ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు. ఈ విధంగా చిన్న వయసులోనే గుండెజబ్బు బారిన పడడానికి గల కారణాలు ఎక్కువ మద్యానికి బానిస కావడం, పొగ తాగటం,మారుతున్న ఆహారపు అలవాట్ల కు అనుగుణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే పది కాలాల పాటు మన గుండె భద్రంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎక్కువమంది తీసుకునే ఆహారం ఫాస్ట్ ఫుడ్ కావడంతో అందులో అధిక రసాయనాలతో కూడిన మసాలాలు జోడించడం వల్ల ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడంతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి.అలాగే తినాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ మోతాదులో తినటం వల్ల ఊబకాయం ఏర్పడి గుండె సంబంధిత వ్యాధులు చోటు చేసుకుంటున్నాయి.దీని వల్ల మన శరీరంలో ఎక్కువ భాగం చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
మన గుండె ఎంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ భాగం నారింజ, నిమ్మ పండ్లను తీసుకోవాలి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. అంతేకాకుండా చిరుతిండిగా తీసుకునే బిస్కెట్స్, చిప్స్ వంటి స్నాక్స్ లో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే కొవ్వులు ఉంటాయి. వీలైనంత వరకు వాటిని తగ్గించడం ఎంతో ఉత్తమం. మనం తీసుకునే ఆహారంలో సమానంగా కొలెస్ట్రాల్, కొవ్వు శాతం ఉంటే గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.
సిట్రస్ జాతి పండ్లులతో పాటు మిగతా తాజా కూరగాయలు పండ్లు, గుడ్లు, మాంసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.క్వెర్సెటిన్ పండ్లు, కూరగాయలు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి హృదయ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాకుండా పాలు తీసుకోవటం ద్వారా అందులో ఉన్న క్యాల్షియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.ఈ విధమైన ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.