Connect with us

Featured

బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ.. కాని ప్రజల ఓట్లే నిర్ణయించాయనడం శుద్ధ అబద్ధం, ఇదిగో సాక్ష్యం

Published

on

‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ లాస్ట్ వర్డ్స్ చెప్పాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, రూ.50 లక్షల ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను. నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు. ఇక..

Advertisement

బిగ్‌బాస్ షో మొదలైన రోజు నుంచే బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. పార్టిసిపెంట్స్ అంతా ఒకచోట చేరి చేసే అల్లరి వేషాలు, సందడి, హ్యాపీ మూమెంట్స్, బాధాకర గుర్తులు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయేలా ఉన్నాయి. ఎన్టీఆర్ హోస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఎదురు చూపులకు తెర పడింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్స్ అంతా ఎలిమినేట్ అవుతూ చివరకు శివబాలాజీ, ఆదర్శ్ మిగిలారు. వాళ్లిద్దర్నీ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చి బిగ్‌బాస్ సీజన్1 ఫైనల్ విన్నర్ ని ప్రకటించారు. ఆయనే శివబాలాజీ. 3 కోట్ల 34 లక్షల 3 వేల 154 ఓట్లతో విన్నర్‌గా నిలిచారు. అయితే బిగ్ బాస్ మొదటి నుంచీ బల్ల గుద్ది మరీ చెబుతున్నట్లు ఈ విన్నర్ ని నిజంగా ప్రేక్షకుల ఓట్లే నిర్ణయించాయా? మరి అయితే మధ్యలో ఈ పిచ్చి పనులు ఎందుకు? నాలుగున్నర గంటల పాటు సాగిన గ్రాండ్ ఫినాలేలో ఓవరాల్ విన్నర్ ని ప్రకటించడానికి ముందు జరిగిన మిస్టేక్స్ ని ఓసారి చూద్దాం..

చాలా మంది బిగ్ బాస్ విన్నర్ హరితేజ అవుతుందని భావించారు. అయితే చాలా మంది ఊహలు తారుమారు అయ్యాయి. ఆమె మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదుగురు ఫైనలిస్టుల్లో మొదట అర్చన ఎలిమినేట్ అవ్వగా….. అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయ్యారు. నవదీప్ ఎలిమినేట్ అయ్యే క్రమంలో నలుగురు సభ్యులతో ఎన్టీఆర్ బాక్సుల గేమ్ ఆడించారు. గేమ్ ఉత్కంఠగా సాగిన అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఐదుగురు హౌస్ మేట్స్ నుండి…ఒకరిని విజేతగా ప్రకటించే క్రమంలో అందరి కంటే ముందుగా అర్చన ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకులు ఊహించినట్లే అందరికంటే ముందుగా అర్చన ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే మొదటి నుంచీ బిగ్ బాస్ చెబుతున్నదేమిటంటే ప్రేక్షకుల ఓట్లే అంతిమ విజేతను నిర్ణయిస్తాయన్నారు. మరి నలుగురి పోటీదారుల్లో నవదీప్ ను ఎలిమినేట్ చేయించడానికి బాక్సుల గేమ్ ఆడించడం ఏమిటి? అక్కడ తక్కువ ఓట్లు వచ్చిన (తక్కువ వచ్చాయని చెబుతున్నారు ఇందులో నిజం ఎంతో?) నవదీప్ నిష్ర్కమించాడు కాబట్టి సరిపోయింది. అదే నవదీప్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయనుకుందాం? అప్పుడు బిగ్ బాస్ పక్కా లాటరీ లాంటి ట్విస్టు పెట్టడం మిస్టేక్ కాదా? అలాగే చివరకు..

Advertisement

ఐదుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో అర్చన, నవదీప్‌లు నిష్క్రమించగా.. హౌస్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌లు మాత్రమే మిగిలారు. ఇక వీళ్లలో మూడో స్థానం సరిపెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌ను ఇప్పుడే వీడాలనుకుంటే 10 లక్షల తీసుకుని వెళ్లొచ్చని ఎన్టీఆర్ ఆఫర్ ఇవ్వగా కన్టెస్టెంట్స్ ముగ్గురూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాని అక్కడ శివబాలాజీ ఆ పది లక్షలను తీసుకుని వెళ్లిపోయాడే అనుకుందాం.. మరి అది ప్రేక్షకుల ఓట్లను తక్కువచేసినట్లే కదా..

సుమారు 12 లక్షల మంది వేసిన ఓట్లను ఇలా బిగ్ బాస్ అనేక ట్విస్టులతో అగౌరవపర్చడంపై ఓటు చేసిన వారిలో చాలా మంది బాధ కలిగించింది. ఏది ఏమయినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 షో 71 రోజుల ఎపిసోడ్ కు శుభం కార్డు వేసింది స్టార్ మా యాజమాన్యం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!