Connect with us

Featured

Pawan Kalyan – Renu Desai : పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలవబోతున్నారా? చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

Published

on

Pawan Kalyan – Renu Desai : రేణు దేశాయ్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలవబోతున్నారా? అంటే అవుననమే సమాధానమే వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన రేణుని మెగా అభిమానులు ఇప్పటికీ వదినమ్మగానే చూస్తారు. ఆమె ఎన్నికల సమయంలో పవన్‌కు చాలా అండగా నిలిచారు. పవన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు, మెసేజ్‌లు పెట్టారు. అకీరా నందన్‌ను పవన్‌కు చేరువగానే ఉంచుతున్నారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. పవన్ గురించి ఏం మెసేజ్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. పవన్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్.. ఆ మధ్య మరో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ సమయంలో పవన్ అభిమానుల నుంచి విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందన్నారు. త్వరలోనే పెళ్లన్నారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ ఆ ఊసే లేదు. మరి ఇప్పుడు పవన్, రేణు దేశాయ్ కలవడం ఏంటి? ఎందుకు కలవబోతున్నారు? అంటారా? దీనికి ఓ కారణం ఉంది. అదేంటో చూద్దాం.

Advertisement

ఇప్పుడు ప్రత్యేకత ఏంటి?

ప్రస్తుతం అకీరా నందన్, ఆద్యలే తన లోకంగా రేణు దేశాయ్ జీవిస్తున్నారు. పవన్, రేణు కలవరా? అంటే ఎందుకు కలవరు? చక్కగా కలుస్తారు. పవన్ బెంగుళూరులోని రేణు ఇంటికి వెళతారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. ఇక ఆద్య మాటను పవన్ అసలు జవదాటరట. రేణు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అంటారా? రేణు ఇటీవలి కాలంలో ఆధ్యాత్మికత వైపు ఫోకస్ పెట్టారు. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్‌ కు చీఫ్ అడ్వైజర్‌‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో వేదాలు, భక్తికి సంబంధించిన ఒక ప్రైవేటు యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే పర్మిషన్లు కావాలి కదా.. యూనివర్సిటీ అంటే నాలుగు గోడలు లేపితే అయిపోదు కదా.. ఆ పర్మిషన్స్ కోసం ఇప్పటికే తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖతో భేటీ అయ్యారు. కొండా సురేఖ నుంచి సానుకూల సమాధానం వచ్చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలవాలని రేణు భావిస్తున్నారట. వీరిలో ముందుగా పవన్‌ను కలవాలనుకుంటున్నారట. భక్తికి సంబంధించిన ఒక ప్రైవేటు యూనివర్శిటీ విషయమై పవన్‌తో చర్చిస్తారట. పవన్‌కు కూడా భగవంతుడి పట్ల నమ్మకం ఎక్కువ కాబట్టి ఆయన కాదనరని అంతా అంటున్నారు. అయితే ముందుగా ఈ విషయంలో పవన్ సలహా, అభిప్రాయాన్ని సేకరిస్తారట. తప్పక పవన్ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. దాదాపు సీఎం చంద్రబాబు సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే అంటున్నారు. రెండు రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే త్వరలోనే రేణు దేశాయ్.. తెలుగు రాష్ట్రాల బార్డర్ లేదా అమరావతి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీని ప్రారంభిస్తారట. ఈ వ్యవహారాన్ని పక్కనబెడితే పవన్ – రేణు కలవబోతున్నారనే వార్తే అటు మెగా అభిమానుల్లోనూ.. ఇటు జనసేన కార్యకర్తల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Advertisement

Featured

Bigg Boss 8: లీక్ అయిన బిగ్ బాస్ 8 విన్నర్… ఎవరో తెలుసా?

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ 8 తెలుగు కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఇక 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే ఐదవ వారంలో మరికొంతమంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ కూడా ఎక్కువగా బుల్లితెర నటీనటులు ఉండటం విశేషం. ఇక బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన సమయం నుంచి విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటాయి.

బిగ్ బాస్ నిర్వహకులు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా ఎంత జాగ్రత్త పడినప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు మాత్రం బయటకు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా విన్నర్ ఎవరు అనే విషయం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది.

విన్నర్ విష్ణుప్రియ..
ఇక హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వారిలో విష్ణు ప్రియ ఒకరు. ఈమెకు సోషల్ మీడియాలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హౌస్ లో కూడా విష్ణుప్రియ చాలా జెన్యూన్ గా గేమ్ ఆడటమే కాకుండా అన్ని విషయాలను పాజిటివ్గా తీసుకుంటూ ఎంతో మంది అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. దీంతో విష్ణు ప్రియనే ఈ సీజన్ విన్నర్ కావచ్చనే అభిప్రాయాలు కూడా చాలామందిలో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు కూడా విష్ణు ప్రియ పేరును చెప్పడంతో ఈ సీజన్ విన్నర్ ఆమెనని స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Anushka: ఆ డైరెక్టర్ కు ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్… స్వీటీ యవ్వారం ఏదో తేడాగా ఉందే?

Published

on

Anushka: సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈమె అరుంధతి వంటి లేడి ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్కకు అవకాశాలు క్యూ కట్టాయి.

Advertisement

ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. అయితే పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించిన అనుష్క అధిక శరీర బరువు కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పలు భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనుష్కకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇటీవల సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అనుష్క మంచితనం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అనుష్క మంచితనం చూస్తే ఇలాంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉంటారా అనే ఆశ్చర్యం కలుగుతుందని ఆయన అనుష్క పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా అనుష్కకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు.

సెప్టెంబర్ నెలలో..
అనుష్క ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో తనకు ఐఫోన్ గిఫ్ట్ గా పంపిస్తుందని ఈయన తెలిపారు. నా మీద ఆమె చూపించే ఈ ప్రత్యేకమైన ప్రేమకు నేను కృతజ్ఞుడిని అంటూ ఈయన కామెంట్లు చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది కేవలం రెండు సినిమాలే కానీ ఈ రెండు సినిమాలకి వీరిద్దరి మధ్య ఇలాంటి బాండింగ్ ఏర్పడటంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమాకే 100 కోట్ల బడ్జెట్.. సాహసమే అని చెప్పాలి?

Published

on

Mokshagna: నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈయన ఫస్ట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ లుక్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలను వెల్లడించడమే కాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

ఈ సినిమా కోసం మోక్షజ్ఞ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా భాగం చేయబోతున్నారు.

20 కోట్ల రెమ్యూనరేషన్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ విధంగా ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాకముందే ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు కనుక ఈ సినిమాపై ఎంతో నమ్మకంతోనే భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!