Connect with us

Featured

బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ.. కాని ప్రజల ఓట్లే నిర్ణయించాయనడం శుద్ధ అబద్ధం, ఇదిగో సాక్ష్యం

Published

on

‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ లాస్ట్ వర్డ్స్ చెప్పాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, రూ.50 లక్షల ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను. నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు. ఇక..

బిగ్‌బాస్ షో మొదలైన రోజు నుంచే బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. పార్టిసిపెంట్స్ అంతా ఒకచోట చేరి చేసే అల్లరి వేషాలు, సందడి, హ్యాపీ మూమెంట్స్, బాధాకర గుర్తులు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయేలా ఉన్నాయి. ఎన్టీఆర్ హోస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఎదురు చూపులకు తెర పడింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్స్ అంతా ఎలిమినేట్ అవుతూ చివరకు శివబాలాజీ, ఆదర్శ్ మిగిలారు. వాళ్లిద్దర్నీ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చి బిగ్‌బాస్ సీజన్1 ఫైనల్ విన్నర్ ని ప్రకటించారు. ఆయనే శివబాలాజీ. 3 కోట్ల 34 లక్షల 3 వేల 154 ఓట్లతో విన్నర్‌గా నిలిచారు. అయితే బిగ్ బాస్ మొదటి నుంచీ బల్ల గుద్ది మరీ చెబుతున్నట్లు ఈ విన్నర్ ని నిజంగా ప్రేక్షకుల ఓట్లే నిర్ణయించాయా? మరి అయితే మధ్యలో ఈ పిచ్చి పనులు ఎందుకు? నాలుగున్నర గంటల పాటు సాగిన గ్రాండ్ ఫినాలేలో ఓవరాల్ విన్నర్ ని ప్రకటించడానికి ముందు జరిగిన మిస్టేక్స్ ని ఓసారి చూద్దాం..

Advertisement

చాలా మంది బిగ్ బాస్ విన్నర్ హరితేజ అవుతుందని భావించారు. అయితే చాలా మంది ఊహలు తారుమారు అయ్యాయి. ఆమె మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదుగురు ఫైనలిస్టుల్లో మొదట అర్చన ఎలిమినేట్ అవ్వగా….. అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయ్యారు. నవదీప్ ఎలిమినేట్ అయ్యే క్రమంలో నలుగురు సభ్యులతో ఎన్టీఆర్ బాక్సుల గేమ్ ఆడించారు. గేమ్ ఉత్కంఠగా సాగిన అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఐదుగురు హౌస్ మేట్స్ నుండి…ఒకరిని విజేతగా ప్రకటించే క్రమంలో అందరి కంటే ముందుగా అర్చన ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకులు ఊహించినట్లే అందరికంటే ముందుగా అర్చన ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే మొదటి నుంచీ బిగ్ బాస్ చెబుతున్నదేమిటంటే ప్రేక్షకుల ఓట్లే అంతిమ విజేతను నిర్ణయిస్తాయన్నారు. మరి నలుగురి పోటీదారుల్లో నవదీప్ ను ఎలిమినేట్ చేయించడానికి బాక్సుల గేమ్ ఆడించడం ఏమిటి? అక్కడ తక్కువ ఓట్లు వచ్చిన (తక్కువ వచ్చాయని చెబుతున్నారు ఇందులో నిజం ఎంతో?) నవదీప్ నిష్ర్కమించాడు కాబట్టి సరిపోయింది. అదే నవదీప్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయనుకుందాం? అప్పుడు బిగ్ బాస్ పక్కా లాటరీ లాంటి ట్విస్టు పెట్టడం మిస్టేక్ కాదా? అలాగే చివరకు..

ఐదుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో అర్చన, నవదీప్‌లు నిష్క్రమించగా.. హౌస్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌లు మాత్రమే మిగిలారు. ఇక వీళ్లలో మూడో స్థానం సరిపెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌ను ఇప్పుడే వీడాలనుకుంటే 10 లక్షల తీసుకుని వెళ్లొచ్చని ఎన్టీఆర్ ఆఫర్ ఇవ్వగా కన్టెస్టెంట్స్ ముగ్గురూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాని అక్కడ శివబాలాజీ ఆ పది లక్షలను తీసుకుని వెళ్లిపోయాడే అనుకుందాం.. మరి అది ప్రేక్షకుల ఓట్లను తక్కువచేసినట్లే కదా..

సుమారు 12 లక్షల మంది వేసిన ఓట్లను ఇలా బిగ్ బాస్ అనేక ట్విస్టులతో అగౌరవపర్చడంపై ఓటు చేసిన వారిలో చాలా మంది బాధ కలిగించింది. ఏది ఏమయినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 షో 71 రోజుల ఎపిసోడ్ కు శుభం కార్డు వేసింది స్టార్ మా యాజమాన్యం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Sundeep Kishan: 14 ఏళ్ల కెరియర్ లో నేను తెలుసుకున్నది ఇదే..నాకు దక్కిన గౌరవం: సందీప్ కిషన్

Published

on

Sundeep Kishan: సందీప్ కిషన్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ సరైన స్థాయిలో మాత్రం ఒక్క హిట్ కూడా పడలేదని చెప్పాలి. ఇలా సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్న ఈయనకు మాత్రం సక్సెస్ కలిసి రాలేదని చెప్పాలి.

ఇటీవల కెప్టెన్ మిల్లర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్ అనే సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ రాయన్ సినిమాలో తాను నటించిన పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని తెలిపారు. నిజానికి ఈ కథ ధనుష్ రాసుకున్నారు. ఒకరోజు ఆయన ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెబుతూ అది నా కోసం రాసుకున్న పాత్ర నువ్వు చేయాలి అని చెప్పారు.. ఆయన అలా చెప్పగానే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేశాను.

Advertisement

ధనుష్ గారు తన కోసం రాసుకున్న పాత్ర నాకిచ్చారు అంటే అది నాకు దక్కిన గౌరవమే కదా. ఇక తాను సక్సెస్ అందుకోలేదని చాలామంది భావిస్తున్నారు. కానీ నాకు మాత్రం వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే నేను నటించిన సినిమాలకు సక్సెస్ టాక్ రాకపోయినా కలెక్షన్లు బాగా వస్తున్నాయని అర్థం.నా పని నేను సరిగ్గా చేస్తే ప్రేక్షకులకు చేరువవుతాను అని నమ్ముతాను. గత 14 ఏళ్లుగా అదే చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Sri Anjaneyam: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీ ఆంజనేయం… ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ ఛార్మి కదా?

Published

on

Sri Anjaneyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా దూసుకుపోతున్నటువంటి వారిలో నటుడు నితిన్ ఒకరు. ఈయన జయం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే ఇటీవల కాలంలో నితిన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి నితిన్ కెరియర్లో నటించినటువంటి చిత్రాలలో శ్రీ ఆంజనేయం సినిమా ఒకటి. కృష్ణ వంశీ డైరెక్షన్లో నితిన్ ఛార్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా నేటికీ 20 సంవత్సరాలు పూర్తి అయింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా చార్మి నటించిన కానీ ఫస్ట్ ఛాయిస్ ఛార్మి కాదని ఆర్తి అగర్వాల్ చెల్లెలు నటి ఆదితి అగర్వాల్ అని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ గా రాఘవేంద్రరావు డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

అదితి అగర్వాల్…
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కెరియర్ ముగిసిపోయింది. ఇక శ్రీ ఆంజనేయం సినిమాలో ఫస్ట్ ఛాయిస్ అదితి అగర్వాల్ అయినప్పటికీ ఇందులో ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సీన్లలో నటించే విషయంలో కృష్ణవంశీ అదితి అగర్వాల్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఈమె తప్పుకున్నారట. ఇక ఈమె తప్పుకోవడంతో ఈ సినిమాకు చార్మి కమిట్ అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. అయితే చార్మి గ్లామర్ కు మంచి మార్కులే పడటంతో ఆమెకు తదుపరి అవకాశాలు కూడా వచ్చాయని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Indra Movie: రీ రిలీజ్ కి సిద్ధమైన ఇంద్ర.. ఆ రికార్డు సొంతం చేసుకున్న మొదటి తెలుగు సినిమా ఇదే?

Published

on

Indra Movie: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఈయన హీరోగా ప్రేమ కథ చిత్రాలు కుటుంబ కథ చిత్రాలు అలాగే రాజకీయ నేపథ్యమున్న సినిమాలు కూడా చేశారు. ఇక యాక్షన్ సినిమాలలో కూడా చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలను తమ ఖాతాలో వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్లో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి. ఇలా ఈ బ్యానర్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాలలో ఇంద్ర సినిమా ఒకటి. అప్పటివరకు యాక్షన్ సినిమాలు చిరంజీవికి సూట్ అవ్వవు అని అందరూ భావించారు కానీ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన మొదటి యాక్షన్ సినిమా ఇంద్ర. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో అదే రోజు ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

మూడు నంది అవార్డులు..
ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ సిమ్రాన్ అనుకున్నారట కానీ ఆమె స్థానంలో ఆర్తి అగర్వాల్ నటించారు. అప్పట్లోనే ఈ సినిమా కోసం చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండా ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. 120 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని ఏకంగా 268 స్క్రీన్ లలో విడుదల చేశారు. ఏడుకోట్లతో పూర్తి అయిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమాకు మూడు విభాగాలలో నంది అవార్డులను కూడా అందుకోవటం విశేషం.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!