Varalakshmi : అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు వంటివి వింటూనే ఉంటాము. రోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. అత్తింటి ముందు ధర్నాలు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా రోజూ చూస్తున్నవే, వీటిలో ఎంతమందికి న్యాయం జరుగుతోందో కుడా తెలియదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటి పడుతున్నారు ఈ రోజుల్లో, ఇంకా ఇలా కట్నాలు కానుకల్తో పెళ్లిళ్లు చేస్తున్న అమ్మాయిల తల్లిదండ్రులను తప్పుబట్టాలో లేకపోతే కొడుకును బేరానికి పెట్టే తల్లిదండ్రులను తప్పుబాట్టాలో తెలియదు. ఇక పోతే ఇలాంటి ఒక ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి మహిళను అదనపు కట్నం కోసం వేదిస్తూ ఉన్నారని ధర్నాకు దిగింది.
సునీత కు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసింది…
అరవింద్ అనే వ్యక్తి వరలక్ష్మి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకుని తొమ్మిది నెలలుగా వేదిస్తున్నాడు. అదనపు కట్నం కోసం టార్చర్ చేస్తున్నాడు. ఇక అత్త, మామ ఆడ పడుచు కూడా వేదిస్తూ ఇంట్లోనే బందించారు అంటూ బాధిత మహిళ మాట్లాడారు. తన భర్త మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా పనిచేస్తున్నాడు. ఎమ్ టెక్ చదివిన వరలక్ష్మి ని తల్లిదండ్రులు ఇండస్ట్రీకి సంబంధిచిన వ్యక్తి నెలకు ఆరు లక్షలు జీతం అని అరవింద్ కి ఇచ్చి పెళ్లి చేసారు. పెళ్లి సమయంలో యాభై తులాల బంగారం, యాభై లక్షల కట్నం ఇచ్చారు. అదంతా అత్త దగ్గరే పెట్టుకుని తనను అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఇక సింగిర్ సునీత ఫోన్ నెంబర్ తీసుకుని అరవింద్ గురించి చెప్పి న్యాయం చేయని అడిగితే ఇలా ఫోన్ చేయొద్దు, నా దాకా వస్తే చూస్తా ఇలాంటి విషయాల కోసం నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ కట్ చేసింది అంటూ వరలక్ష్మి ఆరోపించింది.
Advertisement
ఇక సింగర్ సునీత ఆ రికార్డింగ్ ను అరవింద్ కి పంపినట్లు అరవింద్ అందరి దగ్గర చెప్పుకుంటున్నాడని వరలక్ష్మి ఆరోపించారు. ఇండస్ట్రీ లో పలుకుబడి ఉందని తెలిసిన రౌడీల ద్వారా తన తండ్రి, సోదరులను చంపిస్తానని బెదిరించాడని వరలక్ష్మి ఆరోపించింది. తాను పల్లెటూరు అమ్మాయిని కావడం వల్ల అందరిలో పరిచయం చేయలేనని, ఇంతవరకు తనకు పుస్తెల తాడు కూడా చేయించలేదని, పెళ్లయ్యాక ఇరవై రోజులు ఆనందంగా ఉన్నానని, ఆ తరువాత ఆడపడుచు తన భర్తతో ఉండనిచ్చేది కాదని ఇంకా కట్నం తెస్తేనే భర్త దగ్గరికి పంపుతామని తిట్టేవారు. ఇక ఒక రోజంతా బాత్ రూమ్ లోనే ఉంచి టార్చర్ చేసారని వరలక్ష్మి ఆరోపించారు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.