Thammareddy Bhardwaja : సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన తమ్మారెడ్డి భారద్వాజ సినిమాలకు దూరంగా ఈ మధ్య ఉంటూ కేవలం సినిమా వాళ్లకు సంబంధించిన ఇష్యూల్లో స్పందిస్తూ అడపాదడపా మీడియాలో కనిపిస్తున్నారు. ఇక తాజాగా యూట్యూబ్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా రంగంలోని ప్రస్తుత విషయాల గురించి ఆయన ఒపీనియన్ చెబుతూ ఉంటారు. అలానే ఇటీవల జయసుధ చేసిన కామెంట్స్ పై స్పందించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న జయసుధ ఇండస్ట్రీ లో హీరోల డామినేషన్, మా అసోసియేషన్ బిల్డింగ్ మీద ఇక అవార్డుల విషయంలోను చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.
Advertisement
కొనుక్కునే అవార్డులు నీకెందుకు…
జయసుధ యాభై ఏళ్ల తన సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డుల వంటి వాటికి మేము పనికిరామా అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఈ విషయం పై తమ్మారెడ్డి స్పందిస్తూ కొనుక్కునే అవార్డులు నీకెందుకు ప్రజలు నీకు యాభై ఏళ్లుగా నీరాజనాలు పలికారు కదా. విలువలేని ఆ అవార్డులు ఎందుకు అంటూ కామెంట్ చేసారు. గత ముప్పై ఏళ్లుగా ఈ అవార్డులను కొనుక్కుంటున్నారు ప్రతిభ ఆధారంగా ఏం రావడం లేదు, రాజకీయ లాభం కోసం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న భారతరత్న తో సహా ఏ అవార్డుకు విలువ లేకుండా చేసారు. అర్హత లేనివాళ్లకు ఆ అవార్డులు ఇస్తున్నారు. అలాంటి వాటి కోసం నువ్వు ఆరాట పడటం ఏంటి అంటూ జయసుధ ని ఉద్దేశించి మాట్లాడారు. ఇక మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి జయసుధ ఇన్నేళ్లలో కట్టలేదు ఇకపై కడతారో లేదో అంటూ కామెంట్స్ చేసిన దానిపై స్పందించారు. మా బిల్డింగ్ కట్టకపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేంటి ఆ డబ్బులని వాళ్ళు తింటే అడగాలి కానీ ఆ బిల్డింగ్ కోసం పెట్టిన డబ్బు అలానే ఉంది కదా, ఖర్చు చేయలేదు. ఇక ఆ భవనం కడితే ఎవరికి లాభం ప్రెసిడెంట్, మెంబెర్స్ ఏసీ గాధుల్లో కూర్చుంటారు.
అదే ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా అలానే పెడితే ఇంకేదైనా పనికి ఉపయోగించవచ్చు కదా అంటూ మాట్లాడారు. ఇక ఒక హీరో యాభై ఏళ్ల ఇండస్ట్రీ జర్నీ సెలెబ్రేషన్స్ అయితే బాగా జరుగుండేవి నాకు కనీసం ఎవరు అభినందనలు చెప్పలేదని జయసుధ అన్న మాటలకు తమ్మారెడ్డి స్పందిస్తూ ఇప్పుడు యాక్టీవ్ గా సినిమాల్లో ఉండుంటే వేడుక జరిగేదేమో కానీ ఈ మధ్య ఆవిడ సినిమాలను ఎక్కువగా చేయడం లేదు కదా. అయినా ఏదో టాప్ హీరో చిరు లాంటి వాళ్ళైతే ఇంటికి వెళ్లి అభినందనలు ఉంటాయి కానీ మిగిలిన సీనియర్ హీరోలు కానీ ఎవరికీ అలాంటివి జరగవు. ఒకరితో ఉపయోగం అంటేనే ఎవరైనా గుర్తుంచుకుంటారు, మాట్లాడుతారు లేదంటే పట్టించుకోరు అంటూ జయసుధ మాటలపై స్పందించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan Tej) చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మరో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.
Advertisement
ఎన్నో సందర్భాలలో దర్శక నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అభిమానులు ఈ సినిమా గురించి అప్డేట్స్ అడిగినప్పటికీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్(SS Thaman) రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా సినిమాకు సంబంధించిన వరుస ఈవెంట్స్ జరుగుతాయని అభిమానులు రెడీగా ఉండాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ సినిమాకు వరుసగా ఈవెంట్స్, సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఉంటాయి. రెడీ గా ఉండండి. వచ్చేవారమే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రాబోతుంది అంటూ ఈయన వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు(Dil Raju) క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని చెప్పిన తేదీ మాత్రం చెప్పలేదు. కానీ తమన్ మాత్రం 20వ తేదీ విడుదల కాబోతుందని చెప్పకనే చెప్పారు అయితే ఈ విడుదల తేదీ గురించి త్వరలోనే అధికారక ప్రకటన ఇవ్వనున్నారు.
సినీనటుడు సిద్దార్థ్ (siddarth) ఇటీవల మరోసారి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన నటి అదితి రావు హైదరి(Aditi Rao Hydari) తో మరోసారి ఏడడుగులు నడిచారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే సెప్టెంబర్ 16వ తేదీ వీరి వివాహం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే వీరి వివాహం జరిగింది.
Advertisement
ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలలో సిద్దార్థ్ ధరించిన వాచ్ (Watch) అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రౌన్ బెల్ట్, గెల్డెన్ వాచ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సిద్ధార్థ్ ధరించిన గోల్డ్ కేస్తో కూడిన ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ వాచ్ ధర రూ.27.62 లక్షలు అని సమాచారం. సింపుల్ గా కనిపిస్తున్న ఆ వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.
సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం కానీ సిద్దార్థ్ కట్టిన ఈ వాచ్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ధర మాత్రం భారీ స్థాయిలో ఉండడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరిద్దరికీ మొదట పరిచయం మహాసముద్రం సినిమా సమయంలో జరిగిందని అప్పుడే వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నట్టు అదితి పలు సందర్భాలలో తెలిపారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి నిజ జీవితంలో కూడా ఒకటయ్యారు. ఇక వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడంతో నేటిజన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Kumari Aunty: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి మనకు తెలిసినదే. తెలంగాణలో ఖమ్మం ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం వరదలలో మునిగిపోయింది. ఇలా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఎంతోమంది ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలను అందజేస్తూ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇప్పటికీ ఎంతోమంది విరాళాలు అందజేస్తూనే ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చెక్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టార్ కుమారి ఆంటీ సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని కలిశారు.
Advertisement
ఈ సందర్భంగా ఈమె వరద బాధితులకు తనవంతు సహాయంగా కొంత డబ్బును విరాళంగా అందించారు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో కుమారి ఆంటీ (Kumari Aunty) ఒకరు. ఈమె అతి తక్కువ ధరకే ఎన్నో రకాల ఆహార పదార్థాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబర్స్ అలాగే ఫుడ్ వ్లాగర్స్ వెళ్లి ఈమెను మరింత ఫేమస్ చేశారు. ఇలా రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని కుమారి ఆంటీ భారీగా సంపాదించడమే కాకుండా ఇదే క్రేజ్ తో పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించి సందడి చేశారు.
ఇలా వ్యాపారంలో మంచి సక్సెస్ అందుకున్న కుమారి ఆంటీ తన మంచి మనసును చాటుకున్నారు వరదల (Floods) కారణంగా అతలాకుతులమైనటువంటి తెలంగాణకు ఈమె తన వంతు సహాయంగా 50 వేల రూపాయల విరాళం అంద చేశారు. ఈ 50,000 రూపాయలు చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో ఈమె మంచి మనసు పై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశంసలు రావడమే కాకుండా ఎంతోమంది గొప్పవారు కూడా చేయని సహాయం కుమారి ఆంటీ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.