Connect with us

Movie News

స్వాతిముత్యం హాట్ అందాల బామ అవకాశాలు లేక ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి

Published

on

క్రైస్తవ ప్రచారకర్తగా మారిన అలనాటి అందాల తార దీప…

ఒకప్పటి సౌత్ స్ర్కీన్ మీద ఆమె అందాల రాశి. మతిపోగొట్టే అందం ఆమె సొంతం. చక్రాల్లాంటి కళ్ళతో ఆకర్షణీయమైన ముఖంతో అప్పటి ప్రేక్షకుల హార్ట్ బీట్ వేగాన్ని పెంచేది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా శృంగార భరితమైన పాత్రలు పోషించేది.

Advertisement

తెలుగు లో పంతులమ్మ, అమెరికా అమ్మాయి, దశతిరిగింది, కొత్తనీరు,అక్బర్ సలీం అనార్కలి, లేడీస్ టైలర్, డబ్బెవరికి చేదు, స్వాతి ముత్యం, లాంటి చిత్రాలతో బాగా పాప్యులారిటీ తెచ్చుకుంది. స్వతహాగా ఆమె మలయాళీ. మలయాళ తెరమీద ఆమె ఉన్నీ మేరి గా కొన్ని దశాబ్దాల కాలం పాటు అలరించింది. అప్పటి మాలీవుడ్ సూపర్ స్టార్స్ అందిరితోనూ తెరమీద తన అందంతో , అభినయంతో ఆకట్టుకొనేది.

1962 లో కేరళలోని ఎర్నాకుళం లో అగస్టిన్ ఫెర్నాండెజ్ , విక్టోరియా దంపతులకు జన్మించింది. అక్కడే సెయింట్ థెరిసా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. మూడేళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె తల్లి ప్రొఫెషనల్ బ్యాలే ట్రూప్ ను రన్ చేస్తూ ఉండేది.

1969 లో నవవధు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ఉన్ని మేరీ అంటే ఒక హాట్ బ్రాండ్. అప్పటి ఆమె సినిమాలు మాలీవుడ్ యూత్ ను బాగా ఎట్రాక్టివ్ చేసేవి. మలయాళ, తమిళ్, తెలుగు , కన్నడ భాషల్లో లెక్కకుమించిన చిత్రాల్లో నటించింది. 1982లో రిజాయ్ అనే కాలేజ్ ప్రొఫెసర్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు నిర్మల్ అనే ఒక కొడుకు. రిహాన్ అనే మనవడు.

Advertisement

1992 లో వచ్చిన ఎన్నోడిష్టం కూడామో అనే సినిమా ఆమె చివరిది. నైంటీస్ లోకి అడుగుపెట్టేసరికే దీప బాగా లావు అయిపోయింది. భారీ శరీరంతో ఆమె సినిమాల్లో చాలా ఇబ్బందిగా నటించేది. ఆ శరీరంతోనే ఆమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సినీ రంగానికి గుడ్ బై చెప్పేసింది. స్వతహాగా ఆమె క్రిష్టియన్ కావడంతో, సినిమా రంగాన్ని వదిలేసిన నాటినుంచి స్పిరిట్యువల్ వే లో ట్రావెల్ చేస్తోంది.

చాలక్కుడి లోని పొట్ట అనే గ్రామంలో స్పిరిట్యువల్ క్యాంప్ నిర్వహిస్తూ, ఎవాంగ్లిష్ట్ గా మారిపోయింది. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

ఇప్పుడు దీప.. అప్పటి భారీ శరీరాన్ని కొంత వదిలించుకొని కాస్త నాజూగ్గా తయారైంది. తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా అని అడిగితే, నేను సినిమాలు చూసి చాలా కాలమైపోయింది. ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని రావాలంటే కొంచెం కష్టమే..

Advertisement

దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నాజీవితాన్నిఇలాగే ఆనందంగా గడిపేస్తానని అంటోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Sundeep Kishan: 14 ఏళ్ల కెరియర్ లో నేను తెలుసుకున్నది ఇదే..నాకు దక్కిన గౌరవం: సందీప్ కిషన్

Published

on

Sundeep Kishan: సందీప్ కిషన్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ సరైన స్థాయిలో మాత్రం ఒక్క హిట్ కూడా పడలేదని చెప్పాలి. ఇలా సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్న ఈయనకు మాత్రం సక్సెస్ కలిసి రాలేదని చెప్పాలి.

ఇటీవల కెప్టెన్ మిల్లర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్ అనే సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ రాయన్ సినిమాలో తాను నటించిన పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని తెలిపారు. నిజానికి ఈ కథ ధనుష్ రాసుకున్నారు. ఒకరోజు ఆయన ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెబుతూ అది నా కోసం రాసుకున్న పాత్ర నువ్వు చేయాలి అని చెప్పారు.. ఆయన అలా చెప్పగానే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేశాను.

Advertisement

ధనుష్ గారు తన కోసం రాసుకున్న పాత్ర నాకిచ్చారు అంటే అది నాకు దక్కిన గౌరవమే కదా. ఇక తాను సక్సెస్ అందుకోలేదని చాలామంది భావిస్తున్నారు. కానీ నాకు మాత్రం వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే నేను నటించిన సినిమాలకు సక్సెస్ టాక్ రాకపోయినా కలెక్షన్లు బాగా వస్తున్నాయని అర్థం.నా పని నేను సరిగ్గా చేస్తే ప్రేక్షకులకు చేరువవుతాను అని నమ్ముతాను. గత 14 ఏళ్లుగా అదే చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Sri Anjaneyam: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీ ఆంజనేయం… ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ ఛార్మి కదా?

Published

on

Sri Anjaneyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా దూసుకుపోతున్నటువంటి వారిలో నటుడు నితిన్ ఒకరు. ఈయన జయం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే ఇటీవల కాలంలో నితిన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి నితిన్ కెరియర్లో నటించినటువంటి చిత్రాలలో శ్రీ ఆంజనేయం సినిమా ఒకటి. కృష్ణ వంశీ డైరెక్షన్లో నితిన్ ఛార్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా నేటికీ 20 సంవత్సరాలు పూర్తి అయింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా చార్మి నటించిన కానీ ఫస్ట్ ఛాయిస్ ఛార్మి కాదని ఆర్తి అగర్వాల్ చెల్లెలు నటి ఆదితి అగర్వాల్ అని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ గా రాఘవేంద్రరావు డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

అదితి అగర్వాల్…
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కెరియర్ ముగిసిపోయింది. ఇక శ్రీ ఆంజనేయం సినిమాలో ఫస్ట్ ఛాయిస్ అదితి అగర్వాల్ అయినప్పటికీ ఇందులో ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సీన్లలో నటించే విషయంలో కృష్ణవంశీ అదితి అగర్వాల్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఈమె తప్పుకున్నారట. ఇక ఈమె తప్పుకోవడంతో ఈ సినిమాకు చార్మి కమిట్ అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. అయితే చార్మి గ్లామర్ కు మంచి మార్కులే పడటంతో ఆమెకు తదుపరి అవకాశాలు కూడా వచ్చాయని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Indra Movie: రీ రిలీజ్ కి సిద్ధమైన ఇంద్ర.. ఆ రికార్డు సొంతం చేసుకున్న మొదటి తెలుగు సినిమా ఇదే?

Published

on

Indra Movie: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఈయన హీరోగా ప్రేమ కథ చిత్రాలు కుటుంబ కథ చిత్రాలు అలాగే రాజకీయ నేపథ్యమున్న సినిమాలు కూడా చేశారు. ఇక యాక్షన్ సినిమాలలో కూడా చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలను తమ ఖాతాలో వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్లో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి. ఇలా ఈ బ్యానర్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాలలో ఇంద్ర సినిమా ఒకటి. అప్పటివరకు యాక్షన్ సినిమాలు చిరంజీవికి సూట్ అవ్వవు అని అందరూ భావించారు కానీ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన మొదటి యాక్షన్ సినిమా ఇంద్ర. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో అదే రోజు ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

మూడు నంది అవార్డులు..
ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ సిమ్రాన్ అనుకున్నారట కానీ ఆమె స్థానంలో ఆర్తి అగర్వాల్ నటించారు. అప్పట్లోనే ఈ సినిమా కోసం చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండా ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. 120 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని ఏకంగా 268 స్క్రీన్ లలో విడుదల చేశారు. ఏడుకోట్లతో పూర్తి అయిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమాకు మూడు విభాగాలలో నంది అవార్డులను కూడా అందుకోవటం విశేషం.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!