Connect with us

Movie News

మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు.. పవన్ కల్యాణ్ కూతురు ఏడుపు.. అంబులెన్స్ సిద్ధంగా..

Published

on

ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులు. రేణు బహుముఖ ప్రజాశాలి. సినీరంగంలో హీరోయిన్‌గానే కాకుండా ఎడిటింగ్, డైరెక్షన్, రైటింగ్ విభాగంలో మంచి పట్టు ఉంది.తాజాగా రేణు దేశాయ్ మరో పాత్రలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొఫెషనల్, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. రేణుదేశాయ్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

Advertisement

నీతోనే డ్యాన్స్‌ షోలో మా టెలివిజన్ నిర్వాహకులు ఒకరోజు ఫోన్ చేసి నీతోనే అనే డ్యాన్స్ షో ప్లాన్ చేస్తున్నాం. మీరు న్యాయనిర్ణేతగా వ్యవహరించాలి. ఆ కార్యక్రమం హిందీలో ప్రసారమయ్యే నాచ్‌బలియే అనే ప్రొగ్రాంగా ఉంటుంది అని చెప్పారు. అయితే నేను కొంత తటపటాయించాను. ఎందుకంటే టెలివిజన్ మాధ్యమం నాకు చాలా కొత్త. ఆ తర్వాత వాళ్ల ఒత్తిడి మేరకు అంగీకరించాను.

నీతోనే షో ప్రొగ్రాం తొలి రోజు షూట్‌‌లో అడుగుపెట్టగానే చాలా భయం కలిగింది. ఎందుకైనా మంచిది నాకు హార్ట్ ఎటాక్ వస్తే తీసుకెళ్లడానికి అంబులెన్స్ రెడీగా పెట్టుకోండి అని అన్నాను. అందుకు వారు నవ్వి మీకు ఏమీ కాదు అని భరోసా ఇవ్వడంతో.. మొదటి రోజు సెట్‌లో అడుగుపెట్టగానే చాలా భయమేసింది. అంబులెన్స్‌ సిద్ధం చేసుకోండి… నాకు హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమో అని అన్నా. చుట్టూ ఉన్న వాళ్లందరూ నవ్వారు. ‘ఏం కాదు మేడమ్‌! మీరు ఈజీగా చేసేయొచ్చు’ అని అన్నారు. కానీ నేను అంత తేలిగ్గా తీసుకోలేకపోయా. హార్ట్‌బీట్‌ నార్మల్‌ కావడానికి కొంత సమయం పట్టింది.

Advertisement

సింగిల్ పేరెంట్ (భర్త నుంచి విడిపోయి) జీవితం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన పూర్తి బాధ్యత చూడాల్సి ఉంటుంది. సమాజంలో పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూస్తే చాలా భయంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు నా పిల్లలను స్కూల్లో వదిలిపెట్టడం లాంటివి చేస్తుంటాను.

కొద్ది రోజుల క్రితం నా ఆరోగ్యం విషమించింది. అప్పుడప్పుడూ నాకు జ్వరం వచ్చేది. పని ఒత్తిడి వల్ల వచ్చే జ్వరం అనుకొని తేలికగా తీసుకొన్నాను. కానీ ఆరోగ్య పరిస్థితి చేజారింది. హాస్పిటల్ వెళ్తే ఆర్తోఇమ్యూన్ కండిషన్ అని డాక్టర్లు చెప్పారు. గుండెలో సమస్య ఉందని చెప్పారు. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.అనారోగ్యంతో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. ఇంట్లో ఉంటే బెడ్ మీద లేదంటే హాస్పిటల్‌లో ఉండే దానిని. నా పరిస్థితి చూసి పిల్లలు చాలా భయపడ్డారు. ఆందోళన చెందారు. కానీ దేవుడు నా పిల్లల పరిస్థితి అర్థం చేసుకొని మామూలు మనిషిని చేశాడు.

Advertisement

ఒకరోజు నా కూతురు ఆద్యా స్కూల్ నుంచి వచ్చి బెడ్‌పై ఉన్న నన్ను లేపడానికి ప్రయత్నించింది. ట్యాబెట్లు వేసుకోవడంతో గాఢ నిద్రలో మునిగిపోయాను. నేను ఎంతకు లేవకపోవడంతో ఆద్య భయపడిపోయింది. నా పక్కన కూర్చొని ఏడుస్తూ కనిపించింది. వెంటనే నీ ఒడిలోకి చేరి ‘ప్లిజ్ మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు అని ఒకటే ఏడుపు. అలా నా కూతురు ఏడుస్తుంటే గుండె పగిలినంత పనైంది.ఆద్య పరిస్థితి చూసి నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. కానీ నేను ఏడిస్తే పాప భయపడుతుంది అని.. కంట్రోల్ చేసుకొన్నాను. పిల్లలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాను. నేను చచ్చిపోను. నీతోనే ఉంటాను అని వారికి చెప్పడంతో వారికి ధైర్యం కలిగింది. ఆ తర్వాత ‘మమ్మీని అంత త్వరగా తీసుకెళ్ళొద్దు! మమ్మీ చచ్చిపోకుండా చూసుకో అని భగవంతుడికి దణ్ణం పెట్టుకో..’ అని చెప్పాను.

అలాంటి పరిస్థితుల్లో అంతకు మించి నాకు మరేది తోచలేదు. ఆ తర్వాత ఆద్య దేవుడి ముందు ఎంతసేపు కూర్చుందో నాకు తెలియలేదు. నేనే కాస్త ఓపిక తెచ్చుకుని లేచి వెళ్లి.. ‘అసలు నేను చచ్చిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చచ్చిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?’ అని చెప్పి ఆద్యలో సంతోషాన్ని నింపాను.నా కుమారుడు అకీరా కొంత మానసికంగా పరిణితి చెందాడు. పరిస్థితులను అర్థం చేసుకొంటాడు. అనారోగ్యం సమయంలో స్కూల్‌కి వెళ్లే ముందు నాతో కాసేపు కూర్చుని మాట్లాడేవాడు. స్కూల్‌ నుంచి వచ్చాక మాత్రలు వేసుకున్నావా అని అడిగేవాడు. హాస్పిటల్‌కి వెళ్లాల్సిన తేదీలను గుర్తుచేసేవాడు. చెల్లెలిని జాగ్రత్తగా చూసుకునేవాడు అని రేణు దేశాయ్ వెల్లడించింది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!