. ఇక ఆయన పేరేంటి, అతడు ఏ ఏ సినిమాలో నటించాడు అన్న విషయం చూస్తే…
ఆ హాలీవుడ్ వ్యక్తి పేరు థామస్ జేన్… ఈయన ఫిబ్రవరి 22, 1969 న జన్మించాడు. జేన్ జంధ్యాల దర్శకత్వం వహించిన పడమటి సంధ్యా రాగం (1987) తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత ది హస్ట్లర్ ఇన్ ఐల్ లవ్ యు ఫరెవర్, టునైట్ (1992), జెఫ్ ఇన్ బఫీ ది వాంపైర్ స్లేయర్ (1992), బిల్లీ ఇన్ నెమెసిస్ (1992), సిటీ ఆఫ్ ఏంజిల్స్ (1996), బూగీ నైట్స్ (1997), ది థిన్ రెడ్ లైన్ (1998), థర్స్ డే (1998), మాగ్నోలియా (1999) తో సహా పలు చిత్రాలలో ఆయన సహాయక పాత్రలు పోషించారు.
అయితే ఆ తర్వాత బేస్ బాల్ ఆటగాడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన తరువాత 61 సినిమాలో మిక్కీ మాంటిల్, దక్షిణాఫ్రికా చిత్రం స్టాండర్ (2003) లో ఆండ్రీ స్టాండర్ తో ప్రారంభమైన ప్రధాన పాత్రల ఆఫర్లను అందుకున్నాడు. వీటితో అతని నటన తో విమర్శకుల నుండి ప్రశంసలను పొందాడు. టెలివిజన్ పాత్రలలో చిత్రం 61 * (2001) లో మిక్కీ మాంటిల్, HBO లో వచ్చిన సిరీస్ హంగ్ (2009–2011) మరియు సిఫై అమెజాన్ వీడియో సిరీస్లలో నటించారు. అంతేకాదు అతను రా స్టూడియోస్ అనే వినోద సంస్థ స్థాపకుడు, అతను రాసిన కామిక్ పుస్తకాలను విడుదల చేయడానికి దానిని ఉపయోగిస్తాడు. వాటిలో మొదటిది బాడ్ ప్లానెట్. క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కంట్రీ (2009) చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు, అంతేకాదు అందులో అతను కూడా నటించాడు.
ఇక ఈయనకు అవకాశాలు లేని రోజుల్లో జంధ్యాల ఒక అమెరికన్ వ్యక్తిని హీరోగా పెట్టాలి అన్న ఆశతో ఆయనను హీరోగా తీసుకున్నారు. అప్పటివరకు ఆయనకు ఎలాంటి అవకాశాలు లేవు. చివర అతనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. కార్ షెడ్ లో నిద్రపోయేవాడు. ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే… జేన్ 1989 లో రట్జర్ హౌర్ కుమార్తె నటి ఐషా హౌర్ను వివాహం చేసుకున్నాడు . 1995 లో విడాకులు తీసుకునే ముందు ఈ జంట కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఇక ఆ తర్వాత జేన్, ఆర్క్వెట్టి ని జూన్ 25, 2006 న వివాహం చేసుకున్నాడు. ఈమెతో కూడా 2011 లో విడిపోయాడు. ఈయనకు ఒక పాపా కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు హార్లో ఒలివియా.
ఇక ఈయన పడమటి సంధ్యారాగం సినిమాలో నటించినందుకు 25వేల పారితోషకాన్ని పొందాడు. అప్పట్లో అంత మొత్తం అంటే నిజంగా చాలా పెద్ద మొత్తమే. ఒక యాడ్ ఏజెన్సీలో జంధ్యాల ఆయన ఫోటోను చూసి ఆయనను సంప్రదించారు. ఆ తర్వాత ఆయన హీరోగా సెలెక్ట్ చేసి సినిమా తీశారు. ఇప్పటికీ జంధ్యాల గారిని ఆయన ఒక దేవుడిలా కొలుస్తారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మీరు భారతదేశంలో సినిమా ద్వారా పరిచయం అయ్యారు కదా మరి ఆ సినిమాను ఎన్నిసార్లు చూశారని అడగ్గా ఆ సినిమాను చూడటానికి ఎక్కువ సమయం దొరకలేదని ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఆ సినిమాని ఓ సారి చూసాను అని తెలిపాడు.
Tadipatri: తాడిపత్రి కేరాఫ్ జేసీ బ్రదర్స్ అనే విధంగా ఇన్ని రోజులు ఉండేది. అక్కడ వారు చెప్పిన మాటే శాసనం అయితే గత ఐదు సంవత్సరాలుగా వీరి మాటకు విలువ లేకుండా పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ అరాచకాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే గత ఎన్నికలలో భాగంగా జేసీ వర్గీయులు అలాగే పెద్దారెడ్డి వర్గీయుల మద్యం పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ గొడవలలో భాగంగా ఇరువురి అనుచరులు రాళ్లదాడి బాంబుల దాడి చేసుకున్నారు అయితే ఈ గొడవలను సర్దుమనగడం కోసం పోలీసులు దివాకర్ రెడ్డి ఇంట్లో పని చేస్తున్నటువంటి పని వాళ్ళను కూడా అరెస్టు చేశారు అయితే దివాకర్ రెడ్డి భార్యతో పాటు తన అక్క కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచంపై ఉన్నారు కనీసం వారికి తిండి పెట్టి మందులు ఇచ్చేవారు కూడా లేకపోవడంతో జెసి పవన్ రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే పోలీసులతో ఆయన మాట్లాడి వారి ఇంట్లో పని చేసే వారిని విడిపించాలని కోరారు. అది కుదరదని పోలీసులు చెప్పారు మీరు కూడా బయటకు రాకూడదని ఒకవేళ తిరిగితే చర్యలు తీసుకోక తప్పదని పోలీసులు హెచ్చరించడంతో చేసేదేమీ లేక జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల మొత్తం తాడిపత్రి వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు.
Advertisement
144 సెక్షన్ అమలు…
ఇలా తాడిపత్రిలో చోటు చేసుకున్నటువంటి గొడవల కారణంగానే వీరు చివరికి తాడిపత్రి వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇకపోతే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు మాత్రం తాడిపత్రిలో పూర్తిగా రెచ్చిపోయి దాడులకు పాల్పడటంతో తాడిపత్రి పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు.
Modi: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తిగా త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఏపీలో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎన్నికల బరిలో దిగగా మరోవైపు తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పొత్తుగా ఏర్పడి ఎన్నికల బరిలోకి వచ్చాయి.
ఈ విధంగా పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అయితే ఇప్పటికే ఈ పథకం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలోనూ అలాగే కర్ణాటకలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం గురించి స్వయంగా నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం సరైనది కాదని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం హామీతో మెట్రోలను ఇబ్బందులలో పడేస్తున్నాయని ఈయన తెలిపారు. మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం కావడంతో మెట్రోపై ఆదాయం తగ్గుతుందని వెల్లడించారు.
Advertisement
మెట్రో ఆదాయంపై దెబ్బ.. ఇలా చేయటం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం సాధ్యమవుతుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత కూడా ఏర్పడుతుందని మోడీ వెల్లడించారు. ఈ విధంగా బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోని ఖాళీ చేస్తే ఎలా నడుస్తుందని ఈయన ప్రశ్నించారు. ఇక విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తులో భాగంగా ప్రకటించినటువంటి హామీలలో ఉచిత బస్సు ప్రయాణం ఉండటం గమనార్హం.
YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఆయన ఐపాక్ సభ్యులతో కలిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ మాట్లాడుతూ గత ఎన్నికలలో భాగంగా తమ పార్టీ 151 ఎమ్మెల్యే సీట్లు అలాగే 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది అయితే ఈసారి ఈ సంఖ్య పెరుగుతుందని తెలిపారు.
తప్పకుండా జూన్ 4వ తేదీ రాబోయే ఫలితాలలో భాగంగా ఇంతకంటే ఎక్కువ ఫలితాలను అందుకోబోతున్నామని, 151 సీట్ల కంటే అధికంగా ఎమ్మెల్యేలను గెలిపించుకోబోతున్నాము అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎన్నికలలో విజయంపై జగన్ కాన్ఫిడెన్స్ చూసి కూటమినేతలలో భయం మొదలైంది.
జగన్ ఎంతో ధీమాగా విజయం సాధిస్తామని గత ఫలితాలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను అందుకొని చరిత్ర సృష్టించబోతున్నామంటూ చెప్పడంతో కూటమి నేతలలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే పలు సర్వేలు వైసిపి అఖండ మెజారిటీతో గెలవబోతోందని వెల్లడించాయి అయితే ఇదంతా కూడా జగన్ సంక్షేమ పథకాల ప్రభావం అలాగే మరోవైపు అభివృద్ధిని చూసి కూడా ప్రజలందరూ మరోసారి జగన్ కే పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది.
Advertisement
భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. ఇకపోతే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా ఏపీలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే పెరిగిన పోలింగ్ శాతం కూటమికి అనుకూలంగా ఉందని కూటమి నేతలు భావిస్తున్నప్పటికీ పలు సర్వేలు మాత్రం వైసీపీకే అనుకూలంగా మారుతుందని చెప్పడంతో కూటమిలో గుబులు మొదలైంది.