Revanth Reddy: 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఘోరమైన ఓటమిని చవి చూసింది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఓటమిపై ఇంకా వైసీపీ అభిమానులు ఈ ఫలితాల నుంచి బయటపడలేకపోతున్నారు.
ఇక జగన్మోహన్ రెడ్డి సైతం ఈ స్థాయిలో ఓటమి ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయి ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలను తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారని తెలిపారు. మనం చేసిన పాపాలు మనల్ని మింగుతాయని చెప్పటానికి ఇదే నిదర్శనమని రేవంత్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆయనకు 151 సీట్లను ఇచ్చారని తెలిపారు.
Advertisement
జగన్ తప్పు చేశారు.. ఆయన తప్పులు చేయటంతోనే అదే ప్రజలు గద్దె దించారని తెలిపారు. ఇక ఈయన తన ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదని తద్వారా వారంతా ఇతర పార్టీలలోకి వెళ్లి నేడు ఎంపీలుగా మంత్రులుగా కూడా కొనసాగుతున్నారని తెలిపారు. జగన్ నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయన్నారు. ఫలితంగా రాష్ట్రం పైన ప్రభావం చూపిందని చెప్పారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించాననే విమర్శల్లో వాస్తవం లేదని తెలిపారు.
Shirish: మెగా మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ మొదటి మాజీ భర్త ఆయన ఈయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మరణించారు. 2007వ సంవత్సరంలో శ్రీజ శిరీష్ ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప జన్మించిన తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన శిరీష్ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు రెండో భర్తకు కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇటీవల తన మొదటి మాజీ భర్త చనిపోవడంతో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా శిరీష్ తల్లి మాట్లాడుతూ.. నా కొడుకు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అవన్నీ తప్పుడు వార్తలని తెలిపారు. తన పుట్టినరోజు మే 13వ తేదీ ఫారెన్ వెళ్లి సెలబ్రేషన్ జరుపుకున్నారు. తిరిగి వచ్చినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా అపోలో హాస్పిటల్లో చేర్పించామని, అయితే కార్డియాక్ అరెస్టు కారణంగా తన కుమారుడి చనిపోయినట్లు తెలిపారు.
Advertisement
ఇక శిరీష్ మరణ వార్తను మెగా కుటుంబానికి చెప్పాము కానీ వాళ్ళు ఎవరు రాలేదని ఈమె తెలియజేశారు. ఇక తన మనవరాలు నివృత్తి అచ్చం తన తండ్రి పోలికలతోనే ఉంటుందని తనని చూస్తే నాకు నా కొడుకే గుర్తుకు వస్తారని ఈమె తెలిపారు.. ఎవరికైనా వారి మనవరాలని కలుసుకోవాలని ఉంటుంది నాకు కూడా నివృత్తిని చూడాలని ఉందని ఈమె తెలిపారు. కార్డియాక్ అరెస్ట్.. ఇక వారిద్దరు ఎందుకు విడిపోయారనే విషయం నాకు తెలియదు కానీ మెగా ఫ్యామిలీ మాకు 33 కోట్లు ఇచ్చిందంటూ కూడా వార్తలు వచ్చాయి . అది పూర్తిగా అవాస్తవమని కొందరు మాకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పినా, మాకు వద్దు పాప కోసమే ఉపయోగించమని చెప్పామని ఈ సందర్భంగా శిరీష్ భరద్వాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pokiri Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈయన సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇక గతంలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరికీ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించిన పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో తన సినిమాలు సక్సెస్ అందుకోలేకపోతున్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పూరి జగన్నాథ్ పోకిరి సినిమా గురించి సంచలనం వ్యాఖ్యలు చేశారు పూరీ డైరెక్షన్లో మహేష్ బాబు ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే .ఇందులో పూరి జగన్నాథ్ టేకింగ్ మహేష్ బాబు మాస్ యాక్టింగ్ ఇలియానా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి.
ఈ సినిమా ఇలాంటి విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఊహించని విధంగా సక్సెస్ కావడంతో ఇటు పూరి జగన్నాథ్ మహేష్ బాబు కూడా షాక్ లో ఉన్నట్టు వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత తాను చేసిన సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఈ క్రమంలోనే చాలామంది పోకిరి లాంటి హిట్ పడలేదని చెప్పేవారు.
Advertisement
క్లైమాక్స్ హైలెట్.. ఇలా ప్రతి ఒక్కరు చెబుతుంటే అసలు ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి ఇందులో ఏముంది అని నేను ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా వేసుకొని మరీ చూసాను అప్పటికి కూడా నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు ఈ సినిమా హిట్ అయింది అని నేను సందేహంలోనే ఉన్నానని పూరి జగన్నాథ్ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం సినిమా క్లైమాక్స్ అనే చెప్పాలి. ఈ క్లైమాక్స్ సీన్ చూడటం కోసం రిపీటెడ్ గా జనాలు థియేటర్లకు వెళ్తున్నారని అందుకే ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని తెలుస్తోంది.
Mokshagna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులందరికీ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడిగా ఈయన ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగు పెడతారా అంటూ బాలకృష్ణ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ సంవత్సరాలు గడుస్తున్న ఇంకా క్లారిటీ రాలేదు.
ఇకపోతే ఈసారి మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా ఉంటుందని ఇప్పటికే ఈయన ఎంట్రీ కోసం అన్ని సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఇకపోతే మోక్షజ్ఞని ఏ డైరెక్టర్ చేతుల మీదుగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారన్న ప్రశ్న అభిమానులలో కలుగుతుంది. మోక్షజ్ఞను బోయపాటి లాంచ్ చేయబోతున్నారని, కాదు అనిల్ రావిపూడి అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇప్పటికీ క్లారిటీ లేదు.
ఇకపోతే మోక్షజ్ఞను లాంచ్ చేయబోయే డైరెక్టర్ల జాబితాలో మరో యంగ్ డైరెక్టర్ పేరు వినపడుతోంది ఈ ఏడాది హనుమన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మరో వార్త వైరల్ అవుతుంది.
Advertisement
ప్రశాంత్ వర్మ…
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఫోటోలలో మోక్షజ్ఞ పూర్తిగా తన లుక్ మార్చేసి ఉండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.