Connect with us

Movie News

వీళ్లను చూస్తే మీరు అస్సలు గుర్తుపట్టరు

Published

on

ఒకప్పుడు టాలీవుడ్ తెరమీద తళుక్కున మెరిసి … మాయమైన ఈ అందాల భామలు
ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

Advertisement

వాళ్లంతా ఒకప్పుడు టాలీవుడ్ లో తళుక్కున మెరిసిన అందాల తారలు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. అందం , అభినయం కలబోసిన ఆ ముద్దు మందారాలు .. చేసినవి అతి తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసారు. కెరీర్ లో మంచి హిట్స్ పడిన తరుణంలోనే ఏం జరిగిందో కానీ, సినీ జీవితానికి గుడ్ బై చెప్పేసి, వేరే రూట్లో పయనిస్తున్నారు. మరి వీళ్లంతా ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అనే ఆతృత అందరికీ ఉండడం సహజం.

ముందు గా ఈ లిస్ట్ లో ఉన్న అందాల తార అపర్ణ. నైంటీస్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సుందర కాండ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దు గుమ్మ, ఈ సినిమా తర్వాత అక్కపెత్తనం చెల్లెలి కాపురం అనే ఒక్క సినిమా మాత్రమే చేసి తెలుగు తెరకు టాటా చెప్పేసింది. బెంగళూర్ కు చెందిన అపర్ణ ఈ సినిమా తర్వాత హిందీలో నాక్ అవుట్ అనే సినిమాలో మాత్రమే నటించి,2002 లోనే యు.ఎస్ శాన్ ఫ్రాన్సిస్కో లో సెటిల్ అయిపోయింది. చక్కటి భర్త, ముద్దులొలికే ఇద్దరు పిల్లలతో అపర్ణ అక్కడే హ్యాపీగా ఉంటున్నారు.

Advertisement

ఇక అతి తక్కువ సినిమాలతో ఇండియన్ స్ర్కీన్ మీద కనిపించి మాయమైన మరో అందాల హీరోయిన్ గిరిజ. తండ్రి కర్ణాటకకు చెందిన వైద్యుడు, తల్లి ఇంగ్లాండుకు చెందిన వ్యాపారవనిత. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది. భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.

1989లో మణిరత్నం గీతాంజలితో సౌత్ స్ర్కీన్ మీద మెరిసింది. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఆమె ఆ తర్వాత కాలంలో పెద్ద హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ఆమె వందనం అనే ఒక మలయాళ సినిమాలోనూ, హృదయాంజలి అనే మరో తెలుగు సినిమాలో మాత్రమే నటించగలిగింది. గిరిజ ప్రస్తుతం రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు మరియు సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉంది. 2005 నుండి లండన్ లో ఆరోగ్య సంబంధ విషయాల విలేఖరిగా పనిచేస్తున్నది. ప్రస్తుతం గిరిజ అక్కడే ఉంటోంది.

Advertisement

తెలుగు తెరమీద అతి తక్కువ సినిమాల్లో నటించిన మరో అందాల తార మీనాక్షి శేషాద్రి. పెయింటర్ బాబు అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన మీనాక్షి.. అతి తక్కువ టైమ్ లోనే నెం. 1 హీరోయిన్ అయింది. బాలీవుడ్ బడా హీరోల సరసన నటించి, మెప్పించిన మీనాక్షి కి తెలుగు లో బాగా క్రేజీ తెచ్చిపెట్టిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటైమ్ లో తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి మేనకగా అదరగొట్టేసింది.అంతకన్నా ముందు జీవనపోరాటం సినిమాలో కేమియో రోల్ పోషించింది. ఆ తర్వాత విశ్వనాథ్ , చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు లో మెరిసింది. 1998 వరుకూ మీనాక్షి బాలీవుడ్ తెరమీద లెక్కకు మించిన చిత్రాల్లో నటించి, చాలా ఏళ్లకు మళ్లీ 2016 లో సన్నిడియోల్ తో ఘాయల్ వన్స్ ఎగైన్ లో గెస్ట్ పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మీనాక్షి శేషాద్రి, యూ.ఎస్. లో సెటిలైంది. అక్కడ చెరిష్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తోంది. భర్త హరీష్, కేంద్ర, జోష్ , మ్యాట్ ఆమె పిల్లలు.

భద్రాచలం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి సింధు మీనన్ కూడా ఇప్పుడు సినిమాలు వదిలేసి దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టేసింది. రష్మి అనే కన్నడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన సింధు మీనన్ ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలతో సౌత్ స్ర్కీన్ మీద మంచి పేరు తెచ్చుకుంది. త్రినేత్రం, శ్రీరామచంద్రలు, ఆడంతే అదో టైపు, ఇన్స్ పెక్టర్ అనే సినిమాలు చేసినా కృష్ణవంశీ చందమామ అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 2010 ఏప్రిల్ లో డామ్నిక్ ప్రభు అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లిచేసుకొని యూ.ఎస్ లో సెటిల్ అయింది. ఆమెకు స్వెట్లానా అనే ఒక అమ్మాయి. సింధు మీనన్ ఆఖరి తెలుగు సినిమా సుభద్ర. సో.. అలా ఈ నలుగురు అందగత్తెలు .. మెరుపు తీగల్లా మెరిసి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!