Connect with us

Featured

గుండె పదిలంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..!

Published

on

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు. ఈ విధంగా చిన్న వయసులోనే గుండెజబ్బు బారిన పడడానికి గల కారణాలు ఎక్కువ మద్యానికి బానిస కావడం, పొగ తాగటం,మారుతున్న ఆహారపు అలవాట్ల కు అనుగుణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే పది కాలాల పాటు మన గుండె భద్రంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

Advertisement

ప్రస్తుతం ఎక్కువమంది తీసుకునే ఆహారం ఫాస్ట్ ఫుడ్ కావడంతో అందులో అధిక రసాయనాలతో కూడిన మసాలాలు జోడించడం వల్ల ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడంతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి.అలాగే తినాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ మోతాదులో తినటం వల్ల ఊబకాయం ఏర్పడి గుండె సంబంధిత వ్యాధులు చోటు చేసుకుంటున్నాయి.దీని వల్ల మన శరీరంలో ఎక్కువ భాగం చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మన గుండె ఎంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ భాగం నారింజ, నిమ్మ పండ్లను తీసుకోవాలి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. అంతేకాకుండా చిరుతిండిగా తీసుకునే బిస్కెట్స్, చిప్స్ వంటి స్నాక్స్ లో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే కొవ్వులు ఉంటాయి. వీలైనంత వరకు వాటిని తగ్గించడం ఎంతో ఉత్తమం. మనం తీసుకునే ఆహారంలో సమానంగా కొలెస్ట్రాల్, కొవ్వు శాతం ఉంటే గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.

Advertisement

సిట్రస్ జాతి పండ్లులతో పాటు మిగతా తాజా కూరగాయలు పండ్లు, గుడ్లు, మాంసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.క్వెర్సెటిన్ పండ్లు, కూరగాయలు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి హృదయ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాకుండా పాలు తీసుకోవటం ద్వారా అందులో ఉన్న క్యాల్షియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.ఈ విధమైన ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!