Connect with us

Featured

‘లడ్డు బాబు’ ఫ్లాప్‌కి కారణం డైరెక్టర్, దాసరి గారు సినిమా చూసి తిట్టారు : నిర్మాత

Published

on

సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి కథ మీద అవగాహన ఉందని బాగా వారికి వారే డబ్బా కొట్టుకుంటారు. ఏదో చేయాలని ఇంకేదో చేసి సరికి నిర్మాతను నట్టేట ముంచేస్తారు. దానివల్ల నిర్మాత అనేవాడు మళ్లీ సినిమా అన్నా సినిమా ఇండస్ట్రీ అన్నా భయంతో చమటలు పట్టి చేతులెత్తి దణ్ణం పెట్టేస్తారు. ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు చేసి నిర్మాతలని ముంచేసిన దర్శకులు చాలామందే ఉన్నారు. ఒకసారి ఒక కాంబినేషన్ హిట్ అయితే మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా చేస్తే జనాలలో క్రేజ్ ఉంటుందని ఏదో చెత్త కథ తీసుకువచ్చి నిర్మాత పాయింట్ బాగాలేదని చెప్పినా వినకుండా మీరు ఈ జనరేషన్ కి తగ్గట్టు ఆలోచించడం లేదు. మీరి డబ్బు పెట్టండి.. అంతా నేను చూసుకుంటాను అంటే బాగా
తెలిసిన వాడు కదా అని మొహమాటానికి పోయి తర్వాత భరించలేని నష్టం వచ్చి అడ్రస్ లేకుండా పోయిన నిర్మాతలు ఎంతో మంది.

Advertisement

అలాంటి నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు. మహారధి ఫిలింస్ అనే నిర్మాణ సంస్థలో అల్లరి నరేష్ హీరోగా లడ్డుబాబు సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తమ్ముడు రాజేంద్ర. ఆయనకి వ్యాపారాలు తప్ప సినిమా రంగంలో పెద్దగా అనుభవం లేదు. అయితే ఈ నిర్మాణ సంస్థలో వాళ్ళ నాన్నగారు మహారది సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆయన పేరు మీద స్థాపించిన దీని మీదే రవిబాబు దర్శకుడిగా లడ్డు బాబు నిర్మించారు. రవి బాబు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా మారుతూ అల్లరి సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు నరేష్ ని హీరోగా పరిచయం చేశాడు.

అల్లరి సినిమా హిట్ అవడంతో ఏకంగా నరేష్ పేరు అల్లరి నరేష్ గా మారింది. ఈ సినిమా ఎలా హిట్ అయిందో హిట్ అయింది. ఆ తర్వాత నుంచి రవిబాబు దర్శకుడుగా నువ్విలా, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, లడ్డు బాబు, అదుగో, ఆవిరి లాంటి సినిమాలు తీశాడు. వీటిలో ఒక్క నచ్చావులే తప్ప మిగతావేవి పెద్దగా హిట్ సాధించలేదు. కొత్తగా తీయడానికి ట్రై చేస్తున్న రవిబాబు సెకండాఫ్ కథ సరిగ్గా డీల్ చేయలేదని టాక్ వినిపిస్తుంది. భూమికతో తీసిన అనసూయ, తరుణ్ – ఆర్తి అగర్వాల్ తో తీసిన సోగ్గాడే, అమరావతి లాంటి సినిమాలు బావున్నప్పటికి బ్లాక్ బస్టర్ అయింది లేదు.

అయితే రవిబాబు తీసిన కొన్ని సినిమాలు మరీ భారీగా నష్టపోయినవి లేవు. అందుకే నిర్మాతలు ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో అల్లరి తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ – రవిబాబు కాంబినేషన్ లో లడ్డు బాబు సినిమా వచ్చింది. సన్నగా చీపురు పుల్లలా ఉండే నరేష్ ని ఎయిర్ బెలూన్ లా చూపించాడు. ఏదో దోమ కుట్టి వైరస సోకడంతో ఉన్నపలంగా లడ్డు బాబు లావుగా మారిపోతాడు. అతనికి పెళ్ళిచేయాలనుకున్న తండ్రికి అదొక సమస్యగా మారుతుంది. అయితే పుట్టిన బిడ్డకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, అంగ వైకల్యం ఉన్న తల్లీ తండ్రికి ఆ బిడ్డ ఎప్పటికీ బంగారమే.

ఇది ప్రపంచంలో ప్రతీ తల్లి తండ్రికి ఉండే పేగు బంధం. ఒక వ్యక్తిలోని లోపాలను, అంగ వైకల్యాన్ని ప్రపంచం మొత్తం హేళన చేసినా అమ్మా, నాన్నలు మాత్రం బిడ్డను అపురూపంగా చూసుకుంటారు. అయితే ఇదే పాయింట్ ను రవిబాబు రివర్స్ లో చెప్పి ఏదో కొత్తగా దేశానికి చెప్పాలనుకున్నాడు. ఈ పాయింటే సరైనది కాదు. హ్యూమన్  ఎమోషన్ ఎప్పుడు నెగిటివ్ గా చూపిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ఇదే విషయం నిర్మాత నెత్తి నోరు కొట్టుకొని దర్శకుడు రవి బాబుకి చెప్పాడు. అయినా ఆయన వినిపించుకోలేదు. మీరు ఇంకా ఓల్డ్ మైండ్ సెట్ అండ్ థింకింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ కి కావాల్సింది ఇలాంటి కథలే అని మొండిగా వాధించాడు.

దానికి హీరో నరేష్ కూడా వంతపలికాడు. మేమేదో కుర్రాళం. సరదాగా సినిమా చేసుకుంటున్నాము. పైగా మా కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. మీరు చూస్తు ఉండండి అంకుల్. మంచి సినిమా అవుతుందంటే నిర్మాత కథలో ఉన్న లోపాలను సరిచేయలేక సరే అన్నాడు. తీరా సినిమా ఫస్ట్ కాపీ చూసిన దర్శకరత్న దాసరి నారాయణ రావుగారు.. తిట్టి పెట్టారు. మీ నాన్నగారి బ్యానర్ మీద ఇలాంటి సినిమా తీస్తావా. కొద్దిగైనా ఆలోచన ఉందా. ఇంత దరిద్రమైన కథ తప్పితే వేరేది దొరకలేదా అన్నారట. ఆయన అన్నట్టుగానే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక మంచి ఆఫర్ వచ్చినప్పుడు కూడా రవిబాబు దాన్ని వద్దని ఇంకా పెద్ద ఢీల్ వస్తుందని చివరికి సినిమా ఎవరూ కొనని పరిస్థితికి తీసుకు వచ్చాడు. ఫలితంగా లడ్డు బాబు నిర్మాతకి భారీ నష్టాలను మిగిల్చింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!