Connect with us

Movie News

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వీళ్ళంతా టాప్ హీరోయిన్స్..ఎలా ఉన్నారో తెలుసా.. ??

Published

on

మనం తెలుగు వాళ్ళం. సినిమాలు చాలా బాగా చూస్తాము. సినిమా మీద ప్రశ్నలు అడిగితే టక్కున సమాధానం చెప్పేయగలం మనం. అయితే ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న. మనం చిన్నప్పుడు చూసిన “మనసంతా నువ్వే, జై చిరంజీవ, ఆర్య, అరుంధతి” ఈ సినిమాలు గుర్తున్నాయా! అయ్యో! అవెందుకు గుర్తులేవు…చిన్నపుడు తెగ చూశాం ఆ సినిమాలు అనుకుంటునారా? అయితే ఆ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లు గా నటించిన చిన్న పిల్లలు కూడా గుర్తు ఉండే ఉంటారు. కాలం మారుతూ ఉంటుంది. మన వయస్సు పెరిగింది అప్పటికీ ఇప్పటికీ…మరి మనతో పాటు ఆ సినిమాల్లో నటించించిన చిన్న పిల్లల వయసు కూడా పెరిగే ఉంటది కదా? వాళ్ళు ఇప్పుడు పెద్ద వాళ్ళు అయ్యే ఉంటారు కదా? మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటారు? అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంచేస్తున్నారో చూడండి!

Advertisement

సుహాని కలిత

సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది సుహాని . తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. సుహాని వాళ్ల స్వస్థలం ముంబై. సుహాని 1901, డిసెంబర్ 25న హైదరాబాద్ లో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే చదివింది. సుహానీ, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలనటి గా 40 చిత్రాల, హీరోయిన్ గా 11 చిత్రాలలో నటించంది.

శ్రియ శర్మ

Advertisement


‘జై చిరంజీవ’ సినిమాలో చిరంజీవి మేన కోడ‌లుగా న‌టించిన పాప గుర్తిందిగా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాష సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. శ్రియ శర్మ తన మూడేళ్ళ వయసులో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. శ్రియా శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ప్రస్తుతం శ్రియ శర్మ ముంబై విశ్వవిద్యాలయంలో చదువుతోంది. నిర్మ‌ల కాన్వెంట్‌లో చేసిన హీరోయిన్ శ్రియ శ‌ర్మ‌. ఆ సినిమాతో హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌స్తాయ‌నుకుంది. కానీ అది ఫ్లాప్ కావ‌డంతో ఎలాగైనా హీరోయిన్ అవ‌కాశాలు అందుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇందుకోసం గ్లామ‌ర్ డోస్ పెంచేందుకు కూడా సిద్ధం అయింద‌ని టాక్‌. చూద్దాం ఈ అమ్మ‌డి ఆఫ‌ర్‌ని ఏ డైరెక్ట‌రైనా ఉప‌యోగించుకుంటాడో చూడాలి మరి.

శ్రావ్య

బాలనటిగా తెలుగు సినిమారంగానికి పరిచయమైన శ్రావ్య 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. శ్రావ్య హైదరాబాద్ లో జన్మించింది. విజ్ఞానజ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో బిటెక్ పూర్తిచేసింది. చిన్నతనం నుండి నటనపై ఇష్టం ఉన్న శ్రావ్య బాలనటిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి సందడే సందడి, నేను సీతామహాలక్ష్మి, ఆర్య, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది. 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారి కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్‌హోం వంటి సినిమాలలో నటించింది. వెల్లికిజామై 13ఏఏం తేతి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశంచి పగిరి, విలైయట్టు ఆరంభం వంటి చిత్రాలలో నటించింది.

దివ్య నగేష్

అరుంధతి సినిమా రిలీజై ఇప్పటికే దశాబ్ధం పైగా అయ్యింది. ఆ సినిమా ఎప్పటికీ టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్. అందులో జేజమ్మగా స్వీటీ అనుష్క అసమాన నటన కనబరిచింది. స్వీటీతో పోటీపడుతూ .. అదే చిత్రంలో దివ్య అనే చిన్నారి అద్భుతంగా నటించి అందరిచేతా జేజేలు అందుకుంది. దివ్య బుల్లి .జేజమ్మగా అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఆ తర్వాత దివ్య తెలుగు తమిళ్ లో కథానాయికగా ఎటెంప్ట్ చేసింది. తెలుగులో నేను నాన్న అబద్ధం అనే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. కానీ ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తూ టచ్ లోకి వచ్చింది. కథానాయికగా ఇటీవలి కాలంలో గ్యాప్ రావడానికి కారణం ఎడ్యుకేషన్ లో బిజీ చేస్తుంది. ప్రస్తుతం గాయకుడు మనో కొడుకు షకీర్ కి జంటగా నటిస్తుంది. ఓ వైపు ఎంజీఆర్ యూనివర్శిటీ బీబీఎ సెంకండియర్ చదువుతూనే సినిమాల్లో నటన కొనసాగిస్తుంది దివ్య.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!