గురువు మీద గౌరవంతో అందంగా లేకపోయినా ఆయన కూతుర్ని చేసుకున్న
అందాల నటుడు ఎవరో మీకు తెలుసా…?
ఈ పేరు వింటే అప్పటి తరం మహిళా ప్రేక్షకులకొక పులకరింత. కాలేజ్ అమ్మాయిలకైతే కలల రాకుమారుడు. ఆ రోజుల్లో ఆ హీరో కు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. అతనే శోభన్ బాబు ఎంతో మంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్రలేకుండా చేసేవారు. అసలు ఆ టైమ్ లో ఆయన క్రేజే వేరే. చెన్నైలోని ఆయన నివాస గృహానికి కట్టలు కట్టలుగా ప్రేమలేఖలు వచ్చిపడేవి. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి, ఆయన బతికి పోయారు కానీ, లేకపోతే ఆయన రోజుకో సిమ్ చొప్పున మార్చాల్సి వచ్చేది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆయన సినిమాలు ఆకట్టుకొనేవి . కాకపోతే మహిళా ప్రేక్షకుల క్రేజ్ అలాంటిలాంటిది కాదు. అలాంటి శోభన్ బాబు.. ఒక హీరోయిన్ కోసం పరితపించారు. కనీసం ఒక్క సినిమాలోనైనా ఆమె సరసన హీరోగా చేస్తే చాలని ఫీలవుతూ ఉండేవారు. ఆయన్ను అంతగా ప్రభావితం చేసిన ఆమె మరెవరో కాదు జయలలిత. ఆమె అందం, బ్రిలియన్సీ, చమత్కారాలకు శోభన్ బాబు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో…. అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓసినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత వెయ్యిరూపాయల అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారట. ఆ తర్వాత ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడని అంటుంటారు.
డాక్టర్ బాబు సినిమాతో జయలలిత పక్కన నటించాలనే శోభన్ బాబు కోరిక తీరింది. ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా స్నేహం ప్రేమగా మారింది. ఒకానొక దశలో జయలలితను శోభన్ బాబు పెళ్లిచేసుకుంటారేమోననే పుకార్లు వినిపించేవి. కాని నిబద్దతకు నిజాయితికి నిలువుటద్దం శోభన్ బాబు. తనను తీర్చి దిద్దిన చెప్పిన గురువు గారు ఆర్థికంగా చితికి పోయి కుతురికి పెళ్లి చేయలేని స్తితిలో ఉండటం ఛూసి చలించిపోయారు. మరి ఆ గురువు గారి కూతురు జయలలిత ని పక్కన పేట్టేంత అందగత్తెనా అంటే అది కాదు కారు నలుపుతో లావుగా ఉండేవారు. ఈ మద్య ఒక ఇంటర్వ్యూలో రైటర్ ఆరుద్ర బార్య శోభన్ బాబు బార్య గురించి చాల ఘాటుగ స్పందించారు. శోభన్ బాబు గారికి బార్య విషయం లో అన్యాయం జరిగింది ఒకవేల పెళ్లి చేసుకొకపొతే ఖచ్చితంగా జయలలిత ని చేసుకునే వారు వాల్లిద్దరికి ఒకరంటే ఒకరికి చాల ఇష్టం అని చెప్పారు. అయితే ఆయన తన గురువుగారి కూతుర్ని పెళ్లిచేసుకొని ఉండడంతో, ఆమె అందంగా లేకపోయినా గురువుకిచ్చిన మాటకే కట్టుబడి , భార్యను చీట్ చేయకూదనే నియమంతో జయలలితను పెళ్లిచేసుకోకుండా, ఆవిడ్ని ఆరాధిస్తూ ఉండేవారని చెప్పుకుంటారు. శోభన్ బాబు అంటే జయలలితకి చెప్పలేనంత ఇష్టమట. శోభన్ బాబు తీసుకొన్న ఆ నిర్ణయానికి ఆమె కూడా ఎంతగానో ఆశ్చర్యపోయిందట. కేవలం గురువు మాటకి కట్టుబడి , ఆమె అందంగా లేకపోయినా చివరి వరుకూ ఆమెతోనే ప్రయాణం చేసిన శోభన్ బాబు ను మరింతగా ఆరాధించిందట జయలలిత. మొత్తం మీద భార్యను ఏ మాత్రం చీట్ చేయకుండా , జయలలితతో ఎఫైర్ కొనసాగించారని ఆ ప్రేమ జయలలిత బతికినంత కాలం నిలిచేఉందని అనుకుంటూ ఉంటారు.
Advertisement
ఏదేమైనా శోభన్ బాబు లాంటి అందగాడ్ని ప్రేమించి మరీ పడగొట్టిన హీరోయిన్ గా జయలలిత చరిత్రలో నిలిచిపోతే.. గురువుకిచ్చిన మాటకోసం జయలలితను పెళ్లిచేసుకోకుండా విలువలకే కట్టుబడ్డారు శోభన్ బాబు.
YS Jagan: ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటలలో ఎన్నికలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎన్నికల అధికారులు చేరుకొని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సొంత ఊరికి చేరుకున్నారు.
మరికొన్ని గంటలలో ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పులివెందుల బయలుదేరారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైయస్ భారతి తో కలిసి నాలుగు గంటలకు పులివెందుల బయలుదేరారు ఇక రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉంటారని తెలుస్తోంది.
పులివెందులకు సీఎం.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు ఒకవైపు పోలింగ్ ఉండటం మరోవైపు సీఎం వస్తున్నారని విషయం తెలియడంతో పులివెందులలో కట్టదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారు.
Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఈ ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రాలేకపోయింది కానీ తన తమ్ముడికి గెలుపు కోసం తన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు.
ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వారికి సూటిగా ఆ వ్యాఖ్యలు గుచ్చుకునేలా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తన తమ్ముడిపై ఉన్నటువంటి చెమట బొట్టులను తుడుస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిన్ను నమ్మని వాళ్లకోసం ఎందుకు నిలబడతావు అని నేను అడిగితే తను మాత్రం చెట్టును చూపిస్తారు అది తనని నాటిన వారికి మాత్రమే నీడను ఇవ్వదని చెబుతారు. నీపై నిందలు వేసే వారికోసం ఎందుకు నిలబడతావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తారు. తనని మొక్కనీ రైతు కంటతడపకుండా పంటనే తడుపుతుందని అప్పటినుంచి అడగటమే మానేశానని నాగబాబు తెలిపారు.
Advertisement
మార్గదర్శకు మెట్టు.. ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!అని నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. గత కొద్ది రోజులుగా ఈయన పవన్ కళ్యాణ్ జాతకాలు గురించి చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలిపారు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ చాలా మొండోడు ఎవరు చెప్పినా కూడా వినరు ఆయన కేవలం త్రివిక్రమ్ లాంటి వారు చెబితేనే వింటారు చివరికి తన అన్నయ్య చిరంజీవి చెప్పిన వినే వ్యక్తిత్వం తనది కాదని వేణు స్వామి తెలిపారు. ఇక నేను కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని తాను కూడా సీఎం కావాలని నేరు కోరుకుంటాను కానీ ఆయన జాతకం చూస్తే అది జరగదని వేణు స్వామి తెలిపారు.
పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం దాదాపు ఆయన చేసిన పది సినిమాలకు నేనే ముహూర్తాలు పెట్టానని వేణు స్వామి తెలిపారు. ఇలా ఈయనతో కలిసి గంటలు గంటలు మాట్లాడాను అయితే ఆయనంటే ఉండే ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి రావాలనే కాంక్ష వేరని వేణు స్వామి తెలిపారు.
Advertisement
సినిమాలతోనే మంచి పేరు.. ఇక రాజకీయ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలలో అవగాహన ఏమాత్రం లేదు. కుటిల రాజకీయాలు ఆయనకు తెలియవు. ఆయన నిర్ణయాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ఆయనకు రాజకీయాలు కలిసి రావు ఆయన సినిమాలకే అంకితం అవుతారు. మన అంచనాలు 100 శాతం ఉంటే.. రిజల్ట్ 20 శాతమే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడితేనే సక్సెస్ అవుతారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ గురించి ఆయన జాతకం గురించి చెబుతూ కామెంట్లు చేయడంతో అభిమానులు కాస్త కలవర పడుతున్నారు.