Connect with us

Featured

YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?

Published

on

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష. ఒకప్పుడు జగన్ తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో అయినా ఆయనకు కొందరు రాజకీయ ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎంతమంది నిలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 అసెంబ్లీ.. 4 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంతటి దారుణ పరాజయం వైసీపీ పెట్టిన తర్వాత ఇదే తొలిసారి. కాబట్టి ఇప్పుడు జగన్‌కు ఇది అత్యంత కష్టకాలం. ఆయన లైఫ్‌లో వరస్ట్ డేస్ తిరిగి రాబోతున్నాయనడంలో సందేహమే లేదు. జగన్ ఎందుకు ఓటమి పాలయ్యారనే విషయాలను పక్కనబెడితే ఆయనతో నిలిచేదెవరనేదే ఆసక్తికరం. వైసీపీ తరుఫున గెలిచిన వారంతా జగన్‌తో ఉంటారా? అనేది ప్రశ్నార్థకమే. వీరిలో ఎందరు ఉంటారో.. ఎందరు పక్క చూపు చూస్తారో తెలియదు. మొత్తంగా జగన్ జీరో అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

ఇదే అసలు సిసలైన పరీక్ష..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అధికారం కావాలి. అధికారాన్ని అనుభవించేందుకు అలవాటు పడిన వ్యక్తి అది లేకుండా ఒక్క క్షణం కూడా నిలవలేడు. ఇది లోక రీతి. ఈ లెక్కన చూస్తే జగన్ జీరో అయినా ఆశ్చర్యం లేదు. అలాగే కేసులు కూడా జగన్ మెడ చుట్టూ చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ కూడా లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన సైతం గెలిచిన నేతలకు ఉండొచ్చు. కాబట్టి వారంతా వైసీపీలోనే కొనసాగుతారని భావించడం తప్పే అవుతుంది. ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ.. ఎంపీలు కానీ తాడేపల్లి వైపు కూడా తిరిగి చూడలేదని టాక్. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్‌ పార్టీకి దక్కలేదు. జగన్‌కు ఇంతకు మించిన దారుణ పరిస్థితి ఉండదేమో. ఇదే అసలు సిసలైన పరీక్ష. దీనిని జగన్ ఎలా దాటుతారు? ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలుస్తారా? జీరోతో తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడతారా? లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా లండన్ వెళ్లి పోయి వ్యాపారాలు చూసుకుంటారా? ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంది.

Advertisement

సహకరించే వారేరి?

నిన్న మొన్నటి వరకూ జగన్‌కు అండగా ప్రధాని మోదీ ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబును కాదని మోదీ సైతం జగన్‌కు సాయం చేయలేరు. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎలాంటి సాయాన్ని వైసీపీ పొందలేదనడంలో సందేహమే లేదు. ఇప్పుడు జగన్ సమస్యల వలయంలో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. అంతెత్తు ఎగిసి నేలకు చేరిన కెరటం. తిరిగి అదే స్పీడుతో కాకున్నా ఆలస్యంగానైనా లేస్తారా? లేదంటే పత్తా లేకుండా పోతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పట్టుదల ఉండొచ్చు కానీ సహకరించే వారేరి? నడిసంద్రంలో ఉన్నారు. ఒడ్డుకు చేర్చే నావ కోసం ఎదురు చూస్తున్నారు. గెలిచిన నేతలే తాడేపల్లి వైపు చూడటం లేదంటే.. ఓడిన నేతలు చూస్తారన్న నమ్మకం కూడా లేదు. కొంతమంది అయితే జగన్‌తో ఉండొచ్చు. వారికి కూడా వేరే దిక్కు లేదు కాబట్టి. అసలు జగన్‌ను ముంచిందే వారు కదా.. వారితో కలిసి పార్టీని పైకి లేపడమంటే సాధ్యమయ్యే పనేనా? ఏమో.. ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vijay Devarakonda: నేను నాగీకి అదృష్టం కాదు.. తన కోసమే కల్కిలో నటించాను: విజయ్ దేవరకొండ

Published

on

Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ కీలకపాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా విజయ్ దేవరకొండ కల్కిలో భాగం కావడంతో ఈయన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (నాగీ) మొదట దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ నటించిన ఆ సినిమా సక్సెస్ అయింది అనంతరం మహానటి సినిమాలో కూడా విజయ్ నటించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తన సినిమాలకు లక్కీగా మారిపోయారని అందుకే తనని కల్కి సినిమాల్లో కూడా భాగం చేశారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇదే విషయం గురించి ఇటీవల రిపోర్టర్స్ విజయ్ దేవర కొండను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్న పై విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..నేను నాగికి లక్కీ కాదు. ప్రభాస్ అన్న కోసం, నాగి కోసం ఈ సినిమాలో నటించా. కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విజయం సాధించింది.

Advertisement

ఎలాంటి పోటీ లేదు..
ఇందులో మనం చేసింది ఏమీ లేదు అంటూ ఈయన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు చాలా హుందాతనంగా సమాధానం చెప్పారు.నాగి క్రియేట్ చేసిన ఒక యూనివర్స్ లో నేను చిన్న పాత్ర చేశాను. అంతే కానీ ప్రభాస్ కర్ణుడు.. నేను అర్జునుడు లాంటి పోటీలు ఏమీ లేవని ఈయన తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Y.S Vijayamma: జగన్ ఓటమికి విజయమ్మ కూడా కారణమే.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Published

on

Y.S Vijayamma: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పార్టీ పరిమితం కావడంతో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఇప్పటికి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.పార్టీ ఆలోచనా విధానం, ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తుంటాయని ఆయన అన్నారు. బాబు మాటలను ఎవరు నమ్మరని మేము భావించము జగన్ చాలా నిజాయితీగా అన్ని పథకాలను అమలు చేశారు.

చంద్రబాబు పింఛన్ ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకిి ప్లస్ అయిందని కేతిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ వారి నాన్న రాజశేఖర్ రెడ్డిలా భావించారని తెలిపారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో మేము ఓడిపోతామని ఎక్కడా కూడా మాకు సందేహాలు రాలేదని కేతిరెడ్డి తెలిపారు.

Advertisement

షర్మిలకు సపోర్ట్ చేయటం..
చంద్రబాబు అరెస్ట్ క్యాడర్ ను పోలరైజ్ చేసిందని ఆయన తెలిపారు. కమ్మ, కాపు కమ్యూనిటీలు పోలరైజ్ అయ్యాయని కేతిరెడ్డి వెల్లడించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగిందని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అంతేకాకుండా వైయస్ విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలకు సపోర్ట్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయిందని ఈ సందర్భంగా కేతిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈయన జగన్ ఓటమి పాలు కావడానికి తన తల్లి విజయమ్మ కూడా ఒక కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement
Continue Reading

Featured

YSRCP: కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ విలీనం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే శివకుమార్!

Published

on

YSRCP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈ ఎన్నికలలో ఈయన ఘోరమైన ఓటమిని చవి చూశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించిన జగన్ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చారు. అక్కడ రెండు రోజులపాటు అభిమానులను కార్యకర్తలను కలిసిన ఈయన తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు.

ఇలా బెంగళూరు నుంచి ఈయన రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తుంది. అక్కడ మీడియా వారి కంట కనపడకుండా ఎవరిని కలవకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కనిపించని నేపథ్యంలో ఈయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ తో భేటీ అయ్యారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్లో తిరిగి తాను అధికారంలోకి రావాలి అంటే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సరైన పద్ధతిని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి పార్టీని విలీనం చేయడంపై సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది అంతేకాకుండా డీకే శివకుమార్ ని కలిసినట్టు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అన్నీ అవాస్తవాలే..

ఇలా జగన్మోహన్ రెడ్డి తనని కలిసారని పార్టీ విలీనం గురించి మాట్లాడారంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా కూడా అవాస్తవమేనని తెలిపారు. నేను జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాలు లేవని ఆయనను ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదని సోషల్ మీడియాలో మా గురించి వస్తున్న వార్తలన్నీ ఆ వాస్తవం అంటూ అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!