Connect with us

Featured

సౌందర్య ఎంట్రీ.. కార్తీకదీపంలో దద్దరిల్లిపోయే మలుపు.. ఏమిటంటే?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. గత ఎపిసోడ్ లో మోనిత తన చేసిన కుట్రలన్నీ కార్తీక

Published

on

Advertisement

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. గత ఎపిసోడ్ లో మోనిత తన చేసిన కుట్రలన్నీ కార్తీక్ కు చెప్పడంతో కార్తీక్ తనని చంపేస్తానని నన్ను గురి పెడతాడు. అయితే కార్తీక్ నిజంగానే మోనితను చంపాడా? అనే విషయాలను నేడు 1114 వ ఎపిసోడ్ లో చూడవచ్చు. మరి ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం… నేటి ఎపిసోడ్ లో మోనిత తలకు గన్ గురిపెట్టి నా ప్రేమ కోసం ఇన్ని దారుణాలు చేశావు కదా ఏ ప్రేమ కోసమే అయితే నువ్వు ఉన్మాదిలా మారావో ఆ ప్రేమ కోసమే చచ్చిపో.. నువ్వు ప్రేమించిన మనిషి చేతిలోనే చచ్చిపో… అంటూ కార్తీక్ అనగానే తుపాకీ పేలిన శబ్దం వినబడుతుంది. ఆ తరువాత మోనిత కార్తీక్.. అని అరుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని సస్పెన్స్ గా పెట్టేసారు.

దీప డాక్టర్ బాబు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.భారతి ఫ్రెండ్ చనిపోయిందని చెప్పిన వెళ్లిన డాక్టర్ బాబు ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉండగా కార్తీక్ వస్తాడు… ఎంతో డీలాగా ఉన్న కార్తీక్ ని చూసి దీప కంగారు పడి ఏమైంది అని ప్రశ్నిస్తుంది. నాకేమైంది నేను బాగున్నాను..వందేళ్ల తర్వాత కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ బాధపడతాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత నా మీద నాకే చాలా కోపంగా ఉంది. అలసిపోయాను దీప ఈ వయసుకే వందేళ్ల జీవితం అనుభవించినటు వందేళ్ల వేదనను ముప్పై సంవత్సరాలలోనే అనుభవించాను బాధపడతాడు.

కార్తీక్ అలా మాట్లాడటంతో దీప కంగారు పడుతుంది నాలాంటి వాడు బతకడం వేస్ట్.. నాలాంటి వాళ్ళు బతుక కూడదు చచ్చిపోవాలి జీవితంలో ఒంటరివాడిని అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు దీప నీక తోడుగా నేనున్నాను అని చెప్పడంతో ఎప్పుడు ..ఉన్నావు నా జీవితంలో నీతోడు అవసరమైనప్పుడు నువ్వు లేవు.. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వంటూ దీపను అంటాడు. నీ కడుపులో పెరుగుతున్న పిల్లలకు తండ్రి నేను కాదని చెప్పినప్పుడు లాగి చెంపపై ఒకటి కొట్టి.. డీఎన్ఏ టెస్ట్ కి తీసుకు వెళ్ళి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా. కానీ నువ్వు ఆ పని చేయలేదు గడప దాటి బయటకు వెళ్ళిపోయావు. అమ్మ ఒంటరిగా ఉన్న నా పక్కన కాకుండా నీ పక్కన ఉంటూ నీకు సహాయం చేసింది. ఇక నా బిడ్డను నేను దత్తత తీసుకొని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రౌడీనీ అయితే ఒక పరాయి పిల్లలాచూశాను. నాకు మంచి పిల్లలు ఉన్నారు వారి పదేళ్లు బాల్యాన్ని చిదిమి వేయడానికి కారణం నువ్వు, మా అమ్మ అంటూ బాధపడతాడు.

ఇంట్లో అందరూ ఇలా వెలి వేసినప్పుడు ఒంటరినయ్యాను ఈ క్రమంలోనే ఓదార్పు కోసం మోనితను దగ్గరకు వెళ్లాను. కానీ అక్కడే మోసపోయాను అంటూ బాధపడతాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి వేధిస్తున్న ప్రశ్న మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం నేను కాదు అని ఎన్నోసార్లు చెప్పాను. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజు దొరికింది. అసలు మోనిత ఎలా గర్భవతి అయిందో తెలుసా? ఆదిత్య నన్ను రెచ్చగొట్టి డీఎన్ఏ టెస్ట్ కి పంపించాడు. ల్యాబ్లో శాంపుల్ ఇచ్చినప్పుడు ఆ శాంపిల్స్ ద్వారా మోనిత గర్భవతి అయింది. కృత్రిమ గర్భధారణ అంటూ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. అసలు మోనిత కడుపు రావడానికి కూడా కారణం ఆదిత్య అంటూ బాధపడతాడు. ఇప్పుడు చెప్పు ఇంత మోసం చేసిన ఆ మోనితను చంపేయాకనిపిస్తుందా.. లేదా..

కట్ చేస్తే ఆనందరావు కార్తీక్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. తనని చూడటానికి వెళ్లాలని ఆదిత్యతో చెబితే ఆదిత్య అందుకు సరే అంటాడు. కార్తీక్ ,దీప ఏసిపి రోషిని కలవడానికి వెళుతుంటారు. అప్పుడే రోషిని ఎంటర్ అవుతుంది. రండి మేడమ్ మేమే మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నాము అని దీప అనడంతో… ఎందుకు సరెండర్ అవ్వడానికా.. కార్తీక్ మోనితను ఎక్కడో దాచి పెట్టావో చెప్పు తన శవం ఎక్కడ అంటూ ప్రశ్నిస్తారు. దీంతో దీపా కార్తీక్ ఇద్దరు షాకవుతారు. అసలే మాట్లాడుతున్నారు మేడం అని దీప అనగా కార్తీక్ మోనితను ఎక్కడ దాచి పెట్టావని ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలోనే ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత ఎపిసోడ్ లో కార్తీక్ ని తీసుకెళ్లి జైల్లో పెడతారు పిల్లలిద్దరూ తన తల్లితో అసలు నాన్నని ఎందుకు అరెస్టు చేశారు.. నాన్న ఎప్పుడు వస్తాడు అమ్మ అంటూ దీపని నిలదీస్తారు. కట్ చేస్తే జైల్లో కార్తీక్.. ఏసీపీ రోషిని ముందు సౌందర్య ఎంట్రీ ఈ రివాల్వర్ నాది తనను నేనే చంపాను నా పై ప్రేమతో నా కొడుకు సరెండర్ అయ్యారు. నన్ను అరెస్టు చేసి నా కొడుకును వదిలిపెట్టండి అంటూ అసలు ట్విస్ట్ ఇస్తుంది. అయితే మోనితను చంపింది ఎవరు? కార్తీక్ బయటకు వస్తాడా? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.

ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.

అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!