Connect with us

Featured

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసిన పెద్ద పొరపాటు అదేనా..!?

Published

on

సౌత్‌లో ఇప్పుడు కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఈమె తెలుగు, తమిళ, మలయాళ భాషలలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈమె కి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండటంవల్ల సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఏమాత్రం కష్టపడల్సిన అవసరం రాలేదు. బాల నటిగానే పాపులారిటీ తెచ్చుకుంది కీర్తి సురేష్. కీర్తీ సురేష్ అమ్మ గారు మలయాళ నటి మేనక. ఈవిడి చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేశారు. కీర్తి నాన్నగారు మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్. ఇక కీర్తీ అక్క రేవతీ సురేష్..కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్.

Advertisement

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ లో వి.ఎఫ్.ఎక్స్ విభాగంలో పలు హిందీ సినిమాలకి పనిచేశారు. కీర్తి నాలుగో తరగతి వరకు చెన్నైలో చదువుకున్నారు. ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో కంటిన్యూ చేసింది. మళ్ళీ చెన్నైలో పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, లండన్ లో రెండు నెలల ఇంటర్న్షిప్ లో జాయిన్ అయింది. అంటే కీర్తి ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే, ఇప్పుడు కీర్తి డిజైనింగ్ లో ఉండేదాన్ని అని..గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

2000 – 2002 వరకు బాల నటిగా సినిమాలు చేసింది. అవన్నీ కూడా మలయాళంలో విడుదలయ్యాయి. 2013లో హీరోయిన్‌గా మారింది. హీరోయిన్ ఎంట్రీ కూడా మలయాళంలోనే జరిగింది. గీతాంజలి అనే సినిమాతో కీర్తి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఇదు ఎన్న మాయం అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో అడ్డాల చంటి నిర్మాతగా రెండుజెళ్ళ సీత అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో 2016లో వచ్చిన నేను శైలజ ఆమె తెలుగు డెబ్యూ సినిమా అయింది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకున్న కీర్తి సురేష్.. నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి సినిమాలు చేసింది. వీటిలో అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అయితే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి కీర్తి సురేష్ కి ఎంతో కీర్తి ప్రతిష్టలు దక్కేలా క్రేజ్ తీసుకు వచ్చింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఈమె పేరు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కీర్తిని ప్రశంసించారు. ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ సౌత్‌లో అసాధారణంగా పెరిగిపోయింది. దాంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

ఈ క్రేజ్‌ని కీర్తి బాగానే ఉపయోగించుకుంది. కానీ కొన్ని అనవసరమైన సినిమాలను కమిటయి పొరపాటు చేసింది. మహానటితో వచ్చిన క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటవడం కీర్తి చేసిన మిస్టేక్ అని ఆ సినిమా రిజల్ట్ తర్వాత అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయాపడ్డరు. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు గత ఏడాది ఓటీటీలో రిలీజై తీవ్రంగా నిరాశపరచాయి. ఈ రెండు సినిమాలతో ఆమె క్రేజ్ చాలా వరకు తగ్గిందనే కామెంట్స్ వినిపించాయి. మిస్ ఇండియా సినిమా అయితే అసలు ఎందుకు ఒప్పుకుందో కూడా చాలా మందికి అర్థం కాలేదట. ఆ తర్వాత రంగ్ దే కూడా ఆశించిన విధంగా కీర్తికి పాపులారిటీ తీసుకు రాలేకపోయింది. ఈ క్రమంలో గుడ్ లక్ సఖీ సినిమా డిలే అయింది. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో గానీ ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయకూడదని కీర్తి డిసైడయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె సర్కారు వారి పాట, అన్నాత్తే చేస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!