Connect with us

Featured

Bahumukham: బహుముఖం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

Published

on

Bahumukham: హర్షివ్ కార్తీక్ నిర్మించి దర్శకత్వం వహించిన తాజా సినిమా బహుముఖం. ఇందులో యా మార్టినోవా ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు. కాగా ఇటీవల ఏప్రిల్ 5న రిలీజయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్న వివరాల్లోకి వెళితే..

Advertisement

కథ :

కథ విషయానికి వస్తే.. తన్వీర్ ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడి ఉంటారు. తన్వీర్ వాళ్ళ అమ్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ యాక్టర్ కాలేకపోతుంది. డాంతో తల్లి కలని నిజం చేయాలని చిన్నప్పుడు అనుకుంటాడు తన్వీర్. అయితే అనుకోకుండా జైలుకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. బయటకి వచ్చాక నటుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు తన్వీర్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూ ఉంటాయి. జైలు నుంచి బయటకు రావడంతో అతనికి ఒక కౌన్సిలర్ కూడా ఉంటుంది. ఒక సారి సైకో పాత్ర ఆడిషన్ ఇస్తే సరిగ్గా చేయలేదని విమర్శిస్తారు. దీంతో అతను ఎలాగైనా ఆ పాత్రని బాగా చేయాలని, మంచి నటుడు అవ్వాలని బాధపడుతూ, దానికోసం నిజమైన సైకోలా మారిపోయి హత్యలు చేస్తాడు. అసలు తన్వీర్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? తన్వీర్ ఎందుకు సైకోలా మారిపోయాడు? తన్వీర్ ఎందుకు హత్యలు చేశాడు? ఈ విషయాలు అన్ని తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : కాగా డైరెక్టర్ హర్షివ్ కార్తీక్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ మరో పక్క ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి అన్ని అతనే కావడం విశేషం. కాగా ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేశారు. దీంతో అక్కడ ఉన్న ఇండియన్స్, అమెరికా నటీ నటులతో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడా కథ కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం బాగా రాసుకున్నారు. కానీ థ్రిల్లింగ్ సినిమాకి సరిపడా ట్విస్టులు మాత్రం లేవని అనిపిస్తుంది.

Advertisement

నటీనటుల పనితీరు : ఈ సినిమా మెయిన్ లీడైన హర్షివ్ కార్తీక్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు. ఒక పక్క నటుడు అవ్వాలనే తపనతో, మరో పక్క సైకోగా అదరగొట్టాడు తన్వీర్. స్వర్ణిమ సింగ్ హీరోయిన్ అని చెప్పినా కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపిస్తుంది. ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్న పర్వాలేదని అనిపించింది. అమెరికన్ నటి మరియా మార్టినోవా మెప్పిస్తుంది. ఇక మిగిలిన నటీ నటులంతా అమెరికాలో ఉండే వాళ్లనే తీసుకోవడంతో తెలిసిన స్టార్ కాస్ట్ ఎవరూ లేకపోయినా వారి పరిధి మేరకు నటీంచారు.

సాంకేంతికత : ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. అలాగే అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ల్యూక్ ఫ్లెచర్ విజువల్స్ చాలా బాగున్నాయి. కథకి తగ్గట్టు అమెరికాని బాగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. కథను కొత్తగా చూపించడానికి హర్షివ్ కార్తీక్ బాగానే ప్రయత్నించారు.

Advertisement

ప్లస్ పాయింట్స్ : నటీనటుల పనితీరు, మ్యూజిక్

మైనస్ పాయింట్స్ : తెలిసన కథ కావడం

Advertisement

రేటింగ్ : 3

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!