Connect with us

Movie News

‘నా ఇంటి నెంబరు 13…’ ప్రమోషనల్‌ సాంగ్‌తో హల్‌చల్‌ చేస్తున్న రాజలక్ష్మీ

Published

on

డిఫరెంట్‌ హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇంటి నెం.13’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ఇప్పటికే ఆడియన్స్‌లో ఒక బజ్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఇప్పుడు మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాటలోనే మేకింగ్‌ విజువల్స్‌ను కూడా జోడించారు. దీంతో సినిమాని ఎంత కష్టపడి తీశారు, ఎలాంటి క్వాలిటీతో చేశారు అనేది ఈ పాట చూస్తే అర్థమవుతుంది.

Advertisement

కాలింగ్‌బెల్‌, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని ఆ చిత్రాలకు ఎన్నో రెట్లు క్వాలిటీతో రూపొందించారు. కంటెంట్‌ పరంగా ఇప్పటివరకు వచ్చిన హారర్‌ సినిమాలకు భిన్నంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 1న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు.

విడుదలైన ప్రమోషన్‌ సాంగ్‌ గురించి డైరెక్టర్‌ పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘సినిమా కాన్సెప్ట్‌ను, మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లో ‘సామి..’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె ఎంతో హుషారుగా, మరెంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. ఈ వీడియోలో మేకింగ్‌ విజువల్స్‌ని కూడా జోడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఈ పాట మా సినిమా ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం మాకు వుంది. మార్చి 1న విడుదలవుతున్న మా ‘ఇంటి నెం.13’ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. హారర్‌ జోనర్‌లో ‘ఇంటి నెం.13’ డెఫినెట్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో చేయించిన ఈ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్‌ అవుతాయి. ఔట్‌పుట్‌ అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాత హేసన్‌ పాషాగారు ఖర్చుకు వెనకాడకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమా రావడానికి సహకరించారు. ‘ఇంటి నెం.13’ తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుంది’’ అన్నారు.

Advertisement

నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ ‘‘తెలుగు ఆడియన్స్‌ ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే హారర్‌ మూవీస్‌ ఎక్కువగా రాలేదు. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు.

నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌, ఎడిటింగ్‌: సాయినాథ్‌ బద్వేల్‌, కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పన్నా రాయల్‌, పాటలు: రాంబాబు గోశాల, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!