Connect with us

Featured

Rashmi: రష్మీ బుల్లితెర సీరియల్స్ లో నటించినదా.. ఏ సీరియల్స్ అంటే?

Published

on

Rashmi: బుల్లితెర యాంకర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మీ ఒకరు. ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మీ వెండితెరపై కూడా సినిమాలలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

పలు సినిమాలలో నటించినటువంటి ఈమెకు పెద్దగా సినిమాలలో అవకాశాలు రాలేదు పైగా ఈమె నటించిన సినిమాలు కూడా సక్సెస్ కాకపోవడంతో వెండితెరకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై తన కెరియర్ కొనసాగిస్తున్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి రష్మీ బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించారు.

ఇలా ఈమె రెండు సీరియల్స్ లో మాటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో చేశారని తెలుస్తుంది ఈమె లవ్ అనే సీరియల్ తో పాటు యువ అనే సీరియల్ లో కూడా నటించారు. ఇలా బుల్లితెరపై ఈమె నటించిన ఈ సీరియల్స్ మంచి ఆదరణ రావడంతో తనుకు సినిమా అవకాశాలు వచ్చాయి అయితే సినిమాలలో సక్సెస్ కాకపోవడంతో తిరిగి బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

వెండితెర సక్సెస్ ఇవ్వలేదా..

ఇలా వెండితెరపై ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేని రష్మీ బుల్లితెరపై మంచి సక్సెస్ కావడంతో ఈమె బుల్లితెరకు మాత్రమే పరిమితం అయ్యారని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో మనకు సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Advertisement

Featured

AP: మహిళలకు గుడ్ న్యూస్…జులై నుంచి ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం!

Published

on

AP: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. ఇలా కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున వరాలు కురిపించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ పథకాన్ని ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే అదే అస్త్రాన్ని కూటమి కూడా ఉపయోగించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించడమే కూడా కూటమి గెలుపుకు కారణమని చెప్పాలి. ఇంకా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కల్పిస్తున్నారనే విషయంపై గందరగోళం ఏర్పడింది.

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఈ విషయంపై ఇదివరకే మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటకలో పరిస్థితులను అక్కడ తలెత్తుతున్న సమస్యలను గుర్తించి ఏపీలో అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.. అయితే ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

జూలై 1 నుంచి..
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత బస్సు సౌకర్యాన్ని జులై 1 నుంచి ఏపీలో అమలులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అధికారులతో చర్చించారని త్వరలోనే ఈ విషయం గురించి ప్రభుత్వం అధికారికంగా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Wedding Card: వామ్మో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా.. కార్డ్ స్పెషల్ ఏంటంటే?

Published

on

Wedding Card: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీత అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిపై వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే జూలై 12వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.

ఇక వీరి వివాహపు తేదీ దగ్గర పడుతున్న తరుణంలో పెళ్లి వేడుకలు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలలో భాగంగా వారి మొదటి వివాహ పత్రికను నీతా అంబానీ స్వయంగా శ్రీ కాశి విశ్వనాధుని సన్నిధి ఉంచి ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డులో సుమారు మూడు కిలోలు వెండితో చిన్న మందిరం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో విష్ణువు, లక్ష్మి వినాయకుడి బంగారు ప్రతిమలను తయారు చేసి పెట్టారని తెలుస్తోంది. ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రోచ్ఛారణ వినిపిస్తుంది.

Advertisement

మూడు కిలోల వెండి మందిరం..
ఇలా చాలా స్పెషల్ గా ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించారని చెప్పాలి. మరి ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ వెడ్డింగ్ కార్డ్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ సుమారు 6.5 లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే గతంలో కూడా ఈయన తన కుమార్తె ఈశా అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఇలా ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేయించారు ఇక ప్రస్తుతం అనంత్ రాధిక వెడ్డింగ్ కార్డ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vijay Devarakonda: మనమందరం వెళ్లిపోయిన కల్కి గుర్తుండిపోతుంది: విజయ్ దేవరకొండ

Published

on

Vijay Devarakonda: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు సుమారు 600 కోట్ల ఖర్చుతో నిర్మించారు.

ప్రభాస్ దీపికా పదుకొనే కమల్ హాసన్ అమితాబ్ వంటి ప్రధాన నటులు మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఇందులో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్రలో నటించినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన నటుడు విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా ఫలితం పై స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. నాగీ, ప్రభాస్ అన్నా, వైజయంతి ఫిల్మ్.. ఈ ప్రేమ విజయానికి మీరు అర్హులు.

Advertisement

చాలా కాలం గుర్తుంటుంది..

మీ అందరి పట్ల చాలా సంతోషంగా ఉంది ..గాడ్ బ్లెస్స్ యు. కమల్ అమితాబ్ దీపిక వంటివారు లేకపోతే కల్కి సినిమా లేదు. మనమందరం వెళ్లిపోయాక కూడా ఈ సినిమా చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది అంటూ విజయ్ దేవరకొండ కల్కి సినిమా గురించి స్పందిస్తూ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!